koodali

Friday, March 24, 2017

శ్రీ దేవీ భాగవతము గ్రంధములోని కొన్ని విషయములు.. మరి కొన్ని విషయాలు..



శ్రీ మాత్రే నమః శ్రీ పరమాత్మనే నమః 
***********
శ్రీ దేవీ భాగవతము గ్రంధములోని కొన్ని విషయములు..

నిర్గుణుడూ నిర్లేపుడూ కేవలం పరమాత్మ ఒక్కడే. అతడు అవ్యయుడు, అలక్ష్యుడు, అప్రమేయుడు, సనాతనుడు. అలాగే ఆదిపరాశక్తి కూడా కేవల నిర్గుణ. దుర్ జ్ఞేయ, బ్రహ్మ సంస్థిత, సర్వభూత వ్యవస్థిత. ఈ పరమాత్మపరాశక్తులది అవిభాజ్యమైన నిత్య సంయోగం. వీరు అభిన్నులు. ఇది తెలుసుకుంటే సర్వదోషాలూ పటాపంచలవుతాయి. ఈ జ్ఞానంతోనే మోక్షమని ఘోషిస్తోంది వేదాంత డిండిమం . ఇది తెలుసుకున్నవాడు త్రిగుణాత్మక సంసారం నుంచి విముక్తుడైనట్టే.

**************

ఇక్కడ నా అభిప్రాయాలు  కొన్నింటిని వ్రాస్తాను.


పాతకాలంలో సంగతి ఎలాఉండేదో కాని, ఈ రోజుల్లో టెక్నాలజీ పెరిగి ప్రసారమాధ్యమాలు బాగా అందుబాటులోకి వచ్చాక ఎన్నో మార్పులు వచ్చాయి.

ఇప్పుడు ప్రజలు ఎక్కువమంది అన్నికులాలవారూ  కూడా   పూజల గురించిన నియమాల గురించి ఎక్కువగా తెలుసుకోవటానికి ఆసక్తి చూపిస్తున్నారు.

హిందువులకు ఎన్నో పండుగలు ఉన్నాయి. పాతకాలంలో శైవులు, వైష్ణవులు, ఇలా అనేక పద్ధతులు ఉండేవి. ఒక విధానాన్ని ఆచరించేటప్పుడు పండుగలు కొన్ని ఉంటాయి.

 శివుణ్నీ, విష్ణువును, ఇంకా అందరు దేవతలనూ ఆరాధించేవారికి ఎక్కువ పండుగలు ఉంటాయి.ఇలాంటప్పుడు ఎక్కువరోజులు నియమాలు పాటించే పరిస్థితి కూడా ఉండవచ్చు.

 మాకు శక్తి ఉంది ఎక్కువ దేవతలను ఆరాధించదలనుకుంటున్నాము అనుకునే వాళ్ళు అలాగే ఆరాధించుకోవచ్చు.


 శక్తిలేనివాళ్ళు మితంగా పూజలు చేస్తూ కూడా  ఎందరో దేవతలను ఆరాధించుకోవచ్చు   లేక   ఒకే దైవాన్ని ఆరాధించవచ్చు..

 లేక, అందరు దేవతలను ఒకే దైవంగా ఆరాధించవచ్చు.

 ఉదా..లలితాదేవిని ఆరాధించటం ద్వారా అందరు దేవతలను ఆరాధించినట్లే ..అని పండితులు తెలియజేసారు.


హిందూ మతంలో ఎన్నో సౌలభ్యాలు ఉన్నాయి. పెద్దలు ఎన్నో విధానాలను తెలియజేశారు.

దైవాన్ని నిరాకారంగా కూడా ఆరాధించుకోవచ్చు.ఎవరి ఇష్టాన్ని బట్టి వారు ఆరాధించుకోవచ్చు.

ప్రాచీనులు ఏం చెప్పారంటే, శూద్రులు తమ స్వధర్మాన్ని ధర్మబద్ధంగా నిర్వర్తిస్తూ కొద్దిగా పూజ చేసినా చాలు, గొప్ప ఫలితాన్ని పొందుతారని తెలియజేసారు. మహాభారతంలో ధర్మవ్యాధుని కధ  ద్వారా ఈ విషయం తెలుస్తుంది.

 మన ప్రాచీనులు సమాజబాగు కొరకు చక్కటి ఆచారాలను ఏర్పరిచారు.

అయితే, కొందరు ప్రజల తెలిసీతెలియక మరియు విపరీత ధోరణి వల్ల ప్రాచీనులు ఏర్పరిచిన ఎన్నో ఆచారాల  అసలు ఉద్దేశ్యాల రూపులు  మారే  విధంగా తయారయ్యాయి.


 నా అభిప్రాయం ఏమిటంటే,  జీవితంలో  ఎప్పుడూ దైవాన్ని ఆరాధించుకోవచ్చు. 

నైతికవిలువలతో జీవించటం గొప్ప పూజ. ఇలా జీవించేవారు దైవకృపకు పాత్రులవుతారు. చక్కటి విలువలతో జీవించటానికి కనీసం ప్రయత్నించాలి.

ధర్మసంకటం కలిగినప్పుడు, మనల్ని సరైన దారిలో నడిపించాలని దైవాన్ని శరణు కోరటం మంచిది.


No comments:

Post a Comment