koodali

Friday, April 7, 2017

ముహుర్తములు..కొన్నివిషయములు .. ఒకటవ భాగము ..


ఈ సంవత్సరం ఉగాది సందర్భంగా కొన్ని సందేహాలు నెలకొన్నాయి.
కొందరు 28న అని, మరికొందరు 29న అని అంటున్నారు.


 కొందరేమో 29న సూర్యోదయానికి ముందే పాడ్యమి ముగుస్తున్నట్లు అంటున్నారు.
కొందరేమో సూర్యోదయం తరువాత కూడా కొంతసేపు పాడ్యమి ఉన్నట్లు అంటున్నారు.
 
హిందువులు సూర్యోదయం ప్రకారం లెక్క చూస్తారు.

ఇప్పుడు వసంతనవరాత్రోత్సవాలు నిర్వహిస్తారు.నవరాత్రులు అనటంలోనే రాత్రి అనే పదం ఉన్నది. 


మరి, 29న సూర్యోదయానికి పూర్వమే పాడ్యమి ముగిస్తే, 29 న పాడ్యమి అని అనుకోవచ్చో లేదో అని సందేహం అనిపిస్తుంది. ...
 
.ఈ విధంగా గమనిస్తే, 28న రాత్రి పాడ్యమి తిధి ఉంది కాబట్టి, 28న ఉగాది పండుగ చేసుకోవచ్చనిపిస్తోంది.

ఎక్కువ సందేహం ఉన్నవారు 28 మరియు 29 కూడా ఉగాది పండుగ జరుపుకోవచ్చేమో ?

*************

ఇంకో విషయం ఏమిటంటే,ఒకే రాష్ట్రంలో సూర్యోదయం విషయంలో విపరీతమైన తేడా ఉండదు.

ఈ మధ్య కాలంలో గమనిస్తే, కొన్ని క్యాలెండర్లలో  నక్షత్రాలు, తిధుల కాలం విషయంలో చాలా తేడాలు వ్రాస్తున్నారు . ఇలా ఎందుకు జరుగుతుందో అర్ధం కావటం లేదు.
ఇవన్నీ గమనిస్తే, చాలా అయోమయంగా ఉంటుంది.

ఒకే రాష్ట్రంలో కూడా తిధులు, నక్షత్రాల విషయంలో క్యాలెండర్లో ఎక్కువ తేడాలు ఉన్నప్పుడు ముహూర్తాలు , జాతకాలలో కూడా అయోమయం ఏర్పడే పరిస్థితి ఉంటుంది.

********

ఇక, పండుగ రెండురోజులు అనే సందేహం వచ్చినప్పుడు కొందరికి లాభం కూడా ఉంటుంది.

ఉదాహరణకు.. స్త్రీలకు నెలసరి వచ్చే సందేహంగా ఉన్నప్పుడు 28న ఉగాది జరుపుకోవచ్చు.

ఇక 4 లేక 5వరోజు సమస్య ఉన్నవారు నెలసరి తరువాత తలస్నానం చేసి 29న దైవానికి నమస్కారం చేసుకోవచ్చు.
******

పంచాంగం గురించి నాకు తెలిసిన విషయాలు తక్కువ. తెలిసినంతలో వ్రాసాను.
వ్రాసిన వాటిలో ఏమైనా పొరపాట్లు ఉంటే దయచేసి క్షమించాలని దైవాన్ని ప్రార్ధిస్తున్నాను.
************

పండుగ ఎప్పుడు చేసుకోవాలి ? అనేది ముఖ్యమే కానీ , పండుగ ఎంత భక్తితో చేసుకున్నారనేది మరింత ముఖ్యం.
 
 

No comments:

Post a Comment