koodali

Friday, May 11, 2018

ఓం..కొన్ని సందేహాలు..సమాధానాలు..


ఈ విషయాలను 1999 నాటి ఆంధ్రభూమి పత్రికలో చదివి, ఈ విషయాన్ని మరింతమందికి తెలిపితే బాగుంటుందనిపించి పోస్ట్ చేసాను. 

ఒకరు అడిగిన సందేహానికి .. కె.ఎస్.ఎన్. శమంతకమణి అనేవారు  ఈ  విధంగా రిప్లై ఇవ్వటం జరిగింది.



సందేహం.. దేవతల్లో చాలామందికి ఇద్దరు భార్యలున్నారు ఎందుకు?


సమాధానం .. దేవత అనేది ప్రతీకాత్మకమైన ఒక తేజస్సు. నిర్దేశించబడినట్టి కొన్ని శక్తులకు సంకేతమే దేవత.



ఆయా దేవతలు వారి భార్యలు , అలంకారాలు, ఆయుధాలు అన్నీ కూడా ప్రతీకలే ( సింబాలిక్ అన్నమాట.) 



ఉదాహరణకు -స్థితికారకుడై సర్వసృష్టి పాలన పోషణలను నిర్వహించే విష్ణుమూర్తి భార్యలు  శ్రీదేవి, భూదేవి  .  సర్వసంపత్సమృద్ధియే లక్ష్మీ దేవి.   భూదేవి అనగా  భూమి, భూసంబంధమైన సర్వ భూ, జల, వనాది సహజ సంపదా,   లక్ష్మీదేవి- అనగా సర్వ ఐశ్వర్యమూ , సర్వ వస్తు, ధనసంపదా-   విష్ణువు అధీనంలో ఉన్నాయనే విషయానికి  సంకేతమే -   లక్ష్మీదేవి, భూదేవి  విష్ణుమూర్తి భార్యలని చెప్పడంలో అంతరార్ధం.



ఆ విధంగానే  విఘ్నేశ్వరుని భార్యలు సిద్ధి, బుద్ధి. ఆ వినాయకుని పుత్రులు క్షేముడు, లాభుడు. అనగా విఘ్ననాయకుడైన గణపతి విఘ్నాలను అదుపు చేసేవాడనీ, బుద్ధి కుశలతనూ , ధనసిద్ధి, విద్యాసిద్ధి, కార్యసిద్ధి ఇటువంటి సర్వసిద్ధులనూ, క్షేమలాభాలనూ కలిగించే దైవం అని సాంకేతికంగా తెలియజేయటమే.



దైవాలకు సంబంధించిన అంశాలను ఇదే విధంగా  అర్ధం చేసుకోవాలి.


............

  ఇలాంటి సందేహాలు చాలామందికి కలుగుతాయి.


 సందేహం అడిగిన వారికి, చక్కటి సమాధానం ఇచ్చిన కె.ఎస్.ఎన్. శమంతకమణి గారికి  మరియు అందించిన  పత్రిక వారికి  ధన్యవాదాలు.

 

No comments:

Post a Comment