koodali

Monday, January 30, 2017

ఓం...శ్రీ శనిదేవుని మహిమలు..


 
మానవుల లక్ష్యం మోక్షాన్ని పొందటం( పరమాత్ముని పొందటం.) 

అందుకు చక్కటి పద్ధతులతో కూడిన జీవనవిధానాన్ని పాటించటానికి ప్రయత్నించాలి. 

 శనిదేవుడు ఎంతో కరుణామయుడు.శనిదేవుని కధల ద్వారా మనం ఈ విషయాన్ని తెలుసుకోవచ్చు. 

 శనిదేవుని మహిమలు  చాలా  భాగాలుగా ( హిందీలో ధారావాహికగా ) imagin T.V. లో వచ్చాయి...

   శనిదేవుని మహిమలు చాలా బాగుంటాయి.ఈ మహిమలలో  పురాణేతిహాసాలలోని  కధలు  కూడా  ఉన్నాయి.

 తెలుగులో " మా "  టీవీలో  " శ్రీ  శనిదేవుని మహిమలు " ధారావాహికగా వచ్చాయి... 

ఆసక్తి ఉన్నవారు  ఈ లింకుల వద్ద  కొన్నింటిని ప్రయత్నించ గలరు.


Mahima Shani Dev Ki -( Epi 100)- Video Daily motion.........

పై లింక్ వద్ద  రాకపోతే,

Mahima ShaniDev Ki Epi 100- YouTube ... వద్ద ప్రయత్నించగలరు.


Sree Shani Devuni Mahimalu - 17th Nov -1


Mahima Shani Dev Ki Epi 1


Mahima Shani Dev Ki - (Epi 2) - Video Dailymotion



Friday, January 27, 2017

ఓం ..కొన్ని విషయములు..

 
 భూమిని గురించి శ్రీదేవీ భాగవతము గ్రంధము ద్వారా ఎన్నో విషయములు తెలుసుకోవచ్చు.కొన్ని విషయములు ఏమిటంటే..

ఈ వసుంధరను వరాహస్వరూపుడైన విష్ణుమూర్తికి భార్యగా మునులూ మనువులూ స్తుతించారు.వీరి కుమారుడు మంగళుడు. ఇతని కుమారుడు కుంభసంభవుడు.
పంచీకరణమార్గంలో మూలప్రకృతి నుంచి ఆవిర్భవించిన ఈ వసుంధర వరాహావతార కాలంలో వారాహిగా అర్చింపబడింది. 
............

హిరణ్యాక్షుడనే రాక్షసుడిని సంహరించి భూగోళాన్ని ప్రళయజలధి నుంచి ఉద్ధరించడం కోసం శ్రీహరి వరాహావతారం ధరించాడు. తన బంగారుకోరతో భూమిని పైకి లేవనెత్తి నీటిమీద పద్మపత్రంలాగా నిలబెట్టాడు. 

ఈ వసుంధరను వరాహస్వరూపుడైన విష్ణుమూర్తికి భార్యగా మునులూ మనువులూ స్తుతించారు.
 వరాహస్వరూపుడైన విష్ణుమూర్తి భూదేవికి వరాన్ని ఇవ్వటం జరిగింది  ... 

సర్వాధారా!శుభస్వరూపిణీ! వసుంధరా!ఈ రోజునుంచీ నువ్వు దేవదానవ మానవకోటులందరి చేతా పూజింపబడతావు.శంకుస్థాపనలు చెయ్యాలన్నా గృహప్రవేశాలు జరగాలన్నా వాపీకూపతటాకాదుల్ని నిర్మించాలన్నా వ్యవసాయం మొదలుపెట్టాలన్నా -మానవులందరూ ముందుగా నిన్ను అర్చిస్తారు. అంబువాచీ త్యాగదినాన తప్పక పూజలు అందుకుంటావు.ఇది నా వరం.అర్చించని మూఢులు నరకానికి పోతారు.ఇది నా శాపం.

(ప్రతినెలా ఆర్ద్రా నక్షత్రం నుంచి మూడురోజులు భూదేవికి అంబువాచి అనిపేరు. ఆ మూన్నాళ్లు భూమిని దున్నరాదని నియమం.) 

ఈ వరానికి సంతోషించిన వసుధాదేవి వరాహస్వామిని మరొక్క వరం అడిగింది. 
నాధా! నీ ఆజ్ఞను శిరసావహించి ఈ చరాచరజగత్తును అంతటినీ నేను భరిస్తాను. కానీ ముత్యము, ఆల్చిప్ప, హరిపూజా ద్రవ్యాలు,శివలింగము, శివామూర్తి, శంఖము, దీపము, యంత్రము, మాణిక్యము, రత్నము, యజ్ఞసూత్రము, పుష్పము, పుస్తకము, తులసీదళము, జపమాల, పుష్పమాల, కర్పూరము, బంగారము, గోరోచనము, చందనము, సాలగ్రామము -వీటిని మాత్రము భరించలేను. కాబట్టి వీటిని ఎవ్వరూ సాక్షాత్తుగా నామీద ఉంచకుండా నాకు సమర్పించకుండా కట్టడి చెయ్యమని అభ్యర్ధించింది. శ్రీహరి సమ్మతించాడు.ఈ ద్రవ్యాలను నీకు సమర్పించిన వారూ నీమీద సాక్షాత్తుగా ఉంచినవారూ నరకానికి పోతారని శాసించాడు. ..అటుపైని వసుంధర గర్భిణియై మంగళుడిని ప్రసవించింది.

నారదా! అప్పటినుంచి అందరూ శ్రీహరి ఆజ్ఞ మేరకు కాణ్వశాఖోక్త ప్రకారంగా భూమిపూజ చేస్తున్నారు. 
కాణ్వశాఖోక్తమైన స్తవనం కూడా ఒకటి ఉంది.అది కూడా శ్రీహరి ప్రోక్తమే. 

నారదా! ఈ స్తోత్రాన్ని పఠించిన వారికి భూదానఫలం లభిస్తుంది. భూమిదాన హరణ పాపం నశిస్తుంది.అంబువాచీ భూఖనన పాపమూ అంతరిస్తుంది...అంటూ నారాయణమహర్షి ఎన్నో విషయాలను తెలియజేసారు.

*******************

ఈ విషయాలను గమనిస్తే ఎన్నో విషయాలు తెలుస్తాయి.

భూదేవి పుత్రుడు మంగళుడు..  అనే విషయాన్ని గమనిస్తే భూమికి మంగళగ్రహానికి పోలికలు ఉంటాయనే విషయం తెలుస్తుంది. 

ఆధునిక శాస్త్రవేత్తలుకూడా మంగళగ్రహానికి భూమికి పోలికలున్నాయని  అంటున్నారు కదా!
 
ఇంకా....   
అంబువాచీ రోజులలో భూమిని త్రవ్వరాదని మరియు ఎన్నో విషయాలు తెలుస్తాయి. 
ఆధునిక కాలంలో అనేకకారణాలతో రోజూ భూమిని త్రవ్వుతున్నారు. 
అంబువాచీ దినాలలో భూమిని త్రవ్వరాదని నియమాలను పాటించేవారు ఎందరు? 
మనుషులు తమ అవసరాలకోసం భూమిని విచ్చలవిడిగా తవ్వటం   ఎప్పుడైనా సరైనది కాదు.


Wednesday, January 25, 2017

అనేక అవసరాల కోసం భూమిని ...


ఈ రోజుల్లో అనేక అవసరాల కోసం భూమిని బాగా తవ్వుతున్నారు. ఖనిజాల కోసం, నీటి కోసం, సహజవాయువు, పెట్రోల్ కోసం..ఇలా భూమిని విపరీతంగా తవ్వుతున్నారు.


భూమిని అదేపనిగా  తవ్వి సహజవనరులను తీయటం వల్ల  ..

.  భూమిలోపల బాగా ఖాళీ ప్రదేశం ఏర్పడి ..  సర్దుబాటు జరిగే ప్రక్రియలో  భూకంపాలు రావటం, మంచినీటి స్థానంలో సముద్రపు నీరు చొచ్చుకురావటం..వంటి ప్రమాదాలు ఉన్నాయంటున్నారు.


ఇప్పటికే చాలాచోట్ల మంచినీటి స్థానంలో ఉప్పు నీరు వచ్చేసింది. నీరు బాగా కలుషితమయ్యింది.


నదులను దేవతలుగా పూజించే ఈ పుణ్యభూమిలో నదులు ఎంతో కలుషితమైనా అంతగా పట్టించుకోవటం  లేదు.


ఊళ్ళోని కాలుష్యాలను తీసుకెళ్లి నదులలో కలుపుతున్నారు చాలామంది.


ఈ రోజుల్లో జబ్బులు మరింత ఎక్కువవుతున్నాయి. అందుకు ప్రధానకారణాలలో ఒకటి మనం పర్యావరణాన్ని కలుహితం చేయటం.


ఖనిజాలు ఏర్పడాలంటే ఎన్నో వేల సంవత్సరాలు పడుతుంది.

పొదుపుగా వాడుకోవలసిన భూమిలోని సంపదను ఇష్టారాజ్యంగా తవ్వేస్తున్నాం.


ముందుతరాల గురించి ఆలోచనే లేకుండా, మన అంతులేని కోరికల కోసం పర్యావరణాన్ని కలుషితం చేస్తున్నాం.


సృష్టిలోని సంపదను మనం సృష్టించామా? లేదు కదా!

మరి తమ ఇష్టారాజ్యంగా అన్నింటినీ నాశనం చేసే హక్కు మానవులకు ఎక్కడిది?


  పర్యావరణాన్ని నాశనం  చేయటమంటే మనిషి  చేజేతులా తన నాశనాన్ని తాను ఆహ్వానించినట్లే.


అంతులేని కోరికలను అదుపులో పెట్టుకోవాలి.సృష్టిలోని సహజవనరులను పొదుపుగా వాడుకోవాలి. అప్పుడే ప్రకృతి మనల్ని కాపాడుతుంది.

Tuesday, January 24, 2017

ఇలాంటి నీరు వాడితే...


 
ఈ రోజుల్లో చాలా ప్రాంతాలలో నీరు ఆరోగ్యానికి హానిచేసే విధంగా ఉంటోంది.

కొన్ని సంవత్సరాల క్రితం వరకూ కూడా పల్లెటూళ్ళలో చెరువు వద్ద నూతిలోనుండి నీటిని తెచ్చుకుని వాడుకునేవారు.


ఈ రోజుల్లో శుభ్రమైన త్రాగు నీరు లభించక నీటిని శుద్ధిచేసే యంత్రాన్ని ఇంట్లో అమర్చుకుంటున్నారు.
కొందరు మంచినీటి కాన్లు కొనుక్కుని శుద్ధిచేసిన నీటిని వంటకు, త్రాగటానికి వాడుతునారు.

అయితే, బోరు నీళ్ళు మరియు ఫ్లోరైడ్ ఎక్కువగా ఉండే ప్రాంతాలలో శుద్ధిచేయని కఠిన జలాన్ని శరీరాన్ని శుభ్త్రం చేసుకోవటానికి వాడేటప్పుడు కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.


 ఉదా..గాఢమైన నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకునేటప్పుడు ఆ నీరు కంట్లో పడకుండా జాగ్రత్తగా ఉండాలి.
 బోరు నీరు మరియు   ఫ్లోరైడ్ నీటితో కళ్ళు శుభ్రం చేసుకోకూడదు.


కొన్నిసార్లు శుద్ధిచేసిన నీటిలో కూడా శరీరానికి హానిచేసే పదార్ధాలు మిగిలే ఉంటున్నాయేమో? అనే సందేహమొస్తోంది.


మీ  ఇంట్లో నీటిని పరిశీలించండి . .. 

 త్రాగునీటిని ఒక గ్లాసులో పోసి రెండురోజులు అట్టేపెట్టేస్తే గ్లాసు అడుగు భాగంలో వేలితో టచ్ చేస్తే బరకలా (స్కేలింగ్)ఏర్పడటం గమనించవచ్చు.
 
ఇలాంటి నీరు త్రాగితే కిడ్నీలు పాడయ్యే ప్రమాదముంది.
ఇలాంటి నీటితో కళ్లు కడుక్కుంటే కళ్ళు పాడయ్యే అవకాశముంది.

 కడిగిన గిన్నెలు  బోర్లించకుండా కొన్నిరోజులు ఉంచితే  గిన్నె లో తెల్లటి మరకలు ఉండటం కూడా జరుగుతుంది.


ఇలాంటి నీళ్ళు నింపే బకెట్లకు పైన తెల్లటి పొర ఏర్పడి రంగు మారిపోతుంటాయి.


 టాయ్లెట్స్ కూడా యాసిడ్ వేసి శుభ్రం చేయవలసి ఉంటుంది. మరి, ఇలాంటి నీళ్ళు వాడితే ఆరోగ్యం ఏమవుతుంది?


ఇంతకుముందు కొన్ని ప్రాంతాలలో మాత్రమే ఇలాంటి పరిస్థితి ఉండేది.
ఇప్పుడు నదుల ప్రక్కన ఉండే జిల్లాలలో కూడా నీటి తీరులో మార్పులు వస్తున్నాయి.

ఎన్నో కారణాల వల్ల భూగర్భంలో మంచినీరు ఉప్పగా మారటం, మంచినీటి స్థానంలో సముద్రపు నీరు చొచ్చుకు రావటం జరుగుతోందంటున్నారు.


భూమిలో , నీటిలో కలుస్తున్న కాలుష్యాలు, బోర్లు విపరీతంగా త్రవ్వి భూగర్భజలాన్ని బాగా వాడేయటం.. వంటి చర్యల వల్ల భూగర్భ జలం త్రాగటానికి పనికిరాని విధంగా మారుతోంది.
ఇందువల్ల, అందరూ పర్యావరణం పాడుకాకుండా కాపాడుకోవాలి.



Saturday, January 21, 2017

ఆహారం విషయంలో...


 
మన పెద్దలు ఎంతో విజ్ఞానాన్ని అందించారు.

 ఆయుర్వేదం ద్వారా ఎన్నో అద్భుతమైన  మూలికల గురించి  తెలియజేసారు..



 సరస్వతి ఆకు, అశ్వగంధ, పునర్నవ ..వంటివి ఎంతో శక్తివంతమైన ఔషధాలు. 
 

వీటిని కొన్ని గ్రాములు వరకూ మాత్రమే అంటే సుమారు 2 లేక 3 గ్రాములు..ఔషధంగా  తీసుకోవాలంటున్నారు. 
 

వీటిని ఎంత మోతాదులో , ఎన్ని రోజులు వాడాలనేది ఆయుర్వేద నిపుణుల సలహా ప్రకారం వాడటం మంచిది.


ఉసిరి, కరక్కాయ, పిప్పళ్లు.. వంటివి ఎంతో  విలువైనవి. 


ఇంకా  చక్కటి ఆహారవిధానాన్ని తెలియజేసారు. నవధాన్యాలను గురించి తెలియజేసారు.


  ఆహారంలో ఆవాలు, జీలకర్ర, మెంతులు, పసుపు, అల్లం, శొంఠి, వాము.. ..వంటి ఎన్నో విలువైన వాటిని  వంటలో చేర్చి వండే విధానాలను నేర్పించారు. ఇందువల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి.


అయితే, ఈ రోజులలో సాంప్రదాయ ఆహారాన్ని తీసుకోవటం తగ్గించి.. ఫాస్ట్ ఫుడ్  ఎక్కువగా తినటం వల్ల కూడా అనారోగ్యాలు వస్తున్నాయి.


ఈ మధ్య సోయా తింటే మంచిదంటూ విపరీతంగా వాడుతున్నారు.


సోయా మంచిదే కానీ , ఎక్కువగా తింటే మంచిది కాదని అంటున్నారు.


అందువల్ల ఆహారం విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.


 ప్రాచీనులు తెలియజేసిన .. తరతరాలనుండి పెద్దవాళ్ళు అలవాటుచేసిన ఆహారపు అలవాట్లను వదిలి వేసి ... జంక్ ఫుడ్ కు అలవాటు పడటం మంచిది కాదు.


ఈ రోజుల్లో విదేశాల వాళ్లు కూడా భారతీయ ఆహారం యొక్క ప్రాముఖ్యతను గుర్తిస్తున్నారు . మన వంటలను ఇష్టపడుతున్నారు.



Wednesday, January 18, 2017

కొన్ని విషయాలు...


ఈ రోజుల్లో మన దేశంలో చాలామంది.. కొన్ని విషయాలలో విదేశాల వారిని అనుకరించటానికి బాగా ప్రయత్నిస్తున్నారు.


 ఇతరులలో ఉన్న మంచిని  మనం గ్రహించాలి.

 చాలామంది మంచి ఆలోచనలు, మంచి అలవాట్లు ఉన్నవారు ఉంటారు.

****************

 రసాయనిక పురుగుమందులను విదేశీయులే కనుగొన్నారు.

అయినా,  వాటివల్ల కలిగే నష్టాలను గుర్తించి .....  రసాయన పురుగుమందులను వాడని ఆహారాన్ని తీసుకోవటానికి వాళ్ళు  ప్రాముఖ్యత ఇస్తున్నారు.


భారతదేశం నుంచి ఎగుమతి అయిన కొన్ని పంటల ఉత్పత్తులను పురుగుమందుల అవశేషాలు ఉన్నాయనే కారణంతో విదేశాల వాళ్ళు తిరస్కరించటం కూడా జరిగింది.


అయినా మనలో చాలామంది రసాయన పురుగుమందులను విచ్చలవిడిగా వాడుతూనే ఉన్నారు.



 భారతీయులు  తిరిగి మన సేంద్రియవ్యవసాయానికి ప్రాధాన్యత ఇవ్వవలసిన అవసరం ఉంది.

ఉదా.సుభాష్ పాలేకర్ గారు తెలియచేస్తున్న సేంద్రియ వ్యవసాయం చేయాలి.


***********

ఇంకో విషయం ఏమిటంటే,  ఎందరో విదేశాల వాళ్ళు  తమ విద్యుత్ అవసరాల కోసం  సోలార్ విద్యుత్ వంటి వాటికి ప్రాధాన్యత ఇస్తున్నారు.

అపారంగా సూర్యరశ్మి లభించే మనదేశం వాళ్ళేమో సోలార్ విద్యుత్ కు ప్రాధాన్యత ఇస్తూనే, ఇంకా ధర్మల్ విద్యుత్ కేంద్రాలు నిర్మించటం కోసం తాపత్రయపడుతున్నారు.


***********

ఎంతో గొప్ప విలువలు, విజ్ఞానం వారసత్వంగా కలిగినది భారతదేశం.

అయితే, మన దేశంలోనే  కొందరు .. భారతీయ విధానాలను తక్కువచేసి మాట్లాడుతుంటే ఎందరో విదేశాల వాళ్ళు యోగా, ధ్యానం, భారతీయ ఆయుర్వేద పద్ధతులు.. మొదలైన విషయాల గురించి ఆసక్తి చూపటం  ఆశ్చర్యకరమైన విషయం.



Monday, January 16, 2017

ఈ- వస్తువుల వల్ల కొన్ని సమస్యలు ...



ఈ రోజుల్లో టీవీలు చూడటం, సెల్ఫోన్లు వాడటం, కంప్యూటర్ వాడకం..విపరీతంగా పెరిగింది. 

చాలామందిలో మెడనొప్పులు,వెన్నునొప్పులు, భుజాల నొప్పులు, కంటిచూపు తగ్గటం..వంటివి కూడా బాగా పెరిగాయి.


ఈ- వస్తువుల నుంచి వెలువడే రేడియేషన్ వల్ల కొన్ని సమస్యలు వస్తాయంటున్నారు. 


అందువల్ల నిద్ర పోయే ముందు సెల్ ఫోన్ తల వద్ద కాకుండా కనీసం ఆరు అడుగుల దూరంలో ఉంచి పడుకోవాలట.


 కంప్యూటర్, ల్యాప్టాప్ నుండి కూడా రేడియేషన్ సమస్య ఉంటుందట .


కంప్యూటర్ ఎక్కువ సమయం వాడేటప్పుడు మెడ, వెన్ను నొప్పులు , కళ్ళు అలసిపోవటం వంటివి వచ్చే అవకాశముంది.


 టీవీ. . కనీసం ఆరు లేక పది అడుగుల దూరం నుంచి  చూడాలట. 


 నా అభిప్రాయం ప్రకారం ..కళ్ళు పైకెత్తి చూడటం వల్ల ఎక్కువ అలసట అనిపిస్తుంది.


 ఉదా..సినిమా హాల్లో సినిమా చూసినప్పుడు బాల్కనీలో కూర్చుని చూసినప్పుడు ఎక్కువ అలసట అనిపించదు. 


నేలమీద కూర్చుని సినిమా చూసేవాళ్ళు మెడ మరియు కళ్ళు పైకి ఎత్తి చూడటం వల్ల బాగా అలసట అనిపిస్తుంది.


 అందువల్ల కంప్యూటర్  టేబుల్  మరీ ఎత్తుగా లేకుండా ఉంటే మంచిది. 


అంటే మెడ, కళ్ళు పైకెత్తి చూడటం కాకుండా క్రిందకు చూసే విధంగా ఏర్పాటు ఉంటే మంచిది. 


అలాగని కాళ్ళపై ల్యాప్ టాప్ ఉంచి చూడటమూ మంచిది కాదంటున్నారు. 


నేలపై కొద్ది ఎత్తులో స్టాండ్ పై ల్యాప్ టాప్ ఉంచి చూడటం మంచిది.


 నేలపై కూర్చోలేనివాళ్ళు  టేబుల్ మేట్ పై ల్యాప్ టాప్ ఉంచి వాడుకోవచ్చు. 


  టేబుల్ మేట్ తో  మనకు అనువైన విధంగా ఎత్తును సరిచేసుకోవచ్చు.


 కంప్యూటర్ కూడా టేబుల్ మేట్ పై ఉంచి వాడుకుంటే మంచిది. 


 రెండు  టేబుల్ మేట్ లు ఉంటే..


   ఒక టేబుల్  పైన కంప్యూటర్ ఉంచి ...కంప్యూటరుకు దూరంగా మన ముందు ఉన్న టేబుల్  పైన  కీబోర్డు, కర్సర్  ఉంచి వాడుకోవచ్చు.


ఆఫీసుల్లో  టేబుల్స్ మనకు అనువైన ఎత్తులో ఉండకపోవచ్చు.


 అక్కడకు మనకు అనువైన విధంగా ఎత్తును సరిచేసుకునే విధమైన  టేబుల్ మేట్ తీసుకెళ్ళి కంప్యూటర్ వాడుకోవచ్చు.



 ఇలా కొన్ని సర్దుబాట్లు చేసుకోవటం వల్ల మెడ, వెన్ను నొప్పులు, కళ్ళు అలసిపోవటం.. కొంతైనా తగ్గే అవకాశముంది.



కంప్యూటర్ వంటివి వీలైనంతలో తక్కువగా వాడటం మంచిది.



 ఎక్కువసేపు వాడటం  తప్పదు అనుకున్నప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవటం మంచిది.


Thursday, January 12, 2017

ఓం...



ఈ రోజు వివేకానంద జయంతి.


మకర సంక్రాంతి పండుగ.. భోగి, సంక్రాంతి, కనుమ..సందర్భంగా సూర్యారాధన చేస్తారు.
 
గోదా దేవి రంగనాధస్వామి వార్ల కల్యాణం జరుగుతుంది.


శబరిమలై  అయ్యప్పస్వామి మకర జ్యోతి దర్శనం ఉంటుంది .


ఈ విశేషాల సందర్భంగా అందరికి శుభాకాంక్షలండి.



Monday, January 9, 2017

ఓం శ్రీ శనిదేవులు...కొన్ని విషయములు..



శింగణాపూర్ లో శ్రీ శనేశ్వర భగవానులు తాను స్వయంభూ అవతార శిలారూపం నుండి సృష్టినంతా వీక్షిస్తూ జీవుల్ని పాలిస్తున్నారు.

కర్మపాశవిముక్తి దేవత గ్రహసార్వభౌమునికి మానవకృతపీడ,దోషాలు ఆపాదించడము దేవత యెడ మహాపరాధమవుతుంది.

 సకలజీవరాశులయెడ కృపాదృష్టి గల గ్రహదేవత లోకోద్ధరణ కాంక్షించి భూస్థలిపై శిలామూర్తియై అవతరించారు.
...........

 జీవి యొక్క రాశి చక్రములో శనిగ్రహదేవత , జన్మస్థానము నందు,  అష్టమ, ద్వాదశ యందు , అర్ధాష్టు యందు సంచరించునపుడు శోధించి జీవియొక్క గతజన్మల కర్మానుఫలంగా శిక్షకు గురిచేస్తారు. దీన్ని శనిదోషముగా భావించడము దైవము యెడ మహాపరాధము. అని పెద్దవారు తెలియజేసారు.

ఆయా స్థానములలో గ్రహరాజు సంచరించుకాలంలో.. శనిదేవుని పూజ చేయటం మంచిది.
...............
శనిదేవుని గురించి కొన్ని విషయములు ఈ క్రింది లింకుల వద్ద గమనించగలరు.

SHANI DEV KI KATHA - YouTube

                         
shani-6.wmv.flv

Sunday, January 8, 2017

వైకుంఠ ఏకాదశి సందర్భముగా..


ఓం..
విష్ణోః అష్టావింశతినామ స్తోత్రం..

శ్రీ భగవానువాచ:

మత్శ్యం కూర్మం వరాహంచ వామనంచ జనార్దనమ్
గోవిందం పుండరీకాక్షం మాధవం మధుసూదనమ్
పద్మనాభం సహస్రాక్షం వనమాలిం హలాయుధమ్   
గోవర్ధనం హృషీకేశం వైకుంఠం పురుషోత్తమమ్
విశ్వరూపం వాసుదేవం రామం నారాయణం హరిమ్
దామోదరం శ్రీధరంచ వేదాంగం గరుడధ్వజమ్ 
అనంతం కృష్ణగోపాలం జపతోనాస్తి పాతకమ్
గవాం కోటిప్రదానస్య చాశ్వమేధ శతస్య చ.


లక్ష్మ్యష్టకం..

నమస్తేఽస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే
శంఖ చక్ర గదాహస్తే మహాలక్ష్మీ నమోఽస్తు తే.



నమస్తే గరుడారూఢే డోలాసురభయంకరి
సర్వపాపహరే దేవి మహాలక్ష్మి నమోస్తు తే



సర్వజ్ఞే సర్వవరదే సర్వదుష్ట భయంకరి
సర్వపాపహరే దేవి మహాలక్ష్మి నమోస్తు తే



సిద్ధిబుద్ధి ప్రదే దేవి భుక్తి ముక్తి ప్రదాయిని
మంత్రమూర్తే సదాదేవి మహాలక్ష్మి నమోఽస్తు తే.



ఆద్యంతరహితే దేవి ఆద్యశక్తే మహేశ్వరి
యోగజ్ఞే యోగ సంభూతే మహాలక్ష్మి నమోఽస్తు తే.



స్తూలసూక్ష్మే మహారౌద్రే మహాశక్తే మహోదరే
మహాపాపహరే దేవీ మహాలక్ష్మి నమోఽస్తు తే.



పద్మాసనస్థితే దేవి పరబ్రహ్మస్వరూపిణి
పరమేశి జగన్మాత ర్మహాలక్ష్మి నమోఽస్తు తే.



శ్వేతాంబరధరే దేవి నానాలంకారభూషితే
జగత్సితే జగన్మాత ర్మహాలక్ష్మి నమోఽస్తు తే.



మహాలక్ష్మ్యష్టకం స్తోత్రం యః పఠే ద్భక్తిమా న్నరః
సర్వసిద్ధి మవాప్నోతి రాజ్యం ప్రాప్నోతి సర్వదా.



ఏకకాలే పఠే న్నిత్యం మహాపాపవినాశనం
ద్వికాలం యః పఠేన్నిత్యం ధనధాన్యసమన్వితః

త్రికాలం యః పఠే న్నిత్యం మహాశత్రువినాశనం
మహాలక్ష్మీర్భవే న్నిత్యం ప్రసన్నా వరదా శుభా.



ఇతి ఇంద్రకృత మహాలక్ష్మ్యష్టక స్తవః

వ్రాసిన విషయములలో అచ్చుతప్పులు వంటివి ఉన్నచో దయచేసి క్షమించమని దైవాన్ని ప్రార్ధిస్తున్నాను.

Friday, January 6, 2017

కిడ్నీ వ్యాధులు ...కొన్ని ఆయుర్వేద విషయాలు ..




ఈ రోజుల్లో కిడ్నీ వ్యాధిగ్రస్తుల సంఖ్య బాగా పెరిగింది. కిడ్నీవ్యాధులు రావటానికి ఎన్నో కారణాలుంటాయి.
  అయితే,  ఉద్దానం వంటి ప్రాంతాలలో ఈ సమస్య మరీ ఎక్కువగా ఉంది.


అక్కడ నీటిలో..సిలికా ఎక్కువ మోతాదులో ఉండటం వల్ల  కిడ్నీలు దెబ్బతింటున్నాయని కొందరు పరిశోధకులు అన్నట్లు వార్తలు వచ్చాయి.


 సిలికా కొద్ది మోతాదులో  శరీరానికి మంచిదే కానీ, ఎక్కువ మోతాదులో శరీరంలో ప్రవేశిస్తే మాత్రం కిడ్నీలు దెబ్బతినటం వంటి సమస్యలు వస్తాయంటున్నారు.


 ఇలాంటప్పుడు..  ఈ సమస్య ఉన్న ప్రాంతాలలో అయినా కుటుంబానికి కనీసం రోజుకి రెండు బిందెల శుభ్రమయిన నీరు..  త్రాగటానికి, వంటకు  అందించగలిగితే  నీటి కాలుష్యం వల్ల వచ్చే జబ్బులు తగ్గుతాయి.


అందువల్ల  ప్రభుత్వాలు..  కిడ్నీ వ్యాధులు ఎక్కువ వస్తున్న ప్రాంతాలు మరియు  ఫ్లోరైడ్ నీరు ఉన్న ప్రాంతాలలో  విరివిగా నీటిని శుద్ధి చేసే ప్లాంట్లను ఏర్పాటు చేయాలి.


ప్రస్తుతం కిడ్నీ వ్యాధి మొదటి దశలో కనుక్కోవటం కొంచెం కష్టం. అయితే కిడ్నీ వ్యాధి ఎక్కువగా వచ్చే ప్రాంతాలలో ప్రజలకు తరచూ వైద్య పరీక్షలు చేస్తే వ్యాధి మరీ ముదరకముందే కనుగొని మందులు ఇవ్వవచ్చు.


కిడ్నీలు పాడయినవారికి భవిష్యత్తులో కృత్రిమ కిడ్నీలను అమర్చే విధంగా పరిశోధనలు జరుగుతున్నాయంటున్నారు.

ఈ పరిశోధనలు ఫలిస్తే కిడ్నీ దాతల కోసం వేచి చూసే సమస్య ఉండకపోవచ్చు.

 అయితే, ట్రాన్స్ ప్లాంటేషన్ తరువాత కూడా కొన్ని సమస్యలు ఉంటాయట. అందువల్ల కిడ్నీలు పాడవకుండా ముందే జాగ్రత్తలు తీసుకోవటం ఉత్తమం.


 కిడ్నీ వ్యాధికి ఆయుర్వేదంలో మందులు ఉన్నాయంటున్నారు.

డయాలసిస్ స్థాయిలో కూడా డయాలసిస్ తో పాటూ పునర్నవ వంటి మందులు వాడుకుంటే మెరుగైన ఫలితాలు ఉంటాయంటున్నారు.

 
వ్యాధిఉన్నవారు  ఒక్కొక్కరికి వివిధ స్థాయిలలో వ్యాధి ఉండవచ్చు.


అయితే, మందులు వాడేటప్పుడు తోచినట్లు వాడటం కాకుండా,  తమ అనారోగ్యం పరిస్థితిని బట్టి మందులను ఎంత మోతాదులో, ఎంతకాలం వాడాలో వంటి విషయాలను ఆయుర్వేద నిపుణుల సలహాతో వాడటం మంచిది.

ఆసక్తి ఉన్నవారు ఈ  క్రింద ఇచ్చిన లింకులను  .. కాపీ..పేస్ట్.. క్లిక్ చేసి  చూడగలరు. 



nattu vaithiyam telugu part 3 genimi tv 


How to Avoid dialysis – Herbal Treatment for Kidney failure





Monday, January 2, 2017

ఓం .. కొన్ని విషయములు..


శ్రీ అనఘాదేవీ సమేత శ్రీ దత్తాత్రేయస్వామి వార్లకు నమస్కారములు.
  శ్రీపాదశ్రీవల్లభ స్వామి వారికి నమస్కారములు.
     దిగంబర ! దిగంబర !! శ్రీ పాదవల్లభ దిగంబర !!!
               శ్రీ పాదరాజం శరణం ప్రపద్యే .


 ************************

శ్రీ దేవీ భాగవతము నుండి తెలుసుకున్న విషయములు..

వ్యాసులవారు జనమేజయునికి తెలియజేసిన కొన్ని విషయాలు..


ఒకప్పుడు ప్రహ్లాదుడు భూలోకంలో ఉన్న తీర్ధాలను గురించి తెలియజెప్పమని చ్యవనుని అభ్యర్ధించాడు.
చ్యవనుడు అన్నాడు కదా...
 
హిరణ్యకశిపునందనా! మనోవాక్కాయాలను శుద్ధిగా ఉంచుకున్నవారికి అడుగడుగునా తీర్ధాలే. మలిన మనస్కులకు గంగానది సైతం పాపపంకిలమే.

మనస్సు పాపరహితంగా పరిశుద్ధంగా ఉంటేనే ఏ తీర్ధాలైనా పావనాలయ్యేది. గంగానదికి ఇరువైపులా పొడుగునా ఎన్నెన్నో గ్రామాలున్నాయి. నగరాలు ఉన్నాయి. అడవుల్లో గిరిజనావాసాలు ఉన్నాయి.

ఇన్ని జాతులవారూ రోజూ ఆ గంగలోనే ముప్పొద్దులా మునుగుతున్నారు. బ్రహ్మసమానమైన ఆ పవిత్రజలాన్నే గ్రోలుతున్నారు. అయితేనేమి ఒక్కడంటే ఒక్కడు ముక్తి పొందాడా ?

విషయ లంపటులు వెళ్ళి ఎంతటి పవిత్రతీర్ధంలో మునిగినా ఫలితం శూన్యం. అన్నింటికీ మనస్సే ముఖ్యం. దాన్ని శుద్ధి చేసుకుంటే అన్నీ శుద్ధి పొందుతాయి.

అలా కాకుండా తీర్ధయాత్రలకు వెళ్ళి అక్కడ ఆత్మవంచన - పరవంచనలు చేస్తే ఆ చుట్టుకునే పాపానికి అంతు ఉండదు.

ఇంద్రవారుణం(పెదపాపరకాయ) పక్వమైనా ఇష్టం కానట్టే దుష్టస్వభావుడు దివ్యతీర్ధంలో కోటిసార్లు మునిగినా పవిత్రుడు కాలేడు.

అందుచేత అన్నింటికంటే ముందు మనశ్శుద్ధి ఉండాలి. అది ఉంటేనే ద్రవ్యశుద్ధి సిద్ధిస్తుంది. అటుపైని ఆచారశుద్ధి. ఇవన్నీ ఉన్నవాడికే తీర్ధం తీర్ధమవుతుంది. లేకపోతే అదొక రేవు మాత్రమే. అక్కడ ఏవేవి ఎంతెంత చేసినా "శుద్ధ దండుగ " .

నిజానికి వీటన్నింటి కంటే భూతదయ చాలా గొప్పది.

అయినా నువ్వు తీర్ధాలను గురించి అడిగావు కనక వాటినే చెబుతాను - విను. భూలోకంలో లెక్కలేనన్ని తీర్ధాలున్నాయి.


వాటికేంగానీ ఉత్తమోత్తమమైన తీర్ధరాజం ఒక్కటేఒక్కటి - నైమిశంలో చక్రతీర్ధం. దాన్నే పుష్కరతీర్ధమని కూడా అంటారు......అంటూ తెలియజేశారు.



Sunday, January 1, 2017

అందరికి.. ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలండి.


అందరికి.. ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలండి.