koodali

Monday, December 29, 2014

హరిశ్చంద్రుని కధ చదివి..


హరిశ్చంద్రుని కధ చదివి.. సత్యం కోసం అన్ని కష్టాలు పడటం ఎందుకు ?  అనుకుంటున్న వాళ్ళూ ఈ సమాజంలో  ఉన్నారు.

చిన్న  అబద్ధమే కదా అనుకుంటే అదే అలవాటై ఒకరిని చూసి ఒకరు  అంతా అబద్ధాలే  చెబితే  సమాజంలో ఎన్నో గొడవలు మొదలవుతాయి. అసత్యం  విషయంలో ఎంతో జాగ్రత్తగా ఉండాలి..మొదలే  దానిని అరికట్టాలి.       

( అయితే కొన్ని సందర్భాలలో, ఉదాహరణకు అన్యాయంగా ప్రాణాలకు హాని కలిగే సమయాలలో అసత్యం చెప్పినా ఫరవాలేదని మినహాయింపును ఇచ్చారు పెద్దలు.. ఇలాంటి  సందర్భాలలో  విచక్షణ ప్రకారం నడుచుకోవాలని పెద్దలు సూచించారు.)

 సత్యం విలువ ఎంతో  గొప్పది.  రాజే  అసత్యవంతుడైతే, యధారాజా తధాప్రజా  అన్నట్లు ...సమాజం  అంతా అబధ్ధాలు, మోసాలతో  అస్తవ్యస్తమైపోతుంది.

 లోకహితం కోసం, లోకానికి సత్యం యొక్క విలువను తెలియజెప్పటం కోసం  హరిశ్చంద్రుడంతటి వారు ఎన్నో కష్టాలను సహించారు. నేను రాజును కదా, సత్యం కోసం ఎందుకు కష్టాలు పడాలి ? అని వారు అనుకోలేదు.

ఈ విషయం గురించి మరిన్ని  వివరాలను  చదవాలనుకుంటే  దయచేసి  ఈ  లింకుల  వద్ద  చదవగలరు..  

Saturday, December 27, 2014

పురాణేతిహాసాలలో అతిశయోక్తులు ..

 
పురాణేతిహాసాలలో  ఎన్నో  అతిశయోక్తులున్నాయని కొందరు ఎగతాళి  చేస్తుంటారు.  అలా అనుకోవటం  సరైనది  కాదు.

పురాణేతిహాసాలలో  భారీ  ఆకారాల  జీవుల  గురించి  తెలియజేసారు. దేవతలు .. పక్షులను,  జంతువులను తమ వాహనాలుగా  చేసుకోవటం  కూడా  చెప్పబడింది.

అంత  పెద్ద  పక్షులు  ఎక్కడయినా  ఉంటాయా ?  అని నేటికాలంలో కొందరు విమర్శిస్తారు.

 ఆధునిక  శాస్త్రవేత్తలు  చెప్పిన  దానిప్రకారం  చూసినా   ప్రాచీన  కాలంలో  డైనోసార్స్  వంటి  భారీ  జీవులు ఉండేవని  అంటున్నారు.  ఆ కాలంలో  ఏనుగులు  వంటివి  కూడా  భారీ  ఆకారాలతో  ఉండేవని అంటున్నారు.

మరి, పురాణేతిహాసాలలో  భారీ ఆకారాల  జీవుల  గురించి  చెబితే మాత్రం  అతిశయోక్తులనటం  ఏం న్యాయం ? 
......................

 పురాణేతిహాసాల ద్వారా చూస్తే, ఆ కాలంలో  కొందరు  ఎంతో  శక్తి కలవారిగా  తెలుస్తుంది. బహుశా, ప్రాచీనులలో  కొందరికి ఎక్కువ శక్తిసామర్ధ్యాలు  ఉండి ఉండవచ్చు .

ఈ కాలంలో కూడా కొందరు..  లారీలను,  విమానాలను  ఒంటి  చేత్తో  లాగేస్తున్నారు. ఇలా వాహనాలను  సునాయాసంగా లాగేవారికి  ఆ బలం  ఎలా వస్తుందో  ఆధునిక సైన్స్  చెప్పలేకపోతోంది.

 ఇవన్నీ  గమనిస్తే  మనకు  తెలిసిదేమిటంటే, ఆధునిక  విజ్ఞానానికి  అంతుపట్టని  విషయాలెన్నో  విశ్వంలో  ఉన్నాయని తెలుస్తోంది.
...................

 పురాణేతిహాసాలలో  కొందరు ఆకాశానికి  ఎగరటం, నీటిపై  తేలటం  వంటి  శక్తులు  కలిగిఉండేవారంటే..అవన్నీ  అతిశయోక్తులని  అంటారు  కొందరు..

ఈ రోజుల్లో  కూడా  కొందరు  యోగ శక్తితో  నీటిపై మునగకుండా కూర్చుంటున్నారు.

ప్రాచీన  కాలంలో  ఇప్పటికన్నా  మించిన  విజ్ఞానం  ఉండిఉండవచ్చు.  అప్పటివారికి  ఇతర  గ్రహాల  జీవులతో సంబంధాలు  ఉండి  ఉండవచ్చు. 

 ఇతర  గ్రహాలపై  జీవం  ఉన్నదనీ,  వారు  మనకన్నా  విజ్ఞానవంతులు  కావచ్చనీ  నమ్మే  వాళ్ళు  ఎందరో  ఇప్పటివాళ్ళలో  ఉన్నారు.
.............................

 భూమిమీది  విషయాల  గురించే  మనకు  సరిగ్గా  తెలియదు.  ఇక  దైవం  గురించి, విశ్వం  గురించి  మనకు  అంతా  తెలుసు..  అని  అనుకోవటం  హాస్యాస్పదం.

 విశ్వరహస్యాల  గురించి  మనకు  తెలిసింది  సముద్రంలో  నీటిబొట్టంత.  తెలియనిది  సముద్రమంత. 

 మనకు  చేతనయితే  పురాణేతిహాసాలలోని  అద్భుతవిజ్ఞానం  గురించి  తెలుసుకోవాలి . అంతేకానీ  పురాణేతిహాసాలలో  ఉన్నవన్నీ  అతిశయోక్తులే అని అనుకోవటం అజ్ఞానం.
.............................

ఏదైనా  విషయం  గురించి  చెప్పేటప్పుడు  ఎదుటివారికి  ఆసక్తిగా ఉండటానికి  కొంత  అతిశయోక్తి  జోడించి  చెబుతుంటారు  కొందరు.  పురాణేతిహాసాలలో  కొన్ని  ప్రక్షిప్తాలు  కూడా ఉన్నాయంటారు.

 ఏవి  ప్రక్షిప్తాలో  మనకు  సరిగ్గా  తెలియదు.  అందుకని  పురాణేతిహాసాలను  అపార్ధం  చేసుకోవటం  మాని  సరిగ్గా  అర్ధం చేసుకోవటానికి  ప్రయత్నించాలి.


Saturday, December 13, 2014

సతీ సుమతి...మరి కొన్ని విషయాలు .విశ్లేషణ ..

 

 

సుమతీదేవి  ఎంతో  ఓపికతో, సహనంతో  తన  కాపురాన్ని  చక్కదిద్దుకుంది.ఆమె భర్త అనారోగ్యంతో  ఉండి కూడా  భార్యనే  కోరరాని  కోరిక  కోరాడు. 


  భార్య   అనుకూలవతి  అయినా  పర  స్త్రీల  పట్ల  మోజుపడే   వారు  ఉంటారు . 

  తన  ప్రియురాలి  వద్దకు    తీసుకెళ్ళమని  భార్యను  కోరాడు. ఏ  స్త్రీకయినా  ఇలాంటివి  తట్టుకోవటం  కష్టమే. 

 ఇలాంటి  భర్తను  కఠినంగా  శిక్షించాలని  చాలామంది   అంటారు . ఇలాంటివి  విన్నప్పుడు   అంతటి  బాధ  కలిగే  మాట  వాస్తవమే.   

అయితే,  వ్యసనపరుడైన  భర్తను  శిక్షించాలని  ఆవేశపడే  వాళ్ళు  తమ  పిల్లలు  లేక  అన్నదమ్ములు   వ్యసనపరులైనా  ఇలాగే  శిక్షించాలని కూడా అనగలరా ?

 శిక్షకన్నా   ముందు    నేరస్తులలో  పరివర్తన  తేవటానికి    ప్రయత్నించవచ్చు.

...............

 సుమతీ  సాధ్వి  తన  భర్త  కోరికను తీర్చటానికి  సిద్ధమవటానికి ఎంతటి  మానసిక  వ్యధను  అనుభవించిందో కదా !

  రోగిష్టి  అయిన  తన  భర్త  కోరికను  తీర్చటానికి   అతని  ప్రియురాలు    ఒప్పుకోదని  సుమతి  భావించి  ఉండవచ్చు.   ఆ  నమ్మకంతోనే  భర్తను  ఇతరుల  వద్దకు  తీసుకెళ్ళటానికి  ఒప్పుకుని  ఉండవచ్చు.
........................................


వ్యసనపరులను  మంచి  మార్గంలోకి  తేవాలంటే   ఎంతో  ఓర్పు,  నేర్పు ఉండాలి. ఈ  రోజుల్లో  వ్యసనపరులను  మార్చటానికి  సైకాలజిస్టుల వద్దకు  తీసుకువెళ్తున్నారు.

 వ్యసనపరులను  మార్చాలంటే  సైకాలజిస్టులు  కూడా  ఎంతో  సహనంతో   ప్రయత్నించవలసి  ఉంటుంది. సుమతి  ఎంతో  సహనంతో .... వ్యసనపరుడయిన  తన  భర్తను  తానే  సరిదిద్దుకుంది. 

....................
 
సుమతి ఎంతో  సహనంతో  తన  కాపురాన్ని  చక్కదిద్దుకుంది.  అందుకు  ఆమె   ఎంతో  అభినందనీయురాలు. ఆ విధంగా  సమాజానికి  ఒక  చక్కటి  మేలును  చేసింది.

సుమతి చేసిన  దానిలో  తప్పేమిటి ? ఎవరి ఇల్లును  వారు  సరిదిద్దుకుంటే దేశమే  బాగుపడుతుంది కదా!

  అయితే  ఇలా  సరిదిద్దటం  తేలికయిన  పనేమీ  కాదు.  అందుకు  ఎంతో  సహనం  అవసరం. 

  (  జీవితభాగస్వామి  మరీ  శాడిస్టు   అయినా  సర్దుకుపోవాలని  నా  అభిప్రాయం  కాదు. అయితే  ఈ  కాలంలో  కొందరు  జీవిత  భాగస్వామిలో  చిన్న  లోపాలున్నా  శాడిజం  అనేస్తున్నారు. అది  తప్పు.  ) 
..................... 

సుమతిలాంటి   అత్యంత  సహనశీలురకు   న్యాయం  చేయటానికి  సూర్యుడు , అనసూయాదేవి  వంటి   వారు  కూడా తమ  సహకారాన్ని  అందిస్తారు.
.......................

వ్యసనపరులను, చెడ్డపనులు   చేసేవారిని 
చెంపపగలగొట్టాలని కొందరు   అంటారు .అయితే, చెంపపగలగొట్టటం  వల్ల  మళ్ళీ   చెడ్డపనులను   చేయరని   నమ్మకమేమిటి ?

  రెచ్చిపోయిన  వాళ్ళు   మరింతగా   చెడ్డపనులను  చేసే  ప్రమాదం  కూడా  ఉంది.

అయితే ,  అలాగే  వదిలేస్తే  వారు  సమాజం  మీద  పడి  ఇతరులకు  హాని  చేసే  అవకాశం  
కూడా  ఉంది.

 అందుకని,   వారిని  మంచివారి గా  మార్చటానికి  ప్రయత్నించటంలో  తప్పులేదేమో...అనిపిస్తోంది.


ప్రయత్నించినా  మారకపోతే  అప్పుడు  కఠినంగా  శిక్షించవలసిందే.  


మరీ  క్రూరమైన  నేరాలను  చేసిన  వారి  విషయంలో  మాత్రం  వారిని  మార్చటానికి  ప్రయత్నించటం  కన్నా .....  వెంటనే  కఠినంగా  శిక్షించటమే  మంచిదనిపిస్తోంది.  


ఆ  శిక్షలు  ఎలా ఉండాలంటే, ఇతరులు  మళ్ళీ  తప్పు  చేయటానికి  భయపడేంత  కఠినంగా  శిక్షించాలి.  


నేరస్తులకు   కఠినశిక్షలు  వేసిన  తరువాత  ,  అటువంటివారు    తయారుకావటానికి    గల  మూల  కారణాలను  గుర్తించి   వ్యవస్థను   మార్చటానికి  ప్రయత్నించాలి.
.............................. 

మన  పూర్వీకులైన  భార్యాభర్తలు  ఇప్పటి  కాలపు  భార్యాభర్తలలా .......నా హక్కులే  నాకు  ముఖ్యం...అంటూ   విడిపోయి  ఉంటే  ఈ దేశంలో  కుటుంబవ్యవస్థ  ఎప్పుడో  మాయమై  ఉండేది. 
 ...................... 

   మనుషుల  మధ్య  ఎన్నో  భేదాభిప్రాయాలు  ఉంటాయి.  తల్లిబిడ్డల  మధ్య  కూడా   అభిప్రాయ  భేదాలు  వస్తుంటాయి.  ఎక్కడో  పుట్టిపెరిగిన  భార్యాభర్తల  మధ్య  అభిప్రాయభేదాలు  ఉండటం  అత్యంత  సహజం.

అందుకే  మన  పెద్దవాళ్ళు  సర్దుకుపోతూ  సంసారాలు  చేసారు. తమ  సుఖసంతోషాలను   కొద్దిగా  తగ్గించుకుని  అయినా పిల్లలను  సంతోషంగా  ఉంచారు.

...................

ఎన్నో  కష్టాలను  సహించి   కుటుంబవ్యవస్థను  నిలబెట్టిన  ఈ  దేశపు  పెద్దవాళ్ళకు  శిరస్సు  వంచి  నమస్కరిస్తున్నాను. 


  ..........................

దయచేసి  ఈ  క్రింది  లింక్ కూడా  చదవగలరు ..
  


Wednesday, December 10, 2014

పాపాలు చేసే వారి పట్ల అంటరానితనాన్ని పాటించాల..


  • పూర్వీకులు  అంటరానితనాన్ని  ప్రోత్సహించారని  కొందరు    తప్పుపడతారు. దయచేసి  పెద్దలను  తప్పు  పట్టవద్దు . 

    పశుపక్ష్యాదులనే  పూజించమని  చెప్పిన  పెద్దలు  సాటి  మనుషులను  తక్కువగా  చూడమని  చెప్పరు  కదా  !

    దైవం దృష్టిలో   అందరూ సమానమేనని   పెద్దలు  ఎంతగానో   చెప్పటం   జరిగింది. పురాణేతిహాసాలలో దీనికి ఎన్నో ఉదాహరణలు కూడా చెప్పబడ్డాయి .

    ధర్మరక్షణకోసం  విష్ణుమూర్తి  దశావతారాల్లో  జంతుజన్మలను  ధరించటానికి  కూడా  వెనుకాడలేదు.


    ఈ   విషయాలను  గమనిస్తే , సృష్టిలో  ఏ  జీవినీ  తక్కువగా  చూడకూడదని  తెలుస్తుంది.

    అందుకే   పశుపక్ష్యాదులను,  చెట్లను  కూడా  పూజించి  గౌరవించమని  పూర్వీకులు  మనకు  నేర్పించారు. 


    వేదములలోని  విషయములను  చక్కగా  అర్ధం  చేసుకోవటానికి   పురాణేతిహాసాలు  తోడ్పడుతాయి.  


    వేదపురాణేతిహాసాలలోని  భావాలను  సమాజానికి  మరింత  చక్కగా  తెలియజేయటానికి ఎందరో  అవతారమూర్తులు,  మహానుభావులు  జన్మించారు.

    వీరి  బోధనలు  మరియు  ,  ఆచరణ  ద్వారా  ఏది  ధర్మం,  ఏది  అధర్మం  అనే  విషయములు    అందరికీ  తెలుస్తాయి.  


      శ్రీ  రాముడు  శూద్ర  స్త్రీ  అయిన   శబరి  సమర్పించిన  ఫలాలను  స్వీకరించారు.  గుహునితో  స్నేహం  చేశారు. శ్రీరాములవారు  అంటరానితనాన్ని  పాటించలేదు.

    భగవద్గీతలో శ్రీకృష్ణుడు .... అందరూ సమానమేనని చెప్పటం జరిగింది.


    శ్రీపాద శ్రీవల్లభుల సంపూర్ణ జీవిత చరిత్రము ..గ్రంధములో  కూడా ఇలాంటి   విషయములు   వివరంగా  చెప్పబడ్డాయి.


     ఆది శంకరాచార్యుల జీవితంలోని ఒక సంఘటన ద్వారా .... అంటరానితనం తప్పు ....అని తెలుస్తోంది.  శివుడే  ఈ  విషయాన్ని  తెలియజేశారంటారు. 


     మహావతార్  బాబాజీ  శిష్యులైన  లాహిరీ  మహాశయులు, స్వామి యుక్తేశ్వర్ , పరమహంస  యోగానంద,  రామకృష్ణపరమహంస,  వివేకానందుడు...మొదలగువారు  గొప్ప  మహానుభావులు.  వీరు   అంటరానితనాన్ని   పాటించలేదు.

  • ఒక యోగి ఆత్మకధలో ..... లాహిరీ మహాశయుల వారికి అన్ని కులాల నుంచి శిష్యులు ఉండేవారని చెప్పటం జరిగింది.

    రామకృష్ణమఠంలో అన్ని కులాలు, మతాల వారికి   ప్రవేశం ఉంది.

    ..........................................



    అంటరానితనాన్ని  అగ్రవర్ణాల   వాళ్ళు  పాటించారని  కొందరు  అంటారు.  
     అగ్రవర్ణాలవాళ్ళలో ఇతరులను  ఎంతో చక్కగా  ఆదరించిన  వారెందరో  ఉన్నారు.  అగ్రవర్ణాల లో  కూడా పేదరికంతో  దయనీయంగా  జీవిస్తున్నవారెందరో  ఉన్నారు. 

     కొన్ని  గ్రామాలలో  ధనవంతులైన  శూద్రులు   పేదవారైన  శూద్రుల  పట్ల   పట్ల  అంటరానితనాన్ని పాటించారు.  


    .........................................

     వేదములలోని  కొన్ని  విషయాలు .....ఈ విషయాలు    అంతర్జాలంలో  సేకరించినవి.


     Before we begin our journey of solving the caste-puzzle through Vedas, let us start with certain worship mantras from Vedas that mention Shudras:


    Yajurved 18.48:
    O Lord! Provide enlightenment/ compassion to our Brahmins, Kshatriyas, Vaishyas and Shudras. Provide me also with the same enlightenment so that I can see the truth.

    Yajurved 20.17:
    Whatever crime we have committed against my village, forest or committee; whatever crime we have committed through our organs, whatever crime we have committed against Shudras and Vaishyas, whatever crime we have done in matters of Dharma, kindly forgive us relieve us from the tendency of the same.

    Yajurved 26.2:
    The way I gave this knowledge of Vedas for benefit of all humans, similarly you all also propagate the same for benefit of Brahmins, Kshatriyas, Shudras, Vaishyas, Women and even most downtrodden. The scholars and the wealthy people should ensure that they not deviate from this message of mine
    .***
     There are several shlokas in Manusmriti that state that a person belonging to high Varna falls down to level of a Shudra (uneducated) if he does not conduct noble deeds. For example,

    2.104: A person who does not worship the Supreme Lord twice daily should be considered a Shudra.

    2.172. He who has not been initiated with teaching of the Vedas is a Sudra.

    4.245: A Brahmin acquires brilliance through company of noble persons and avoiding bad company. On contrary, if he indulges in bad company, he becomes a Shudra.


    ..................................

    గ్రంధముల  ద్వారా  తెలుసుకున్న  మరి  కొన్ని  విషయములు.....

    బ్రాహ్మణ  క్రత్రియ  వైశ్యులను  ద్విజులు అంటారు...ఉపనయనం  జరగకుండా  వారికి  ద్విజత్వం  రాదు.  అందాకా  వీళ్ళు  శూద్రుల  కిందనే  లెక్క.  రాకుమారులకు  11  వ ఏట,  బ్రాహ్మణ పుత్రులకు  ఎనిమిదవ  ఏట, వైశ్య  తనయులకు  పన్నెండవ  ఏట  ఉపనయనం  చెయ్యాలని  ధర్మశాస్త్రాల  నిర్ణయం......... అన్నట్లు    పెద్దలు  తెలియజేశారు.

    ..........................


    భీష్ముల  వారి  విషయంలో............

    భారతంలో , భీష్ముల  వారు అంపశయ్యపై  ఉన్నప్పుడు  వారే  తెలియజేసిన  విషయాన్ని  బట్టి ,  వ్యక్తులు  తినే  ఆహారాన్ని  బట్టి    మనస్తత్వంలో  మార్పులుచేర్పులు  వస్తాయని  తెలుస్తుంది. 


      అధర్మంగా  ప్రవర్తించే  వారి  వద్దనుంచి  స్వీకరించే  ఆహారం  వల్ల  కూడా స్వీకరించిన వారి  మనస్తత్వంలో  మార్పులుచేర్పులు  వస్తాయని  తెలుస్తుంది.

     దుర్యోధనుడు  గొప్ప  వంశంలో   జన్మించినా   కూడా  ,అధర్మపరుడైనందువల్ల  అతని  నుంచి  స్వీకరించిన  ఆహారం  వల్ల  భీష్ముల  వారికి  కష్టాలు  వచ్చాయి.  


    శ్రీ కృష్ణుల వారు   కూడా.....దుష్టుడైన  దుర్యోధనుని  ఆహ్వానాన్ని  తిరస్కరించి , సౌమ్యుడైన  విదురుని  ఆతిధ్యాన్ని స్వీకరించారు. 

    పై  విషయాలన్నీ  గమనిస్తే  ,  అధర్మంగా  ప్రవర్తించేవారిపట్ల..,   పాపాలు  చేసే వారి  పట్ల  అంటరానితనాన్ని  పాటించాలన్నది . పెద్దల  అభిప్రాయం  అనిపిస్తుంది.

    ....................................................

    కొందరు  గొప్ప పదవి  లభించినా  అంతటితో  తృప్తిని  పొందక  ఇంకా  ఏదో  కావాలని  అశాంతితో  జీవిస్తారు. 


     భగవదనుగ్రహాన్ని  పొందాలంటే  నిష్కామకర్మతో జీవించాలని పెద్దలు  తెలియజేశారు.  

  • నిష్కామ  కర్మతో  జీవించేవారు  మహారాజ  పదవిలో  ఉన్నా,   పొంగిపోకుండా  ప్రశాంతంగా  జీవించి  దైవకృపకు  పాత్రులవుతారు.    జనకమహారాజులా.  


     నిష్కామ  కర్మతో  జీవించేవారు  
    ఆడంబరాలు లేకున్నా,   క్రుంగిపోకుండా  ప్రశాంతంగా  జీవించి  దైవకృపకు  పాత్రులవుతారు . శబరి లా.

    భగవంతుని  కరుణను  పొందిన  జీవులలో   పశువులు,  పక్షులు,   పేద వారు,  ధనవంతులు, అన్నిరకాల  జీవులు  ఉన్నారు. అంతా  దైవం  దయ.



Friday, December 5, 2014

ఓం..


ఈ రోజు తిరువణ్ణామలైలో మహాదీపోత్సవం  జరిగిన  రోజు.  ఈ ఉత్సవం ఎంతో వైభవంగా జరుగుతుంది.

తిరువణ్ణామలైలో  కొలువున్న దైవానికి నమస్కారములు.

దత్తజయంతి సందర్భంగా శ్రీ అనఘాదేవీ శ్రీ దత్తాత్రేయస్వామి వార్లకు నమస్కారములు.

శ్రీపాదశ్రీవల్లభస్వామి వారికి నమస్కారములు.

    దిగంబర! దిగంబర!! శ్రీపాదవల్లభ దిగంబర !!!
       శ్రీపాదరాజం శరణం ప్రపద్యే .

 శ్రీపాదశ్రీవల్లభసంపూర్ణ చరితామృతము  గ్రంధములో .. శ్రీపాదశ్రీవల్లభ స్వామి వారి గురించిన ఎన్నో వివరములు మరియు అత్యంత శక్తివంతమైన సిద్ధమంగళ స్తోత్రము ఉన్నవి. 

కొన్ని వివరములను.....ఈ  లింకుల  ద్వారా కూడా తెలుసుకోవచ్చు.
         
    

Sripada Siddhamanagala Stotram.wmv - YouTube 

Dattatreya - Siddha Mangala Stotram.mp4 - YouTube


 


Friday, November 28, 2014

భగవద్గీత గురించి కొన్ని విమర్శలు..నా అభిప్రాయాలు.

ఇక్కడ నేను వ్రాసిన విషయాలు.. ఒకామె వ్రాసిన పుస్తకంలోని విషయాలకు నా సమాధానాలు. ఆమె పేరు రంగనాయకమ్మ అనుకుంటా..? 
 
 ఈ విషయాలలో అంతరార్ధాలు చాలా ఉంటాయి.  అయితే, ఈ రోజుల్లో సామాన్యంగా అర్ధం అయ్యేలా వ్రాయటం జరిగింది.
 
 
వాళ్ళ అభిప్రాయాలు....  గీత అహింస, వైరాగ్యాలు ఉపదేశిస్తుందని కదా అంటారు?

anrd.గీత అహింస,వైరాగ్యాలు ఉపదేశిస్తుందన్నది నిజమే. సమాజానికి చెడు చేసేవాళ్ళను శిక్షించటం కూడా అహింస క్రిందకే  వస్తుంది. కర్తవ్యాన్ని ధర్మబద్ధంగా నిర్వహించాలంటే .. వైరాగ్యమూ అవసరమే. 

వాళ్ళ అభిప్రాయాలు.. (గీత 2/23) (ఆత్మను అస్త్ర - శస్త్రాలు ఏమీ ఛేదించలేవు. అగ్ని దహించలేదు) అని ఆలోచించి, ఎవరినైనా గండ్రగొడ్డలితో ఒక మాంచి దెబ్బ వేస్తే ఏం?’ తర్వాత వాళ్ళ బంధువులు  ఏడ్వడం మొదలు పెడితే .. 

ఏడుస్తున్నారెందుకు?’ (గీత 2/22) (మనిషి చిరిగిన బట్టలు విడిచిపెట్టి కొత్త బట్టలు ఎలా ధరిస్తాడో, అదే విధంగా జీవాత్మ జీర్ణించిన శరీరాన్నివదలిపెట్టి కొత్త శరీరాన్ని గ్రహిస్తుంది.) - అని అంటే!


anrd..మనిషి చిరిగిన బట్టలు విడిచిపెట్టి కొత్త బట్టలు ఎలా ధరిస్తాడో, అదే విధంగా జీవాత్మ జీర్ణించిన శరీరాన్ని వదలిపెట్టి కొత్త శరీరాన్ని గ్రహిస్తుంది.. 
 
 ఇలాంటి వాక్యాలు..జీవితంలో ధర్మయుద్ధం చేయటానికి భయపడినప్పుడు , ఆప్తులు  రణించినప్పుడు.. ధైర్యాన్నికలగజేస్తాయి.


 ధర్మయుద్ధం చేయటానికి వెనుకంజవేస్తున్న అర్జునునికి ధైర్యం చెప్పటానికి కృష్ణుడు ఇవన్నీ చెప్పారు. అంతేకానీ, ఎవరినిపడితే వారిని చంపి, పైవాక్యాలు అనాలన్నది కృష్ణుని ఉద్దేశం కాదు. 


వాళ్ళ అభిప్రాయాలు.. గీత పదును కూడా ఎక్కిందంటే ప్రతి ఊరూ కురుక్షేత్రం అయిపోతుంది. అందుకే నేను చేతులు జోడించి ఉడుకు రక్తంలో గీత చదవ వద్దు బాబూ, అంటాను.

anrd.. గీతోపదేశం విన్నతర్వాత ప్రతి ఊరూ కురుక్షేత్రం ఎందుకు అవుతుంది ? కృష్ణుడు చెప్పింది  ధర్మయుద్ధం చేయమని మాత్రమే. ఊరకనే ప్రజలు ఈటెలు, బల్లేలు బయటికి తీయమని  కాదు.

వాళ్ళ  అభిప్రాయాలు.. ‘అర్జునా!..ఇంత జ్ఞానం నేను ఇచ్చిన తర్వాత శరీరం నశ్వరమని, ప్రపంచం క్షణభంగురమని ప్రాపంచిక సుఖాలు తుచ్ఛమైనవి. రాజ్యకాంక్ష వదిలేసేయి.... ఈ మాటలేవీ ఆయన అనలేదు.

anrd..అసూయాపరుడైన దుర్యోధనుడు మాయాపాచికల  సాయంతో  పాండవులను ఓడించి  అడవులకు  పంపించాడు. అలాంటి దుర్యోధనుడుకి రాజ్యాన్ని వదిలి పాండవులు యుద్ధం చేయకుండా ఒక మూల కూర్చోవాలనటం  ఏం న్యాయం? ఇది న్యాయం కాదు కాబట్టే, దుష్టుడైన  దుర్యోధనుని శిక్షించటానికి  యుద్ధం చేయాలని శ్రీకృష్ణుల వారు అర్జునుని అనేక విధాలుగా ప్రోత్సహించారు.

 
వాళ్ళ అభిప్రాయాలు.. జీవుడు నశించనప్పుడు హత్య చేసిన వాడికి ఉరిశిక్ష ఎందుకివ్వాలి?

anrd. జీవునికి మరలమరల జన్మలను ధరించే అవకాశం ఉంది కాబట్టి, జీవుడు ఎప్పుడూ నశించడనేది వాస్తవమే. అలాగని జీవించి ఉన్నవారిని హత్యచేసే వాళ్ళను శిక్షించకుండా ఊరుకోవాలా?    

వాళ్ళ అభిప్రాయాలు.. కృష్ణుడు ఒకచోటనేమో ఇలా ఉపదేశిస్తున్నాడు --(గీత. 14/24) (సుఖదుఃఖాలను సమానంగా భావించి, ఆత్మస్థుడై ఉంటూ మట్టి గడ్డను, రాతిని, బంగారాన్ని, ఒకటిగానే ఎంచుతూ, ఇష్టానిష్టాలను, నిందాస్తుతులను సమభావంతో ఎవడు స్వీకరిస్తాడో వాడే ధీరుడు).ఒకసారి అనాసక్త కర్మను ఉపదేశిస్తాడు - (గీత 2/38) (సుఖదుఃఖాలను, లాభనష్టాలను, జయాపజయాలను, సమానంగా భావించి యుద్ధానికి సన్నద్ధుడవు కా. దీనివల్ల నీకు పాపమంటదు)తర్వాత గెలుపు ఆశ కూడా చూపుతాడు -(గీత 11/33) (కాబట్టి అర్జునా, లే, యశస్సు పొందు, శత్రువులను జయించి సమృద్ధమైన రాజ్యం అనుభవించు) ఇక నీవే చెప్పు, సుఖం, దుఃఖం, గెలుపు, ఓటమి, కీర్తి, అపకీర్తి అన్నీ సమానమైనప్పుడు భగవానుడు జయము, కీర్తి, వీటి ఆశ ఎందుకు చూపుతున్నాడు?

 భగవానుడంటాడు -  (గీత 18/61) (ఈశ్వరుడే సర్వప్రాణుల హృదయాల్లో నెలకొని తన మాయ ప్రభావంతో వానిని కీలు బొమ్మల్లాగా ఆడిస్తున్నాడు.) ఈ మాటే నిజమైతే ఇంత అయోమయం సృష్టించవలసిన పనే ముంది? నేరుగా తన యంత్రమే తిప్పేస్తే సరిపోయేదికదా! .. తర్వాత మళ్ళీ ‘యథేచ్చసి తథా కురు’ (గీత 18/63) (నీ కోరిక ఎలా ఉంటే అలా చెయ్యి) అనే మాట ఎందుకంటాడు?


 కృష్ణుడు ఇలా ఎందుకన్నాడు -(అన్ని ధర్మాలు (కర్తవ్య కర్మలు) వదలి పెట్టి నా ఒక్కని శరణు పొందు. నేను నీకు అన్ని పాపాల నుండి విముక్తి కలిగిస్తాను).ఈ మాటే చెప్పదలచుకొని ఉంటే, ఏడు వందల శ్లోకాల అవసరం ఏముంది? 


anrd..చదవటానికి ఇష్టపడని పిల్లవానికి తల్లి ఎన్నో విధాలుగా నచ్చచెప్పటానికి ప్రయత్నిస్తుంది. చదువు  ప్రాదాన్యత గురించి కాసేపు బుజ్జగించి చెబుతుంది. చదువుకుంటే జీవితంలో ఎన్నో సుఖాలు లభిస్తాయని ఆశ పెడుతుంది. చదువుకోకుంటే కష్టాలు వస్తాయని భయపెడుతుంది. చదువుకోవటం  విద్యార్ధి ధర్మం కాబట్టి తప్పక చదవాలని బోధిస్తుంది. చదువులో అర్ధం కాని ప్రశ్నలు ఉంటే తనను సాయం అడిగితే (శరణు కోరటం) అర్ధం అయ్యేటట్లు చెప్పి పరీక్షలో పాసయ్యేటట్లు  చేస్తానని  అభయమిస్తుంది. చదువుతావో..చదవవో ఇక నీ ఇష్టం అనీ అంటుంది. 

జగన్నాటకం అనే ఆట లేకపోతే సృష్టి జడంగా ఉంటుంది కాబట్టి , తన మాయాప్రభావంతో జీవులను సృష్టించి జగన్నాటకాన్ని ఆడిస్తారు దైవం. 


జీవికి ఒక జన్మను ఇచ్చి భూమికి పంపుతారు.పుట్టినతరువాత చాలామంది అంతులేని కోరికలతో ఎన్నో కర్మలు చేస్తారు...చేసిన పాపపుణ్య కర్మల ఫలితంగా కష్టసుఖాలను అనుభవిస్తూ, తిరిగితిరిగి జన్మలను పొందుతూ  ఉంటారు.మానవులు చేసే పాపపుణ్యాల ఫలితాల ప్రకారం జన్మలను ఇస్తూ..దైవం తన మాయ ప్రభావంతో జీవులను కీలు బొమ్మల్లాగా ఆడిస్తున్నారు.


 నిష్కామకర్మను ఆచరిస్తూ జీవించేవారికి పాపపుణ్యాల కర్మబంధం నుండి విముక్తి కలిగి, జన్మపరంపరనుండి విడుదల లభించి పరమపదాన్ని పొంది హాయిగా ఉంటారు.


వాళ్ళ అభిప్రాయాలు..  కృష్ణుడు మనసుకు ఏది తోస్తే అది చెప్పుకుంటూ వెళ్ళాడు -- క్షత్రియుడివి. కనుక యుద్ధం చెయ్యి. యుద్ధం చేయకపోతే నిందల పాలవుతారు. కాబట్టి యుద్ధం చెయ్యి.’

 
anrd..క్షత్రియుని స్వధర్మంలో యుద్ధం చేయటమూ ఒక భాగమే. రాజ్యాన్ని పాలించటమూ, కోల్పోయిన  రాజ్యం కోసం యుద్ధం చేయటమూ క్షత్రియులకు ధర్మమే.

 పాండవులకు అధికారదాహం  ఏమీ లేదు. పాండవులకు అధికారదాహమే ఉంటే గంధర్వుల  నుంచి దుర్యోధనాధులను రక్షించకుండా ఉపేక్షించి మొత్తం రాజ్యాన్ని ఏలుకునేవారు. కానీ పాండవులు  అలా చేయలేదు. గంధర్వులు దుర్యోధనుని పట్టుకున్నప్పుడు పాండవులే దుర్యోధనాదులను  రక్షించారు.


దుర్యోధనుడు అసూయతో  చిన్నతనం నుండి పాండవులను ఇబ్బందులు పెడుతూనే ఉన్నాడు. లక్క ఇంటిలో  చంపటానికీ ప్రయత్నించాడు. ధృతరాష్ట్రుడు అంధుడవటం వల్ల పాండు రాజే రాజ్యాన్ని సంరక్షించేవాడు. అయినా పాండవులు, మొత్తంరాజ్యాన్ని ఆశించలేదు. 


 అయిదు  ఊళ్ళు ఇస్తే చాలన్నా ఒప్పుకోకుండా, దుర్యోధనుడు యుద్ధానికి సిద్ధమయ్యాడు.  దుర్యోధనుని అధికారదాహం, అసూయ వల్ల భారతయుద్ధంలో ఎందరో సైనికులు  మరణించారు. ఎన్నో కుటుంబాలు నాశనమయ్యాయి.


వాళ్ళ  అభిప్రాయాలు.. శ్రీకృష్ణుడు అర్జునికేమో ఇలా ఉపదేశిస్తాడు -(గీత 2/11) (జ్ఞానులయిన వారు మరణించిన వారిని గురించిగానీ, జీవించి ఉన్న వారిని గురించిగానీ శోకించరు). కానీ, అభిమన్యుని చంపినప్పుడు ఈ జ్ఞానం ఎక్కడ మాయమై పోయింది? -- 

anrd.నిజమే, అభిమన్యుని చంపినప్పుడు  అర్జునుడు  శోకించాడు.ఎంత జ్ఞానం తెలుసుకున్నా మనిషిగా జన్మను ఎత్తిన తరువాత ఎంతటివాళ్ళైనా కూడా మానవుల వలెనే భావాలను ప్రకటించటం కనిపిస్తుంది.

వాళ్ళ అభిప్రాయాలు..  జయద్రథునితో పగ సాధించడానికి అంత మాయోపాయం ఎందుకు చేయవలసి వచ్చింది?

 anrd.. జీవితంలో స్వధర్మాన్ని ఆచరించే సమయంలో ఎన్నో ఎత్తులు పైఎత్తులు వేయవలసిన పరిస్థితులూ ఎదురయ్యే అవకాశం ఉంది.అలాంటప్పుడు  ఉపాయంగా ధర్మరక్షణ చేయవలసి  ఉంటుంది.


వాళ్ళ  అభిప్రాయాలు..  కృష్ణుడంటాడు - (గీత. 2/55) (ఎవరైతే అన్ని కోరికలు త్యజించి తమలో తామే సంతృప్తులై ఉంటారో, వారే నిజమైన స్థితప్రజ్ఞులు) అలాంటప్పుడు రాజ్యం, స్వర్గం, వీటి ఆశ చూపుతూ ఇలా ఎందుకన్నాడు?-(అర్జునా! చనిపోతే స్వర్గం ప్రాప్తిస్తుంది. జయం పొందితే రాజ్య భోగాలననుభవిస్తావు. రెంటికి అతని పాడు విధాల లాభమే ఉంది. అందువల్ల కృతనిశ్చయుడవై యుద్ధానికి లే! )

anrd..  యుద్ధం చేయటం అర్జునుని కర్తవ్యం. రాజ్యాన్ని స్వార్ధపరుల చేతుల్లో నుంచి రక్షించే బాధ్యత అతనిపై ఉంది. స్వార్ధము, కోరిక, సంతోషము, భయము, ఆశ, బంధుప్రీతి ..లేకుండా కర్తవ్యాన్ని నిర్వహించేవారు స్థితప్రజ్ఞులు... ఒక న్యాయమూర్తి తీర్పును ఇచ్చేటప్పుడు మిత్రులు,శత్రువులు.. అనే తేడా ఉండకూడదు.

బంధుప్రీతి వల్ల అర్జునుడు యుద్ధాన్ని చేయకపోతే, దుర్యోధనుని వంటి స్వార్ధపరుల వల్ల రాజ్యంలోని ప్రజలూ కష్టాలను అనుభవిస్తారు. ఇలాంటప్పుడు అర్జునునికి స్వర్గాశ చూపించి అయినా ధర్మయుద్ధం చేయించాలని  కృష్ణుడు అలా అని ఉండవచ్చు.


వాళ్ళ అభిప్రాయాలు..కృష్ణుడు తాను మాత్రం జరాసంధునితో యుద్ధం చేయలేక ద్వారకకు పలాయనం చిత్తగించాడు!

anrd..  ప్రతి వారిని శిక్షించటానికి ఒక సమయం  ఉంటుంది. తప్పుచేసిన వారిని వెంటనే శిక్షించరు. వాళ్ళు మారటానికి కొంత సమయాన్ని ఇస్తారు. అప్పటికీ మారకపోతే ఇక తప్పక శిక్షిస్తారు. జరాసంధుని కొంతకాలం వదలటానికి కారణం అప్పటికి  అతని పాపం పండలేదు.  

వాళ్ళ అభిప్రాయాలు.. అర్జునుడు తర్కం శాస్త్రం చదవలేదు. అందుకే రెండు విధాలా ఉచ్చులో చిక్కుకున్నాడు. నేనుండి ఉంటే అడిగేవాణ్ణి. ‘హే కృపాసింధు, ఈ రెండూ కాక మరో పరిణామం కూడా జరగవచ్చు కదా! అర్జునుణ్ణి పట్టి బంధిస్తే అప్పుడు మరి ఎలా? స్వర్గమూ ఉండదు, రాజ్యమూ ఉండదు కదా! రెంటికీ చెడ్డ రేవడై పోయినట్లే కదా!’

anrd..అర్జునుడు రెంటికీ చెడ్డ రేవడి ఎందుకవుతాడు? బంధితులు ఎవరైనా సరే, కలకాలం అలా బంధితులుగానే జీవిస్తూ ఉండిపోరు కదా! యుద్ధం చేస్తూ పట్టుబడి బంధితుడుగా మరణించితే  స్వర్గం  లభిస్తుంది. బంధనాలనుంచి తప్పించుకుని మరల యుద్ధం చేస్తే రాజ్యం లభించే అవకాశమూ  ఉంది..

వాళ్ళ అభిప్రాయాలు..అంత భయంకరమైన యుద్ధం జరగబోయేముందు పద్ధెనిమిది అధ్యాయాల గీత చెప్పడానికి, వినడానికి తీరిక ఎవరికి వుంది? అంతవరకు పద్ధెనిమిది అక్షౌహిణుల సైన్యం త్రాటక ముద్రలో కుంభక ప్రాణాయామం చేస్తూ వుందా? సంజయుని కళ్లల్లో టెలివిజన్ ఫిట్ అయి ఉందా? 

anrd.. పద్ధెనిమిది అధ్యాయాల గీత చెప్పడానికి, వినడానికి  ఎక్కువ  సమయం  అవసరం లేదు. అంతా తృటిలో జరిగిపోతుంది దైవం తలచుకుంటే.

సంజయునికి దైవం ప్రసాదించిన దూరదృష్టికి నేటికాలంలో టీవీల ద్వారా చూస్తున్న దూరదృష్టికి  పొంతన లేనేలేదు. భౌతికశక్తి ద్వారా  పొందేదానికీ..ఆధ్యాత్మికశక్తి ద్వారా పొందే దానికి ఎంతో తేడా ఉంది. 

 ఒక మహర్షి ఒక మహారాజుకు తృటిలో జ్ఞానాన్ని ఉపదేశించారని గ్రంధాల ద్వారా తెలుస్తుంది. 
మరి, శ్రీ కృష్ణపరమాత్ములవారు ఇంకా ఎంతో గొప్పగా  బోధించగలరు.

 కృష్డుడు అర్జునునకు గీతను బోధించటం ఎలా జరిగింది? సంజయుడి దూరదృష్టి ఎలాంటిది ? అనే  విషయాలను కొద్దిగానైనా తెలుసుకోవాలంటే ఆధ్యాత్మిక మార్గం ద్వారా తెలుసుకోవలసిందే.కేవల  భౌతికవాదులకు అవి ఎప్పటికీ అంతుబట్టని విషయాలే.   

 ...........

 వ్రాసిన  విషయాలలో  ఏమైనా  పొరపాట్లు  ఉంటే  దయచేసి  క్షమించాలని దైవాన్ని  ప్రార్ధిస్తున్నాను. 
...............

anrd..  ఎంతో తెలివిగలవాళ్ళమనుకునే వాళ్ళు కూడా, తమ చేతిలో ఏమీ లేదనీ, దైవమే అత్యంత శక్తివంతుడని ఎప్పటికో ఒకప్పటికి తెలుసుకుంటారు. ఇలా తెలుసుకోవటానికి కొందరికి కొన్నిజన్మలు  కూడా పట్టవచ్చు. ఎవరికైనా చివరికి తెలిసిదేమిటంటే, భగవంతుని శరణువేడటం తప్ప  వేరే మార్గం లేదని.


Wednesday, November 26, 2014

మహాభారతం గురించి కొన్ని విమర్శలు...నా అభిప్రాయాలు..

ఇక్కడ నేను వ్రాసిన విషయాలు.. ఒకామె వ్రాసిన పుస్తకంలోని విషయాలకు నా సమాధానాలు. ఆమె పేరు రంగనాయకమ్మ అనుకుంటా..?
 
ఈ విషయాలలో అంతరార్ధాలు, ధర్మసూక్ష్మాలు.. చాలా ఉంటాయి.  అయితే, ఈ రోజుల్లో సామాన్యంగా అర్ధం అయ్యేలా వ్రాయటం జరిగింది.
 
 వాళ్ళ అభిప్రాయాలు.. ధర్మరాజు జూదం ఆడటానికి సరదా పడకుండా ఉండి ఉంటే ఇదంతా ఎందుకు జరిగేది? ఆయన ఓడిపోతే అందులో ఇతరుల తప్పేముంది? 

anrd.. ధర్మరాజు తనకు తానై వెళ్ళలేదు. దుర్యోధనుడు కోరగా, ధృతరాష్ట్రుడు ధర్మరాజుకు కబురు పెడతాడు పాచికలాటకు రమ్మని. పెద్దలమాట తిరస్కరించటం ఇష్టంలేని  ధర్మరాజు పాచికలాట ఆడటానికి వచ్చి  ఓడిపోయి, వనవాసం  చేస్తూ కష్టపడవలసి వచ్చింది. 


 నీతి..ఇలాంటి విషయాలలో పెద్దవాళ్ళు ఆహ్వానించినా సరే వెళ్ళకుండా ఉండటమే మంచిది.


 వాళ్ళ అభిప్రాయాలు..
వారి తల్లి కుంతి ఆజ్ఞ కదా,‘ఐదుగురూ సమానంగా పంచుకొండి’అని. మర్యాదస్తుల పద్ధతి ఇదేనా? అందుకే గదా, ఒకసారి కర్ణుడు నిండు సభలో.. (కురునందనా! స్త్రీకి ఒకే భర్త ఉండాలని దేవతలు నిర్దేశించారు. కాని, ఈమె అనేకుల వశవర్తిని. కాబట్టి ఖచ్చితంగా ఉంపుడు కత్తే!)..అని అన్నాడు

anrd..ద్రౌపదికి ఐదుగురు భర్తలు ఉండటం వెనుక అనేక కారణాలున్నాయి, వాటికి అనేక  అంతరార్ధాలూ ఉన్నాయి. ఆ కారణాలను, అంతరార్ధాలనూ అలా ఉంచి, పైకి  తెలుస్తున్న  విషయాలను బట్టి గమనిస్తే ఎన్నో విషయాలు తెలుస్తాయి.

ఒక సంసారం ఉంటేనే ఎన్నో బాధ్యతలు ఉంటాయి. ఎక్కువ సంసారాలు ఉంటే మరిన్ని ఎక్కువ  బాధ్యతలను నెత్తిన వేసుకోవలసి వస్తుంది.ద్రౌపది ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క భర్త వద్ద ఉండేలా  ఏర్పాటు జరిగింది.ఒక భర్త వద్ద ఉన్నప్పుడు మిగతా భర్తల సేవ కుదరదు కదా!ఇలాంటప్పుడు ఎన్నో  చిత్రమైన సమస్యలు ఎదురవుతాయి.ఇలాంటి సందర్భంలోనే అర్జునుడు తీర్ధయాత్రలకు వెళ్ళటం, సుభద్రతో వివాహం జరగటం జరిగాయి.    


నీతి: ఎక్కువ వివాహాలు చేసుకుంటే ఎక్కువ  బాధ్యతలు, ఎక్కువ కష్టాలు వస్తాయి. అందుకే స్త్రీలైనా, పురుషులైనా ఎక్కువ వివాహాలు చేసుకోకూడదు.


వాళ్ళ అభిప్రాయాలు..ఇటు ద్రౌపది వస్త్రాపహరణ జరుగుతూంటే అటు పాండవులు సభలో కిమ్మనకుండా కూర్చున్నారు!వాళ్ళలో పౌరుషమంటూ లేకపోయింది! 

anrd..ద్రౌపది పట్ల అమానుషంగా ప్రవర్తించినందుకు ఫలితంగా దుర్యోధనుడు అతని సోదరులు నాశనమై  పోయారు. ఈ సంఘటన ద్వారా ఇతరుల పట్ల అమానుషంగా ప్రవర్తిస్తే ఏమవుతుందో తెలుసుకోవచ్చు.

పాచికలాటలో ఓడిపోయారు కాబట్టి పాండవులు మౌనంగా ఉండిపోయారు. ద్రౌపదిని పణంగా పెట్టడం తప్పే..పాండవులు కూడా జీవితంలో ఏమాత్రం సుఖపడ్డారు ?

వాళ్ళ  అభిప్రాయాలు.. పాండవుల తండ్రి పాండురాజు .. సంతానోత్పత్తి చేయడంలో అసమర్థుడు. అందువల్ల ఐదుగురు దేవతల ఆవాహన చేసి పాండవులు జన్మించేట్లు చేయడం జరిగింది. అరే, దీనికంటే పాండురాజు నిస్సంతుగా మరణించినా బాగుండేది. ఎవరికి వందమంది అన్న కుమారులున్నారో, అతడికి వంశం ఇంకా వృద్ధిచేసుకోవాలని అంత ఆరాటం ఎందుకుండాలి? అది కూడా ఇతరుల భరోసాతో! 

anrd.. వారసులు కావాలనే ఆశ అందరికీ ఉంటుంది. పాండురాజు ఆలోచన వల్ల కుంతికి,మాద్రికి  సంతానం కలిగారు..ఈ రోజుల్లో కూడా సంతానం లేని దంపతులు కొందరు టెస్ట్ ట్యూబ్ ప్రక్రియ మరియు స్పెర్మ్ బ్యాంక్ సాయంతో సంతానాన్ని  పొందుతున్నారు కదా! 
 
పాండుపుత్రుల  విషయంలో దేవతలే సంతానాన్ని ప్రసాదించారు. ఎన్నో మహిమలు కలిగిన దేవతల ద్వారా సంతానాన్ని పొందటమంటే అది మానవుల విషయంలో వలె ఉండదని మనం గ్రహించాలి.
  
వాళ్ళ అభిప్రాయాలు.. పాండురాజు కూడా ఒకవేళ భీష్ముని లాగా సంతృప్తిపడి ఉంటే, సింహాసనం కోసం పోరాటం జరిగే అవకాశమే ఉండేది కాదు. ధృతరాష్ట్రుని పుత్రులు రాష్ట్రాన్ని పాలిస్తూ ఉండేవారు.  

anrd..దుర్యోధనుడు కూడా మొత్తం రాజ్యం తనకే కావాలని అత్యాశకు పోకుండా పాండవులకు  అర్ధరాజ్యం ఇచ్చినా కూడా సింహాసనం కోసం పోరాటం జరిగే అవకాశమే ఉండేది కాదు కదా ! 
ధృతరాష్ట్రుడు అంధుడవటం వల్ల రాజ్యాన్ని పాలించలేడు కాబట్టి, పాండురాజే రాజ్యం యొక్క  బాగోగులు చూస్తూ ఎంతో అభివృద్ధి  చేసాడు. అందుకోసం అయినా పాండవులకు  రాజ్యంలో వాటా ఇవ్వాలి. 

వాళ్ళ  అభిప్రాయాలు.. జూదంలో ఓడిపోయిన తర్వాత పాండవులు ఊరక పక్కన కూర్చోవలసింది. అప్పుడు కూడా సింహాసనం కావాలనుకోవడం, ఇదెక్కడి న్యాయం ..

anrd..పందెంలో అనుకున్నట్లు  అరణ్యవాసం, అజ్ఞాతవాసం ముగిసిన  తరువాతే  పాండవులు తమ రాజ్యాన్ని అడిగారు. ఇందులో అన్యాయం ఏముంది?

 
వాళ్ళ  అభిప్రాయాలు..కర్ణుడు, ద్రోణుడు, భీష్ముడు.. వీరందరి వధ ధర్మవిరుద్ధంగానే జరిగింది.

anrd..కర్ణుడు,జయద్రథుడు..అధర్మప్రవర్తనలో దుర్యోధనునికి సహకరించారు. ద్రోణుడు, భీష్ముడు వంటి  వీరుల వల్ల దుర్యోధనుని బలం పెరుగుతుంది.దుర్యోధనుని వంటి అసూయాపరుడు, అత్యాశ గలవాళ్ళ  బలం  పెరగటం  సమాజానికి  మంచిది కాదు.
 
 దుష్టుని  బలం పెరగటానికి కారణమవటం వల్ల భీష్ముని, ద్రోణుని సంహరించవలసి వచ్చింది. భీష్ముల వారికి పాండవులంటే ఎంతో ఇష్టం ఉన్నా కూడా, రాజ్యబాగోగులు చూసుకుంటూ దుర్యోధనుని వద్ద ఉండిపోవలసి వచ్చింది.

భీష్ముల వారు అంపశయ్యపై  ఉన్నప్పుడు  వారే  తెలియజేసిన విషయాన్ని బట్టి..అధర్మపరుడైన దుర్యోధనుని వద్ద ఉన్నందువల్ల  భీష్ముల వారికి కష్టాలు వచ్చాయి.


నీతి:చెడ్దవాళ్ళ ప్రక్కన ఉంటే , మంచి  వారికీ  కష్టాలు తప్పవని  పెద్దలు తెలియజేసారు . 


వాళ్ళ  అభిప్రాయాలు.. దుశ్శాసనుడు ఒకే ఒక చీరను అపహరిస్తే దానిపైన మహాభారత యుద్ధం చెలరేగింది. శ్రీకృష్ణుడు అంత వస్త్రాపహరణ చేస్తే అది విశుద్ధ భాగవతమై కూర్చుంది. 

anrd.. శ్రీకృష్ణుడు గోపికల వస్త్రాలను దాచింది చిన్నతనంలో. ద్రౌపదికి జరిగిన వస్త్రాపహరణకు, కృష్ణుడు గోపికల వస్త్రాలను చెట్టు మీద పెట్టడానికి చాలా తేడా ఉంది.

వాళ్ళ  అభిప్రాయాలు.. కృష్ణుని భార్యలను కూడా చివర్లో దొంగలు.. కొల్లగొట్టి తీసుకుపోయారు. (దేవీ భాగవతం . 2/7) (కృష్ణావతారానంతరం అర్జునుడు కృష్ణుని భార్యలను ద్వారక నుండి హస్తినాపురం తీసుకుపోతున్న సమయంలో దారిలో దొంగలు.. వారి ధనాన్నే కాక, కృష్ణుని భార్యలను కూడా అపహరించి తీసుకుపోయారు. అప్పుడు వాళ్ళ సంరక్షకుడు అర్జునుడు అసహాయుడై చూస్తూ ఉండిపోయాడు!)

anrd..కృష్ణావతారానంతరం కృష్ణుని అష్టభార్యలు కూడా అవతారాన్ని చాలించారని  అంటారు. ఈ అష్టభార్యలు లక్ష్మీదేవి యొక్క అష్టలక్ష్ముల అవతారాలు కావచ్చని నా అభిప్రాయం.

ఇక,దొంగలు అపహరించి తీసుకుపోయినట్లుగా చెప్పబడినవారు కృష్ణుని 16 వేలమంది భార్యలు. వీరి  గురించి అనేక కధనాలు,అంతరార్ధాలు ఉన్నాయి.ఒక కధనం ప్రకారం ఈ 16వేల మంది భార్యలు దేవలోకంలోని అప్సరసలు.ఒకప్పుడు నరనారాయణులు  తపస్సు  చేసుకుంటుండగా ఈ అప్సరసలు వారి వద్దకు వెళ్ళారు. 


ఏదైనా వరం కోరుకోమని నారాయణుడు  అనగా, తమను భార్యలుగా స్వీకరించమని నారాయణుడిని వరమడిగారు. ఆ జన్మలో కాకుండా  శ్రీకృష్ణావతారంలో వారి కోరిక తీరగలదని నారాయణుడు తెలియజేసాడు.  అలా అనుకోకుండా  వారిని భార్యలుగా స్వీకరించవలసి వచ్చింది నారాయణుడికి(శ్రీకృష్ణుడికి.) 


వరం కోరుకొమ్మని అప్సరసలతో అని కష్టాలలో ఇరుక్కున్నాను ..అలా  అనకుండా మౌనంగా ఉంటే బాగుండేదని నారాయణుడు అనుకుంటారు. 
  
అప్సరసలు కూడా తపస్సు చేసుకుంటున్న వ్యక్తిని కోరరాని వరాలను కోరి ఇబ్బందిపెట్టటం సరైనది కాదు కదా !

వాళ్ళ  అభిప్రాయాలు.. శ్రీకృష్ణుడు కురుక్షేత్రంలో అన్నదమ్ములకు, దగ్గరి బంధువులకు మధ్య విరోధం పుట్టించి, ఒకరినొకరు చంపుకొనేట్లు చేసి భూభారం తగ్గించాడని పురాణం చెప్తుంది బ్రహ్మవైవర్త పురాణం. కాని, ..  ఆయన యదువంశం కూడా అదే విధంగా నశించిపోయింది. 

anrd..భూభారాన్ని తగ్గించటం కోసం ఒక ప్రణాళికప్రకారం శ్రీకృష్ణ జననం  జరిగింది.  ఆదిపరాశక్తిఅయినపరమాత్మ ఈ ప్రణాళికను రచించారు. 
 
శ్రీకృష్ణునికి ధర్మాన్ని నిలబెట్టటం ముఖ్యం. ఆ విషయంలో తన,పర భేధాలను లెక్క  జేయరు.యదువంశం కూడా చాలావరకూ క్షీణించినా కృష్ణుడు పట్టించుకోలేదు.
యాదవులు  సురాపానమత్తులో మహర్షిని అవమానించి శాపానికి గురయ్యారు. 

వాళ్ళ  అభిప్రాయాలు.. (ఓ సుందరీ! ఉద్దాలకుని పుత్రుడు శ్వతకేతు ద్వారా ఇది ధర్మసమ్మతంగా చెప్పబడింది...) ఆ రోజుల్లో నియోగం ఆచారంగా ఉండేది.

anrd..పరస్త్రీని తల్లిగా భావించాలని పెద్దలు తెలియజేసిన సంస్కృతిలో..    పుత్రప్రాప్తి కోసం పర స్త్రీ పురుషుడు సంగమించడం శాస్త్రసమ్మతం కాదు.

తెలిసికానీ, తెలియకకానీ..కొన్ని కారణాల వల్ల కొందరు వ్యక్తులు సనాతనధర్మాలను సరిగ్గా అర్ధం చేసుకోకుండా సమాజంలో కొన్ని చెడ్డ ఆచారాలను ప్రవేశపెట్టారు.( అయితే,ఆ ఆచారాలను  తరువాతి తరం వాళ్ళు తొలగించారు.) 


సనాతనధర్మాన్ని  సరిగ్గా అర్ధం చేసుకోని వ్యక్తులలో గొప్పవాళ్ళు కూడా ఉండవచ్చు. గొప్పవాళ్ళైనంత మాత్రాన వాళ్ళు చేసిన అధర్మపు పనులు ధర్మబద్ధమైపోవని పర్యవసానాల ద్వారా మనం తెలుసుకోవచ్చు.


వాళ్ళ  అభిప్రాయాలు..(అహల్య, ద్రౌపదీ తార, కుంతి, మండోదరి ఈ పంచకన్యలను నిత్యం స్మరించినవారి పాపాలన్నీ నశించిపోతాయి.) - ..  పంచ కన్యలని ఎందుకంటున్నావు? వీళ్ళను ప్రాతఃస్మరణీయులని ఎందుకు చెప్తున్నావు? 

anrd...ఈ సంఘటనల  వెనుక అనేక  కారణాలున్నాయి, వాటికి అనేక అంతరార్ధాలూ  ఉన్నాయి. ఆ కాలంలో పతివ్రతలను కన్య అనే సంభోదనతో గౌరవించే వారని నా అభిప్రాయం.

( ఈ సంఘటనలగురించి మరిన్ని వివరాలు తెలుసుకోవాలంటే శ్రీ పాద శ్రీవల్లభ సంపూర్ణ  చరితామృతము..గ్రంధమును చదవవచ్చు.ఈ గ్రంధానికి కాపీరైట్స్ ఉన్నాయి.) 

ఇందులో అహల్య తప్పేమీ లేదు.అహల్య భర్త అయిన గౌతముని వేషం ధరించి వచ్చాడు ఇంద్రుడు.తరువాత ఏం జరిగిందో చాలామందికి తెలియని విషయాలను గురించి తెలుసుకోవాలంటే.. శ్రీపాదశ్రీవల్లభసంపూర్ణ  చరితామృతము..గ్రంధమును చదవగలరు .


కుంతిని సంతానం పొందమని కోరినది ఆమె భర్త అయిన పాండురాజే.(ఈ రోజుల్లో  కూడా సంతానం లేని కొందరు దంపతులు టెస్ట్ట్యూబ్ మరియు స్పెర్మ్ బ్యాంక్   సాయంతో  సంతానాన్ని పొందుతున్నారు కదా! )..ద్రౌపది అయిదుగురిని వివాహం చేసుకోవటానికి వెనుక అనేక కారణాలున్నాయి.  
కుంతీదేవి  మాట కూడా ఒక కారణం.   
అనుకోకుండా అన్న మాట పాటించకపోతే తప్పేమో.. అని ఎవ్వరూ భయపడనవసరం లేదు... కొన్ని సందర్భాలలో అసత్యతా దోషం ఉండదని పెద్దలు తెలియజేసారు.
 
వాళ్ళ  అభిప్రాయాలు.. శకుంతల, దమయంతి సంగతి ...

anrd..శకుంతల, దమయంతి కధల నుంచి ఎన్నో విషయాలను  తెలుసుకోవచ్చు. పెద్దవాళ్ళకు  తెలియకుండా గాంధర్వ వివాహం లాంటివి  చేసుకుంటే ఆనక ఆ పురుషుడు మోసం చేస్తే  ఎలాంటి  పరిస్థితి వచ్చే అవకాశముందో శకుంతల కధ ద్వారా టీనేజీ అమ్మాయిలు తెలుసుకోవచ్చు.

 భార్యభర్త
కు  ఏర్పడిన  సంక్లిష్ట పరిస్థితిలో కూడా సమస్యను ఎదుర్కోవటాన్ని  దమయంతి కధ ద్వారా తెలుసుకోవచ్చు. నలదమయంతి కధలో నలుడు లఘుశంకకు వెళ్ళి వచ్చిన తరువాత కాళ్ళుచేతులు శుభ్రం చేసుకోకపోవటం వల్ల  అశుచిత్వం కలిగి, కలికి  తన ప్రభావం చూపించటానికి  అవకాశం లభించిందని అంటారు. ఆ విధంగా.. జీవితంలో శుచి, శుభ్రతను చక్కగా పాటించాలని కూడా తెలియజేసారు.

 శకుంతల, కుంతి యొక్క కధల  ద్వారా టీనేజ్  పిల్లలు ఎన్నో విషయాలను తెలుసుకోవాలి.
 
 
మనకు అందుబాటలో ఎంత విజ్ఞానం ఉన్నాకూడా, దానిని వాడటంలో జాగ్రత్తగా ఉండాలి.  కుంతీదేవి తనకు మహర్షి ఇచ్చిన మంత్రాన్ని పరీక్షించకుండా జాగ్రత్తగా ఉంటే కర్ణుని పుట్టుక జరిగేది కాదు.

 ఈ రోజుల్లో కూడా టీనేజ్ పిల్లలు ఇంటెర్నెట్, ఫోన్ల ద్వారా వచ్చే ప్రమాదాల నుంచి జాగ్రత్తగా ఉండాలి. అందులో ఎన్నో చూడాలనిపించేవి ఉంటాయి. వాటిపట్ల  జాగ్రత్తగా 
ఉండాలి.
 
 వివాహానికి  ముందే  సంతానాన్ని పొందితే  ఎన్నికష్టాలు వస్తాయో వీరి  కధల  ద్వారా  పెద్దలు తెలియజేసారు. ఇలాంటి జాగ్రత్తలను పిల్లలకు చెప్పాలంటే తల్లితండ్రులకు మొహమాటం అడ్డువస్తుంది.
 
 పురాణేతిహాసాల ద్వారా  మానవబలాలనూ, బలహీనతలను  మరియు లోకంలోని రకరకాల సంఘటనలను తెలుసుకుని జాగ్రత్తపడవచ్చు. 

వాళ్ళ  అభిప్రాయాలు..శర్మిష్ఠ, దేవయాని పరాచికాలాడడంలో ఆధునిక యుగాన్ని కూడా హీనపరిచి వెళ్ళారు. 

anrd.. యయాతి..దేవయాని, శర్మిష్ఠల యొక్క ప్రవర్తన  ప్రభావం వారి సంతానంపై కూడా పడింది. 
 
నీతి..పెద్దవాళ్ళ ప్రవర్తన వల్ల పిల్లల జీవితాలు కూడా ప్రభావితం అవుతాయి

వాళ్ళ  అభిప్రాయాలు.. వ్యాసుని వల్ల పాండురాజు, ధృతరాష్ట్రుడు జన్మించారు. నియోగ సమయంలో అంబిక కళ్ళు మూసుకుందట. కాబట్టి ఆమెకు జన్మాంధుడైన పుత్రుడు కలిగాడు.

anrd..వ్యాసుని ద్వారా అంబికా,అంబాలికలకు  జన్మించిన సంతానాన్ని గమనిస్తే ఎన్నో విషయాలను తెలుసుకోవచ్చు. సంతానాన్ని పొందే విషయంలో జీవులు చేసిన పాపపుణ్యాల ప్రాధాన్యత ఉంటుంది. దానితో పాటూ స్త్రీ పురుషుల మనో భావాలకు గల ప్రాధాన్యతను కూడా గమనించవచ్చు. 

ఇలాంటి విషయాలను మనకు తెలియజేయటానికి వ్యాసునిద్వారా  ధృతరాష్ట్రుడు, పాండురాజు, విదురుడు జన్మించిన  సంఘటనను ప్రాచీనులు మనకు తెలియజేసారేమో.

ఇష్టంలేక కళ్ళు మూసుకున్న అంబికకు  గ్రుడ్డివాడైన  ధృతరాష్ట్రుడు  జన్మించాడు. భయంతో పాలిపోయిన అంబాలికకు పాండురాజు జన్మించాడు.  వ్యతిరేకత లేక  ఉన్న దాసివల్ల మంచివాడైన విదురుడు జన్మించాడు. 
 
అంబిక,అంబాలికలకు సంతానం  కలిగించే  విషయంలో వ్యాసునికి కూడా వ్యతిరేకత ఉండి ఉంటుంది . ఆధునికవిజ్ఞానం కూడా  స్త్రీపురుషుల మానసికభావాల యొక్క ప్రాముఖ్యతను ఇప్పుడిప్పుడే గుర్తిస్తోంది. 

గర్భాన్నిధరించాలనుకునే స్త్రీ మరియు గర్భవతి అయిన స్త్రీ మంచి ఆలోచనలను చేయటం, మనసు ప్రశాంతంగా ఉంచుకోవటం వల్ల చక్కటి పిల్లలు పుడతారంటారు.చెడ్డ విషయాలను వినకూడదని,భయపడకూడదనీ అంటారు.


ఇంకొకవిషయమేమిటంటే, వ్యాసుడు స్త్రీసంయోగం లేకుండానే సంతానాన్ని  పొందగలిగిన  మహిమగలవాడు .

 ఉదా..వ్యాసపుత్రుడైన శుకుడు అయోనిజుడిగా జన్మించాడు..( స్త్రీపురుష  సంబంధం లేకుండానే సంతానాన్ని పొందవచ్చని ఆధునిక పరిశోధనల ద్వారా కూడా తెలుస్తోంది.)


 
వాళ్ళ  అభిప్రాయాలు..అంత పెద్ద జ్ఞాని అయి కూడా వ్యాసుడు వ్యభిచారకర్మకు ఎందుకు సిద్ధపడ్డాడు? వ్యభిచార పర్యవసానం మంచిగా ఉండదు. వ్యాసునికి కూడా తర్వాత పశ్చాత్తాపం కలిగింది - (దేవీ భాగవతం) (వ్యభిచారం వల్ల కలిగిన నా ఈ పుత్రులు కళ్యాణకారులు కాగలరా?)

anrd... (దేవీ భాగవతం) (వ్యభిచారం వల్ల కలిగిన నా ఈ పుత్రులు కళ్యాణకారులు కాగలరా?)..అని వ్యాసుల వారే అనుకున్నారు కదా! ఇంకా ఇందులో మనం తప్పుపట్టవలసింది ఏముంది?

తల్లిసత్యవతి ఆజ్ఞ కాదనలేక తనకు ఇష్టం లేకపోయినా వ్యాసుడు..అంబిక, అంబాలికలకు  సంతానాన్ని ప్రసాదించారు. పర్యవసానాన్ని గమనించితే.. వ్యాసుని వల్ల జన్మించిన ధృతరాష్ట్రుని వారసులైన దుర్యోధనాదులు భారతయుద్ధంలో  మరణించారు. 

............ 
anrd.. మహాభారతంలో లేనిది ప్రపంచంలోనే లేదు. పురాణేతిహాసాల ద్వారా ఎంతో  విజ్ఞానాన్ని ప్రాచీనులు మనకు  అందించారు. దేవతలు కూడా పాత్రధారులై నడిపించిన  జీవిత కధల  ద్వారా(పురాణేతిహాసాల ద్వారా) మనం ఎన్నో విషయాలను తెలుసుకోవచ్చు.
 
 ఆసక్తి  ఉన్నవారు.. అయోజనిత్వం గురించి వివరాలున్న ఈ క్రింది  లింకును కూడా  చూడగలరు .