koodali

Friday, November 30, 2012

స్త్రీలు ఆభరణాలను ధరించటం గురించి...


ఈ  బ్లాగ్  ను  ప్రోత్సహిస్తున్న  సభ్యులకు  మరియు  అందరికి  అనేక  కృతజ్ఞతలండి.

 ................................

స్త్రీలు ఆభరణాలను   ధరించటం  గురించి...  నేను  పాత    టపాలలో  వ్రాసిన కొన్ని   విషయాలను  ఇక్కడ   ఇస్తున్నానండి.  

జున్,   2011

స్త్రీలు ఆభరణాలు వేసుకోవాలి అనటం ద్వారా ................ స్త్రీలకు ఆభరణాల రూపంలో ఆర్ధికలాభాన్ని ఏర్పాటు చేశారేమో పెద్దలు అనిపిస్తుంది.

పూర్వం ఆడవాళ్ళు ఇప్పటిలా ఉద్యోగాలు చేసి సంపాదించటం తక్కువగా ఉండేది.

భర్త ఎంత ధనికుడయినా ఆడవారికి తమకంటూ సొంతానికి కొంత ధనం ఉంటే వాళ్ళకు స్వతంత్రంగా ఉంటుంది.

ఒక ఇంట్లో ఆడపిల్లలు, మగపిల్లలు ఉంటే .......... పండుగలకు కొత్త బట్టలు, ఆడుకొనే బొమ్మలు, తినే వస్తువులు ఇవన్నీ .......... తల్లిదండ్రులు పిల్లలు అందరికి ఇస్తుంటారు.

అలాగే,   తల్లిదండ్రులు   తమ ఆడపిల్లలకు    వారి వివాహం సందర్భంగా ........... ముచ్చటపడి ఆ పిల్లలకు కానుకలు ఇచ్చి అత్తవారింటికి పంపేవారు.

డబ్బు ఎక్కువగా ఉన్నవాళ్ళు ఎక్కువగా ,........ తక్కువగా ఉన్నవాళ్ళు తమకున్నంతలో కానుకలు ఇచ్చుకొనేవారు.

ఆ కానుకలు   ఆ ఆడ పిల్లలకు ఒకోసారి ఆపదలో అండగా కూడా ఉపయోగపడేవి.

అలా ఆడవాళ్ళు  పుట్టింటినుంచి తెచ్చుకున్న ధనాన్ని,  భర్త మొదలైన వారు కూడా వాడుకోవటానికి పెద్దగా ఇష్టపడేవారు కాదు.


(  ఆ  రోజుల్లోని  వాళ్ళు.  )

స్రీ ధనంగా భావించి దానిని ఆమెకే ఉంచేసేవారు. ఆ కానుకలు ఆమె తమ పిల్లలకు ఇచ్చుకోవటం జరిగేది.

అలా ముచ్చటగా మొదలైన వ్యవహారం ............. ఇప్పుడు వికృతరూపం దాల్చి ఆ కానుకల కోసం ఎంతకైనా తెగించేస్థాయికి పరిస్థితులు వచ్చాయి.

తప్పు ఎక్కడ వచ్చింది అంటే,  మనుషుల మనస్తత్వాలు మారటం వల్ల వచ్చింది.

డబ్బు కోసం ఎంతకైనా తెగించే మనస్తత్వాలు పెరిగిపోవటం,  తేరగా ఎదుటి వాళ్ళ సొమ్ముకు ఆశ పడటం, డబ్బు కోసం హుందాతనం లేకుండా లేకిగా ప్రవర్తించటం, మానవసంబంధాలు ఆర్ధిక సంబంధాలుగా మారిపోవటం వల్ల........... ఈ అనర్ధాలన్నీ జరుగుతున్నాయి.

చాలామంది మగవారినే ఆడిపోసుకుంటారు గానీ ........... ఈ డబ్బు గొడవల్లో భర్త ఒక్కడే కాదు. చాలా సార్లు అత్తా, ఆడపడుచుల ప్రమేయం కూడా ఉంటుంది. ....

ఒక భర్త తన భార్యను కొడుతున్నప్పుడు తోటి ఆడవాళ్ళుగా అత్తగారు , ఆడపడుచులు, అలా చేయటం తప్పు అని చెపితే ............... భార్యను కొట్టే భర్త ప్రవర్తన మారే అవకాశం ఎంతయినా ఉంది.

అలా చేయకపోగా కొందరు అత్తగార్లు, ఆడపడుచులు విషయాన్ని మరింత పెద్దది చేస్తారు.
...............


 స్త్రీలు ఆభరణాలు వేసుకోమని చెప్పటం వల్ల చాలా లాభాలున్నాయి. వాటిని ధరించటం వల్ల అందం, అలంకారం అని అందరికీ తెలుసు. 


ఇంకా ,
బంగారు ఆభరణాలు ధరించటం ,మట్టిగాజులు ధరించటం వల్ల ఆరోగ్యం కలుగుతుందట. 


స్త్రీలకు వివాహ సమయంలో పుట్టింటివారు, అత్తింటివారు ఆభరణాలు చేయిస్తారు.

ఈ ఆభరణాలు స్త్రీల దగ్గరే ఉంటాయి.  కాబట్టి,   అవి స్త్రీలకు ఆస్తిలాగా ఆపద సమయంలో ఆదుకుంటాయి.

ఉదా........ఆభరణాలను తాకట్టు పెట్టి డబ్బు తీసుకోవచ్చు.

భర్తకు ఎప్పుడయినా అవసరమయితే భార్య తన ఆభరణాలు ఇవ్వటం ద్వారా కుటుంబాన్ని ఆదుకోవచ్చు.

ఆ ఆభరణాలను తన పిల్లలకో , మనుమలకు, మనుమరాళ్ళకు ఇచ్చుకోవచ్చు.

ఇంకా,   పూర్వం మహారాణులు వంటి వారు కష్టాలలో ఉన్నప్పుడు ( ఉదా...శత్రువులు ముట్టడించినప్పుడు ) వారి ఆభరణాలు వారికి ఉపయోగపడేవట.


సీతమ్మ వారి జాడ కనుగొనే సందర్భంలో ఆమె జారవిడిచిన ఆభరణాల పాత్ర అందరికి తెలిసిందే.

స్త్రీలు ఆభరణాలు వేసుకోవాలి అనటం ద్వారా ................ స్త్రీలకు ఆభరణాల రూపంలో ఆర్ధికలాభాన్ని ఏర్పాటు చేశారేమో పెద్దలు అనిపిస్తుంది.

ఎందుకంటే, ఇంట్లో వాళ్ళు.... ఆడవాళ్ళ ఆభరణాలను అంత త్వరగా తీసుకోరు కదా !.మరీ కష్టాల్లో ఉంటే తప్ప. (ఇప్పుడు  పరిస్థితి   మారిపోయింది  లెండి.)

అయితే మితిమీరిన భోగాల వెనుక రోగాలు ఉన్నట్లు, మితిమీరి పసిడిని ప్రోగుచేస్తే దాని వెనుక దొంగల భయం వంటి ప్రమాదాలు ఉంటాయి.

ఇవన్నీ చూస్తే పెద్దలు ప్రవేశపెట్టిన ఆచారాల వెనుక... ఎన్నో విషయాలు ఉంటాయని అనిపిస్తుంది.



Wednesday, November 28, 2012

ఓం...


ఓం.
దైవానికి  అనేక  నమస్కారములు.
అగ్ని  లింగ  క్షేత్రమైన   తిరువణ్ణామలైలో  వెలిగించే  కార్తిక  దీపదర్శనం  ఎంతో  పుణ్యప్రదం.   తిరువణ్ణామలై  విశేషాలను  ఈ  లింక్ ల లో  చూడవచ్చు.

::: Om Arunachala ::: - Tiruvannamalai, Deepam, Girivalam ...


Thiruvannamalai Deepam - 2012 - YouTube



కార్తిక  పౌర్ణమి  రోజున కొందరు,   శ్రీ  సత్యనారాయణ స్వామి  వారి  వ్రతం  చేసుకుంటారు. త్రిమూర్తి  స్వరూపులైన   శ్రీ  సత్యనారాయణ స్వామి  వారికి  అనేక  నమస్కారములు.



Monday, November 26, 2012

ఓం,శ్రీ విశ్వనాధాష్టకము.శ్రీ అన్నపూర్ణాష్టకము......

ఓం
శ్రీ విశ్వనాధాష్టకము

గంగాతరంగ రమణీయ జటాకలాపం
గౌరీ నిరంతర  విభూషిత  వామభాగం
నారాయణ ప్రియ  మనంగ  మదాప  హారం
వారాణసీ  పురపతిం  భజ  విశ్వనాధం .

వాచామ  గోచర మమేయ  గుణస్వరూపం
వాగీశ  విష్ణు సురసేవిత పాదపీఠం
వామేన  విగ్రహవరేణ  కళత్రవంతం
వారాణసీ  పురపతిం  భజ  విశ్వనాధం .

భూతాధిపం  భుజగభూషణ  భూషితాంగం
వ్యాఘ్రాజినాంబరధరం  జటిలం  త్రినేత్రం
పాశాంకు  శాభయవరప్రద  శూలపాణిం
వారాణసీ  పురపతిం  భజ  విశ్వనాధం .

శీతాంశుశోభిత  కిరీట  విరాజమానం
ఫాలేక్షణాచల  విశోషిత  పంచబాణం
నాగాధిపా  రచిత  భాసుర  కర్ణపూరం
వారాణసీ  పురపతిం  భజ  విశ్వనాధం .

పంచాననం  దురిత  మత్తమదంగజానాం
నాగాంతకం  దనుజపుంగవ  పన్నగానాం
దావానలాం  మరణశోక  జరాటవీనాం
వారాణసీ  పురపతిం  భజ  విశ్వనాధం .

తేజోమయం  సగుణ  నిర్గుణ  మద్వితీయం
ఆనందకంద  మపరాజిత  మప్రమేయం
నాదాత్మకం  సకల  నిష్కళ  మాత్మరూపం
వారాణసీ  పురపతిం  భజ  విశ్వనాధం .

ఆశాం  విహాయ పరిహృత్య  పరస్య  నిందాం
పాపేరతించ  సునివార్య  మనస్సమాధౌ
ఆదాయ  హృత్కమల  మధ్యగతం  పరేశం
వారాణసీ  పురపతిం  భజ  విశ్వనాధం .

రాగాదిదోష  రహితం  స్వజనానురాగం
వైరాగ్య  శాంతినిలయం  గిరిజా సహాయం
మాధుర్య ధైర్య  సుభగం  గరళాభిరామం
వారాణసీ  పురపతిం  భజ  విశ్వనాధం .

వారాణసీ  పురపతేః స్తవం  శివస్య
వ్యాసోక్త మష్టక మిదం  పఠతే  మనుష్యః
విద్యాం శ్రియం  విపులసౌఖ్య  మనంతకీర్తిం
సంప్రాప్య  దేహవిలయే  లభతేచ  మోక్షం .

 విశ్వనాధాష్టక  మిదం  పుణ్యం  యః  పఠే చ్చివసన్నిధౌ
శివలోక  మవాప్నోతి  శివేన  సహమోదతే.

ఫలం..ధనధాన్యాలూ,  విద్యా  విజయాలూ,  ఇహపర  సర్వ సౌఖ్యాలు.

శ్రీ  అన్నపూర్ణాష్టకము

 
నిత్యానందకరీ  వరాభయకరీ  సౌందర్య  రత్నాకరీ
నిర్ధూతాఖిలఘోర  పావనకరీ  ప్రత్యక్షమాహేశ్వరీ
ప్రాలేయాచల  వంశపావనకరీ  కాశీపురాధీశ్వరీ
భిక్షాందేహి  కృపావలంబనకరీ  మాతాన్నపూర్ణేశ్వరీ .

నానారత్న   విచిత్ర  భూషణకరీ    హేమాంబరాడంబరీ
ముక్తాహార  విడంబమాన  విలసద్వక్షోజకుంభాంతరీ
కాశ్మీరాగరు  వాసితాంగ  రుచిరే  కాశీపురాధీశ్వరీ
భిక్షాందేహి  కృపావలంబనకరీ  మాతాన్న  పూర్ణేశ్వరీ .

యోగానందకరీ  రిపుక్షయకరీ  ధర్మైకనిష్ఠాకరీ
చంద్రార్కానలభాసమానలహరీ  త్రైలోక్యరక్షాకరీ
సర్వైశ్వర్యకరీ  తపఃఫలకరీ  కాశీపురాధీశ్వరీ
భిక్షాందేహి  కృపావలంబనకరీ  మాతాన్న  పూర్ణేశ్వరీ .

కైలాసాచల కందరాలయకరీ  గౌరీ  ఉమా  శాంకరీ
కౌమారీ  నిగమార్ధగోచరకరీ  ఓంకార  బీజాక్షరీ
మోక్షద్వార  కవాట  పాటనకరీ  కాశీపురాధీశ్వరీ
భిక్షాందేహి  కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ .

దృశ్యాదృశ్య  విభూతి  పావనకరీ  బ్రహ్మాండ భాండోదరీ
లీలానాటక  సూత్రఖేలనకరీ  విజ్ఞాన  దీపాంకురీ
శ్రీ విశ్వేశమనః  ప్రమోదనకరీ  కాశీ  పురాధీశ్వరీ
భిక్షాందేహి  కృపావలంబనకరీ  మాతాన్న  పూర్ణేశ్వరీ .

ఆదిక్షాంత  సమస్త  వర్ణనకరీ  శంభుప్రియే  శాంకరీ
కాశ్మీరే  త్రిపురేశ్వరీ  త్రినయనీ  విశ్వేశ్వరీ  శ్రీధరీ
స్వర్గద్వార  కవాటపాటనకరీ  కాశీ  పురాధీశ్వరీ
భిక్షాందేహి  కృపావలంబనకరీ 
మాతాన్నపూర్ణేశ్వరీ .


ఉర్వీసర్వజయేశ్వరీ  దయాకరీ  మాతాకృపాసాగరీ
నారీ  నీలసమానకుంతలధరీ  నిత్యాన్న  దానేశ్వరీ
సాక్షాన్మోక్షకరీ  సదాశుభకరీ  కాశీపురాధీశ్వరీ
భిక్షాందేహి   కృపావలంబనకరీ  మాతాన్నపూర్ణేశ్వరీ .

దేవీసర్వవిచిత్రరత్న  రచితా  దాక్షాయణీ  సుందరీ
వామాస్వాదుపయోధర  ప్రియకరీ  సౌభాగ్య  మాహేశ్వరీ
భక్తాభీష్టకరీ  దశాశుభకరీ  కాశీపురాధీశ్వరీ
భిక్షాందేహి  కృపావలంబనకరీ  మాతాన్న  పూర్ణేశ్వరీ .

చంద్రార్కానల  కోటికోటి  సదృశా  చంద్రాంశు  బింభాధరీ
చంద్రారాగ్ని  సమాన  కుండలధరీ  చంద్రార్క  వర్ణేశ్వరీ
మాలాపుస్తక  పాశాంకుశధరీ  కాశీపురాధీశ్వరీ
భిక్షాందేహి కృపావలంబన  మాతాన్నపూర్ణేశ్వరీ .

క్షత్రత్రాణకరీ  సదాశివకరీ  మాతాకృపాసాగరీ
సాక్షాన్మోక్షకరీ  సదాశివకరీ  విశ్వేశ్వరీ  శ్రీధరీ
దక్షాక్రందకరీ  నిరామయకరీ  కాశీపురాధీశ్వరీ
భిక్షాందేహి  కృపావలంబనకరీ  మాతాన్నపూర్ణేశ్వరీ .

అన్నపూర్ణే  సదాపూర్ణే  శంకర  ప్రాణవల్లభే
జ్ఞానవైరాగ్య  సిద్ధ్యర్ధం  భిక్షాం  దేహీ చ  పార్వతి
మాతా చ పార్వతీ  దేవీ  పితా  దేవో  మహేశ్వరః
భాందవా  శ్శివభక్తాశ్చ  స్వదేశో  భువనత్రయమ్ .

ఫలం..ఇహానికి  ఆకలిదప్పులూ..పరానికి  ఏ కలి  తప్పులూ  కలగకపోడం.

............
వ్రాసిన  విషయాలలో  అచ్చుతప్పుల  వంటి  పొరపాట్లు  వచ్చినచో  దయచేసి  క్షమించమని  దైవాన్ని  ప్రార్ధిస్తున్నాను.  
 ..........................


ఈ  బ్లాగ్  ను  ప్రోత్సహిస్తున్న  అందరికి  అనేక  కృతజ్ఞతలండి .


Friday, November 23, 2012

అజామిళుని కధ. వంటి కధలను చెప్పటంలో.......


* పురాణేతిహాసాలలోని   చరిత్రలను  తెలుసుకుంటుంటే,   దైవము మరియు   పెద్దలు  మన  కోసము   ఎంతగా   ఆలోచిస్తారో కదా  !  అనిపిస్తుంది. ప్రపంచములోని   ప్రతి ఒక్కరూ  మంచి   ప్రవర్తనను  కలిగి   దైవానికి   దగ్గరవ్వాలని (  మోక్షాన్ని  పొందాలని  ) వారి   అభిప్రాయం.

* ప్రపంచములో రకరకముల మనస్తత్వముల వాళ్ళు ఉంటారు  , ఎన్నో రకాల పరిస్థితులు ఉంటాయి. ఒక్కొక్క వ్యక్తితో   ఒక్కో విధముగా    ప్రవర్తించవలసి ఉంటుంది.   అందుకే  ప్రాచీనులు  రకరకాల  కధలను  తెలియజేసారు.

* ప్రాచీన  గ్రంధాలలోని  కొన్ని   కధలలో  దైవ  నామాన్ని  స్మరించటం  వల్ల,   ఎన్నో   పాపాలు  చేసిన  వాళ్ళు  కూడా  నరకానికి  పోకుండా  స్వర్గానికి  వెళ్తారు.  అని  ఉంటుంది.  ఉదా..
అజామిళుని  కధ.  

* అజామిళుడు   ఎన్నో  పాపాలు  చేసాడు.  అయితే,   మరణించే  ముందు ,  నారాయణా.....అని    కొడుకు  పేరును  పిలవటం  వల్ల  నరకానికి  బదులు  స్వర్గానికి  వెళ్ళాడని  కధలో  ఉన్నది. 
 
* మరి  కొందరు వ్యక్తులు   ఎన్నో  పాపాలు  చేసినా , మరణానికి  ముందు   అనుకోకుండా  శివాలయంలో  దీపపు  వత్తిని  వెలిగించటం  వల్ల    నరకానికి  బదులు  స్వర్గానికి  వెళ్ళారని  కధలో  ఉన్నది.

* (   ఇలాంటి  వాళ్ళు   చివరిలో  అనుకోకుండా  దైవనామస్మరణ  చెయ్యటానికి   కొన్ని  కారణాలు  ఉండవచ్చు.  ఉదా...బహుశా  వీళ్ళు   పూర్వజన్మలో   చేసిన  పుణ్యం  వల్లకానీ,  వీరి  తల్లితండ్రులు  చేసిన  పుణ్యం  వల్ల  కానీ  వీరికి  అనుకోకుండా  దైవస్మరణ  చేసే  అవకాశం  లభిస్తుందేమో అనిపిస్తుంది.  )


అజామీళుడు  వివాహం  చేసుకున్న  ఆమెకు  అంతకు  ముందే  ఒక  కూతురు  ఉన్నదట.  (  ఆమెకు   మొదటి  భర్త  వల్ల   పుట్టిన  అమ్మాయి.  )   భార్య  మరణించిన  తరువాత  అజామీళుడు  భార్య  యొక్క  కూతుర్ని  వివాహం  చేసుకుంటాడు. . ఈ  అమ్మాయి  అతడి  సొంతకూతురు  కాదు. సొంతకూతురు  కాకపోయినా,  అతడు  చేసినది  పెద్ద  తప్పే. 

* ప్రాచీనులు , 
అజామిళుని  కధ   వంటి   కధలను   చెప్పటంలో  ఎన్నో  అర్ధాలున్నాయి.

* ఎన్ని  పాపాలు  చేసిన  వారికైనా   మంచిగా   పరివర్తన   చెందటానికి  కొంత  అవకాశం  కలిగించాలని  పెద్దల  అభిప్రాయం  కావచ్చు.  ఇలాంటి  ఆశ  లేకపోతే    పాపాత్ములు  నిరాశానిస్పృహలతో    మరింతగా  పాపాలు  చేసే  అవకాశం  కూడా  ఉంది.


* కొందరు  అనేక  చెడ్డపనులు  చేస్తూ  ఉంటారు.  అయినా  వారికి  మనస్సులో  ఒక  మూలన  కొంచెం  పాపభీతి  ఉండే  అవకాశం  ఉంది. వాళ్ళు  ఎన్నో పాపాలు చేసిన   తరువాత   తమ  తప్పు   తెలుసుకుని,   అయ్యో !  మనకు దైవ పూజ చేసి  ఉత్తమగతులు  పొందే   అర్హత ఉందో  ? లేదో  ?  అనుకుంటారు.



* ఇలాంటి  వాళ్ళకు    కూడా  దైవపరమైన  ఆశను  కలిగించి,   మంచిమార్గంలోకి  వచ్చే  విధంగా  చేస్తాయి  ఇలాంటి  కధలు. 


* అజామిళుడి  వంటి  పాపాత్ముడే  నారాయణ  నామస్మరణం  చేత  నరకానికి  బదులు  స్వర్గానికి  వెళ్ళాడనే  కధను  చదివిన  కొందరు  చెడ్డవాళ్ళకు  ............ తాము  కూడా  నారాయణ  నామ  స్మరణం  చేస్తే,   మరణించిన  తరువాత నరకానికి  బదులు స్వర్గానికి  వెళ్ళవచ్చు  కదా  !  అనే  ఆలోచన  మొదలవుతుంది.  



* ( ఎన్ని  తప్పులు  చేసిన  వాళ్లకయినా   నరకానికి  వెళ్ళటం  అంటే  ఇష్టం  ఉండదు  కదా ! )


* ఇలాంటి  వాళ్ళు  కూడా     దైవ  నామ  స్మరణాన్ని  ,  పూజలు  చేయటాన్ని  మొదలుపెట్టి ,   అలా   పూజలు  చేస్తూచేస్తూ....  ఉండటం   వల్ల  క్రమంగా  ఆ  పాపాత్ములలో  మార్పు  వచ్చి  మంచిగా  పరివర్తన  చెందుతారు.



* మందులు  మనకు  ఇష్టం  ఉండి  వేసుకున్నా,  ఇష్టం  లేక  మ్రింగినా   అనారోగ్యాన్ని  పోగొడతాయి  కదా  !  అలాగే  ఏ  కారణంతో  దైవనామస్మరణాన్ని  మొదలుపెట్టినా   ఫలితం  లభిస్తుంది.  

అయితే  దైవనామ  స్మరణం  చేసే  వ్యక్తి  యొక్క  భక్తిశ్రద్ధలు ,  నీతినిజాయితీలను  బట్టి  ఫలితాల్లో  ముందువెనుక  తేడాలుంటాయి.  కొందరికి  శీఘ్రంగా  మంచి  ఫలితాలు  కనిపిస్తాయి.  కొందరికి  ఒక  జన్మలో  మంచి  మార్పు  కనిపిస్తే,   మరి  కొందరిలో  కొన్ని  జన్మలు  పట్టవచ్చు.  


*  డాక్టరు  తన  వద్దకు  వచ్చిన  పది  మంది  రోగులకు  ఒకే రకం   మందులను  ఇచ్చినా ,  ఆ  రోగులు  సక్రమంగా  మందులను వేసుకోవటం,  సక్రమంగా  పధ్యాన్ని  పాటించే  విధానాలను   బట్టి  వారి  వ్యాధులు   తగ్గే  సమయంలో  ముందువెనుక  తేడాలుంటాయి.   కొందరికి   రోగం  త్వరగా  తగ్గుతుంది.  కొందరికి   ఆలస్యంగా  తగ్గుతుంది.  మందులు   సరిగ్గా  వేసుకోకుండా,  పధ్యం  సరిగ్గా  పాటించని  వారికి  రోగం  త్వరగా  తగ్గకపోవచ్చు  కూడా.



* ఈ   కధలను  విని  , జీవితమంతా  పాపాలు  చేస్తూ   కొద్దిగా   దైవనామాన్ని  స్మరించితే  చాలు....  ఇక  పాపాలన్నీ  పోయి,  స్వర్గానికి  వెళతాం  కాబోలు .... అని    అపార్ధం  చేసుకోకూడదు .


*  తప్పులు  చేసినవాళ్ళు  తాము  చేసిన  తప్పులకు  పశ్చాత్తాపపడి,   ఇకనుంచి    చెడ్డపనులను  చేయటం  మాని,  పుణ్యకార్యాలు  చేయటం  మొదలుపెడితే ,  అప్పుడు  వారికి  పడే  శిక్ష  గణనీయంగా  తగ్గే  అవకాశం  ఉంది. 


* అంతే  కానీ,  ఎన్ని  పాపాలు  చేసినా  ఫర్లేదు ,   కొన్ని   పుణ్యకార్యాలు  చేస్తే  చాలు ..  చేసిన  పాపాలు  కొట్టుకుపోతాయి  అనుకోకూడదు. 


*  అలాగైతే  రావణాసురుడు  
కూడా  పూజలు    చేసాడు. అతను    దైవపూజలు    చేసాడు  కదా  !  క్షమించేద్దాంలే.......  అని  దైవం  అనుకోలేదు.  ఎన్ని  పూజలు  చేసినా  కూడా ,  రావణుడు  తాను  చేసిన  తప్పులకు  చివరికి  నాశనం  అయ్యాడు. 

* అందుకని  ఒక  చేత్తో    పూజలూ  చేస్తూనే,   ఇంకో చేత్తో    పాపాలు  చేయటం ..... అనే  మనుషుల  అతితెలివి  విధానం  మంచిది  కాదు.

 ..................

*చేసిన  తప్పులకు  పశ్చాత్తాపపడి,  ఇక ముందు  పాపాలు  చేయకూడదని  భావించి , మంచి  మార్గంలోకి  రావాలనుకునే  వారికోసం,  వారిలో  మంచి  మార్పు  కోసం   ఇలాంటి  కధలను  పెద్దలు  అందించారు  అంతే కానీ  ,  చేసిన  తప్పులకు  పశ్చాత్తాపడకుండా , పూజలు  చేస్తూనే    మళ్ళీ  మళ్ళీ  చెడ్డపనులు  చెయ్యాలనుకునే  వారి  కోసం  ఇలాంటి  కధలు  చెప్పబడలేదు.

..................................

* దైవం  ఎంతో  దయామయుడు.   వ్యక్తులు  కొన్ని   తప్పులు  చేసినా  ఓపికగా  ఉండి,  వ్యక్తులలో  మార్పు  రానప్పుడు,  ఇక  శిక్షను  విధిస్తారు. 


*  (  శిక్షను  విధించటం  కూడా  వ్యక్తుల  మంచికోసమే.  వారు  మరిన్ని  పాపాలు  చేయకుండా  ఉండటానికే.  )

* శ్రీకృష్ణుడు  శిశుపాలుని  నూరు  తప్పుల  వరకూ  క్షమించి,   అప్పుడు  సంహరించారు.

*  హనుమంతుడు,  అంగదుడు,    లంకకు  వెళ్ళి  హితవు  చెప్పినా  కూడా   రావణుడు  వినిపించుకోలేదు.  రాములవారి  వద్దకు  సీతాదేవిని  పంపించలేదు.  అప్పుడు   ఇక,   రాముడు  రావణుని  సంహరించటం  జరిగింది.

...............................
* అందుకని ,     తెలిసోతెలియకో   తప్పులు  చేసినా    సరిదిద్దుకుని , ఇక  ముందు  తప్పులు  చేయకుండా  ఉండటానికి  ప్రయత్నించాలి.   జీవితంలో  సరైన  దారిలో  నడిచే  శక్తిని  ఇవ్వమని   భగవంతుని  ప్రార్ధించాలి.
...............................

 

Wednesday, November 21, 2012

అరుదైన, చిత్రమైన మొక్క , మరియు...

ఏడాదికి  ఒకసారి  ఉగాది  రోజే   మొలకెత్తి ,  మొగ్గతొడిగి  పుష్పించే  అరుదయిన  మొక్క  గురించి  మీరు  విన్నారా  ?

ఈ  మొక్కను   ముంగారి  మొలక   (  ఉగాది  పుష్పం  ) అంటారట.

  మద్దికెర  మండలం  అగ్రహారం  గ్రామంలో  ఇలాంటి  మొక్క  వచ్చిందట.

ఏటా  ఉగాది రోజు  మొలకెత్తి  సాయంత్రం  లోగా  వాడిపోయే  మొలకను  రైతులు  పంటలపుష్పంగా  పిలుస్తారు.  కొందరు  కాలాన్ని  నిర్ణయించే  పుష్పంగా   భావిస్తారట .


గడ్డి  కూడా  మొలవని  నేలలో  ఎలాంటి  తేమ  లేకపోయినా  ఒకే  రోజులో మొలకెత్తి   రెండు  అడుగులు  పెరగడంపై  నిపుణులు  సైతం  ఆశ్చర్యానికి  గురవుతున్నారు. 



ఈ  మొక్క  పదికి  పైగా  మొగ్గలు  తొడిగితే  ఆ  ఏడు  పంటలు  బాగా  పండుతాయని  రైతుల  నమ్మకం.  

ఇలాంటి  మొక్కలు  అగ్రహారం  ప్రాంతంలో  మాత్రమే  కనిపిస్తాయట.

హైదరాబాద్ కు  చెందిన  శాస్త్రవేత్తలు  సైతం  ఈ  మొక్కను  పరిశీలించారట.  


ఒకే  రోజు  మొలక  రావటం,  మొగ్గ  తొడగటంపై  పరిశోధనలు  చేస్తున్నారట. 

 (కొన్ని  సంవత్సరాలకు  క్రితం  ఈనాడు  దినపత్రికలో  ఈ  విషయాలను  వ్రాసారండి..)
............................


  ఆధునిక  విజ్ఞానశాస్త్రపు  సూత్రాలకు  అంతుచిక్కని   రహస్యాలెన్నో  సృష్టిలో  ఉన్నాయి.  


గగుర్పాటు  కలిగించే  గొంగళి పురుగు  తపస్సమాధి  స్థితి  లాంటి  దశను  దాటాక ,  రంగురంగుల  సీతాకోకచిలుకగా  మారే  విధానం  కూడా  అద్భుతం,  ఆశ్చర్యకరం. .


 దైవసృష్టి  ఎంతో  అద్భుతమైనది,  మన  అంచనాలకు,  ఆలోచనలకూ    అంత  సులువుగా  అందనిది. 

...........................................................

ముంగారి  మొలక చిత్రాలను బ్లాగ్ లో పెట్టానండి. అయితే, అంత క్లియర్ గా కనిపించటం లేదు.

జాగ్రత్తగా గమనిస్తే, మొదటి చిత్రంలో ఒక సన్నటి మొలకకు పైన ఆకుపచ్చని ఆకులు ఉన్నాయి.

రెండవ చిత్రంలో పెరిగి వంపు తిరిగిన సన్నటి మొక్క కనిపిస్తోంది.



Monday, November 19, 2012

ఓం నమఃశ్శివాయ.

ఓం.
కార్తిక  సోమవారం  సందర్భంగా....

లింగాష్టకం.


1..బ్రహ్మమురారి సురార్చితలింగం

....నిర్మల భాసితశోభితలింగమ్
జన్మజదుఃఖవినాశకలింగం

....తత్ప్రణమామి  సదాశివలింగమ్

2..దేవముని ప్రవరార్చితలింగం

....కామదహనకరుణాకరలింగమ్
రావణదర్పవినాశకలింగం

....తత్ప్రణమామి సదాశివలింగమ్

3..సర్వసుగంధసులేపితలింగం

....బుద్ధివివర్ధనకారణలింగమ్
సిద్ధసురాసురవందితలింగం

....తత్ప్రణమామి సదాశివలింగమ్

4..కనకమహామణిభూషితలింగం

....ఫణిపతివేష్టితసేవితలింగమ్
దక్షసుయజ్ఞవినాశనలింగం

....తత్ప్రణమామి సదాశివలింగమ్

5..కుంకుమచందనసేవితలింగం

....పంకజహారసుశోభితలింగమ్
సంచితపాపవినాశక  లింగం

....తత్ప్రణమామి సదాశివలింగమ్

6..దేవగణార్చితసేవితలింగం

....భావైర్భక్తిభిరేవ  చ లింగమ్
దినకరకోటి ప్రభాకరలింగం

....తత్ప్రణమామి సదాశివలింగమ్

7..అష్టదళో పరివేష్టితలింగం

....సర్వసముద్భవకారణలింగమ్
అష్టదరిద్ర వినాశనలింగం

....తత్ప్రణమామి  సదాశివలింగమ్

8..సురగురు సురవర పూజితలింగం

....సురవనపుష్పసదార్చితలింగమ్
పరమపదం పరమాత్మక లింగం

....తత్ప్రణమామి  సదాశివలింగమ్

లింగాష్టక  మిదం పుణ్యం

....యఃపఠే చ్చివసన్నిధౌ
శివలోక  మవాప్నోతి

....శివేన  సహ  మోదతే.
గౌరీస్తుతి 

 
నానాయోగిమునీంద్ర హృద్యనిలయాం
నానార్ధసిద్ధిప్రదాం
నానాపుష్పవిరాజితాంఘ్రియుగళాం
నారాయణేనార్చితామ్
 నాదబ్రహ్మమయీం  పరాత్పరాం
నానార్ధతత్వాత్మికాం
మీనాక్షీం  ప్రణతోస్మి  సంతత మహం
కారుణ్యవారాన్నిధిమ్ .


 వ్రాసిన విషయాలలో ఏమైనా  అచ్చుతప్పులు  వంటివి ఉంటే ,  దయచేసి  క్షమించమని దైవాన్ని  ప్రార్ధిస్తున్నాను.
 
 

Friday, November 16, 2012

సంతాన ఫల మంత్రం.

ఓం.

రేపు  నాగుల  చవితి  సందర్భంగా,   సంతాన  ఫల మంత్రం.

సంతానం  లేకపోవడానికి  నాగదోషం  లేదా  సర్పదోషం  కారణమని  అంటారు.

  ఈ  నాగదోషం  తొలగాలంటే  గర్భం  ధరించిన  నెలలోపులో  లేదా  గర్భధారణకి  పూర్వమే  అయినా  ఈ  క్రింది  శ్లోకాన్ని  రోజూ  స్నానం   చేశాక  ముమ్మారు  పఠించాలి. ఇలా  చదివితే  తప్పక  108  రోజుల్లో  నాగదోషం  తొలగుతుందనేది  అనుభవంలో  వున్న  సత్యం.  చక్కని  సంతానం  కలిగారనేది  వాస్తవం.

ఏ  నిత్య  నివేదనలూ  నియమాలూ  లేవు.   108వ  రోజు  చదవడం  పూర్తయ్యాక  నువ్వుల  చిమ్మిలి  నైవేద్యం  పెట్టాలి.  ఆ  మంత్రం లాంటి  శ్లోకం  ఇదిగో.

జరత్కారుర్జగద్గౌరీ  మానసా  సిద్ధయోగినీ


వైష్ణవీ నాగభగినీ  శైవీ  నాగేశ్వరీ  తధా !


జరత్కారుప్రియాస్తీక మాతా  విషహారేతి  చ


మహాజ్ఞానయుతా  చైవ సా  దేవీ విశ్వపూజితా  !!

ద్వాదశైతాని  నామాని  పూజాకాలే తు  యః పఠేత్  !
 తస్య  నాగభయం నాస్తి  తస్య  వంశోద్భవస్యచ  !!
 

..................... 
ఇలాంటి  చక్కటి  విషయాలను  తెలియజేసిన  పెద్దలకు  కృతజ్ఞతలు.
..............................

నాగులచవితి  రోజున  పుట్ట  వద్ద  దీపాలు  వెలిగించకూడదని  పండితులు  అంటున్నారు.  ఇందుకు  అనేక  కారణాలు  ఉండవచ్చు.  

  పుట్ట  వద్ద  పాలు  సమర్పించి  అందరూ  ఇళ్ళకు  వెళ్ళి,  జనసంచారం   సద్దుమణిగిన  తరువాత,  పుట్టలోని  పాములు  బయటకు  వస్తే,  వెలుగుతున్న  దీపాలు  వాటికి  తగిలే  అవకాశం  కూడా   ఉంది.


పుట్ట  వద్ద  దీపాలు  వెలిగించకూడదని  చెప్పటానికి  బహుశా  ఇది  కూడా  ఒక  కారణం  అయిఉండవచ్చు.

 పిల్లలు , పుట్ట  వద్ద  టపాసులు  కాల్చితే,   మిగిలిన  వేడి  ఇనుప  తీగలను  పుట్ట  వద్దే  పడేయకుండా ,  పుట్టకు  దూరంగా  చెత్తకుండీలో  వెయ్యటం   మంచిది. 


 వ్రాసిన విషయాలలో ఏమైనా  అచ్చుతప్పులు, పొరపాట్లు వంటివి ఉంటే ,  దయచేసి  క్షమించమని దైవాన్ని  ప్రార్ధిస్తున్నాను.
 
 

Wednesday, November 14, 2012

కొన్ని అభిప్రాయాలు...సీతారాముల గురించి కొన్ని విషయములు..


ఈ  బ్లాగ్  ను  ప్రోత్సహిస్తున్న  సభ్యులకు  మరియు  అందరికి  అనేక  కృతజ్ఞతలండి.
 ..........................

శ్రీ దశరధ మహారాజు సత్యానికి కట్టుబడిన వారు. కైకేయికి ఇచ్చిన మాటకు కట్టుబడి.. శ్రీ రామ పట్టాభిషేకం, వనవాసం..వంటి విషయాలలో నిస్సహాయులైనారు.
...............

 సీతాదేవిని  అడవులకు  పంపటం  గురించి  ఒక  దగ్గర    ఇలా  ఉంది...

 రామరాజ్యం

శ్రీ రామ పట్టాభిషేకం తరువాత అయోధ్యలో అంతటా సుఖ సంతోషాలు వెల్లివిరిసాయి. శ్రీ రాముని పాలనలో ప్రజలు ఏ కష్టం లేకుండా సుఖంగా జీవనం సాగించేవారు. అందుకే ఇప్పటికీ శ్రేయో రాజ్య పరిపాలనకు రామ రాజ్యాన్ని ఉదాహరణగా వాడతారు. 

ఇలా ఉండగా ఒక రోజు రాముడు ఏకాంతసమయంలో సీతను చేరి" దేవీ! నీవు తల్లివి కాబోతున్నావు. నీ మనస్సులో ఏమైనా కోరిక ఉంటే చెప్పు. " అని అడిగాడు. అందుకు సీత " నాధా గంగా తీరంలో ఉన్న ముని ఆశ్రమాలలో పళ్ళు, కందమూలాలు ఆరగిస్తూ ఒక్కరోజు గడపాలని ఉంది. ": అంటుంది. అందుకు సరే నంటాడు రాముడు. కానీ సీత కోరిక వినగానే వ్యాకులచిత్తుడవుతాడు.
 
సీత గురించిన నింద
 


అక్కడనుండి సభామంటపానికి వెళ్ళిన రాముడిని విజయుడు, మధుమత్తుడు, కాశ్యపుడు, పింగళుడు, కుటుడు, సురాజు, మొదలైన వారు హాస్య కధలు చెప్పి రాముడిని సంతోషపరుస్తారు. రాముడు ప్రసన్నుడై భద్రునితో" భద్రా! నా పరిపాలన ఎలావున్నది? ప్రజలకు ఎలాంటి సమస్యలు లేవుగదా? నిజం చెప్పు.?" అని అడుగుతాడు.

 అందుకు భద్రుడు" మహారాజా! సత్యసంధుడివైన నీకు నిజం చెప్తున్నాను. ప్రజలు నీ పరాక్రమాలను, రావణ సంహారాన్ని వేనోళ్ల పొగడుతున్నారు. అయితే, రావణ చెరలో కొన్నాళ్ళు ఉన్న సీతను తిరిగి మీరు భార్యగా స్వీకరించడం గురించి మాత్రం రక రకాలుగా చెప్పుకొంటున్నారు. ఇలా అంటున్నందుకు నన్ను మన్నించండి" అన్నాడు.

 రాముడు సరేనని వారినందరిని పంపించి విషాదచిత్తుడై తమ్ముళ్ళను పిలిపిస్తాడు. వారు రావడంతోనే రాముని వదనం చూసి నిశ్చేష్టులవుతారు.


 రాముడు వారిని కూర్చోమని జరిగిన సంగతి అంతా వివరిస్తాడు. " లక్ష్మణా! సూర్య చంద్రులు, అగ్ని,ఇంద్రాది దేవతలు కూడా ఆమె సౌశీల్యాన్ని శ్లాఘించారు. కానీ ఆమెపై అయోధ్యలో ఇంకా అపవాదు తొలగలేదు. ప్రజాభీష్టం లేని పరిపాలన సూర్యుడులేని పగలు వంటిది. ఇప్పుడు నాకు ఆమెను పరిత్యజించడం తప్ప వేరు మార్గం కనపడ్డం లేదు. కొద్ది సమయం కిందటే సీత తనకు మున్యాశ్రమాలు చూడాలని కోరికగా ఉన్నదని కోరగా ఆమెకు సరే అని అనుమతిచ్చాను. నువ్వు మారు మాటాడక ఆమెను గంగానదీ తీరంలోని ఆశ్రమాల వద్ద వదిలిరా. ఇది నా ఆజ్ఞ" అంటాడు. 
.......................


పై  విషయాలను  గమనించితే , ఒక్క  పామరుడు  వ్యాఖ్యానించటమే    కాకుండా,  మిగతా   ప్రజలకు  కూడా   , రాముడు  సీతను  తిరిగి  భార్యగా స్వీకరించడం  గురించి  రకరకాల  అభిప్రాయాలు  ఉన్నట్లు  తెలుస్తోంది.
..........................................
 


 సీతమ్మను అడవులకు   పంపించటం  గురించి    ఇంకొక  దగ్గర  ఎలా  చెప్పారంటే,...........

 ఆ  కాలంలో,  ఒక  పామరుని  భార్య  కొన్ని  కారణాల  వల్ల  పరపురుషుని  ఇంటివద్ద  కొన్నాళ్ళు  ఉండి  రాగా,   పరపురుషుని  ఇంటివద్ద  ఉండి   వచ్చిన  భార్యను  తాను  ఏలుకోనని  అంటూ,    ఆ  పామరుడు  అలా   వ్యాఖ్యానిస్తాడట.
 ఆ  భార్యాభర్తలకు  జరుగుతున్న   గొడవను    జనం  గుమికూడి  చూస్తుంటారు.  ఆ  జనంలోని  గూఢచారుల   ద్వారా ,   ఆ  పామరుడు  అన్న  వ్యాఖ్య  గురించి  శ్రీ రామునికి  తెలుస్తుందట.

..........................................

    సీతాదేవి దైవాంశసంభూతురాలు.  రావణుడు ఆరు బయట అశోకవనంలో ఆమెను  రాక్షస స్త్రీల మధ్య   ఉంచి ,  తనను  వివాహమాడమని   బెదిరించటం  తప్ప,  మరో విధంగా  ఆమెకు  హాని  కలిగించలేకపోయాడు.

    సీతాదేవి  సాక్షాత్తు  లక్ష్మీదేవి  అవతారం. ఆమె మహిమ గురించి  రామునికి తెలుసు. 


సీతాదేవిని అరణ్యాలకు పంపించిన తరువాత అశ్వమేధ యాగ సమయంలో ఇంకో వివాహం చేసుకొమ్మని  కొందరు సలహా  ఇచ్చినా,   రాముడు వినలేదు. 


స్వర్ణ  సీతాదేవి  ప్రతిమను  తయారుచేయించి  భార్యగా భావించి యాగాన్ని నిర్వహించారు. ఈ  ఒక్క ఉదాహరణ చాలు ,  సీతాదేవి గురించి రాముని అభిప్రాయం లోకానికి తెలియటానికి.


 మరి రామునికి సీతాదేవి అంటే అంత గొప్పభావం ఉన్నప్పుడు, ఆమెను  అడవులకు  ఎందుకు   పంపించారు ? అంటే ,

ప్రజాభీష్టంతో  పాటూ   ఎన్నో  విషయాలను   కూడా   పరిగణనలోకి  తీసుకుని  రాముని  వంటి  వారు  నిర్ణయాలను  తీసుకుంటారు. 


     సామాన్య వ్యక్తి   ఏం చేసినా లోకం అంతగా పట్టించుకోదు. రాముడు చక్రవర్తి.  రాజు ప్రజల  గురించి ఎన్నో రకాలుగా,  ఎంతో  దూరదృష్టితో    ఆలోచించవలసి ఉంటుంది. 


తాము  చేసిన  పనివల్ల  భవిష్యత్తులో  కలగబోయే  పరిణామాలను  కూడా   ఎంతో  దూరదృష్టితో   ఆలోచించి రాజు నిర్ణయాలను  తీసుకోవలసి  ఉంటుంది.


అంటే,  తాము   తీసుకున్న  నిర్ణయం  యొక్క   పర్యవసానాలు,   భవిష్యత్  తరాలపై  దాని  ప్రభావం ....ఇలా  ఎన్నో  రకాలుగా  ఆలోచించి ,    సమాజంలో  కొన్ని  విలువలను  పరిరక్షించటం  కోసం  , సీతాదేవిని  అడవికి  పంపించారనే  నిందను  తనపై  వేసుకున్నారు. రామునికి  తగ్గ  భార్యగా   సీతాదేవి  కూడా  త్యాగాలను  చేసారు. సీతారాములు  ఆదర్శదంపతులు.
 ..................................

అయితే,     రాముడు  సామాన్య మానవుడుగా జన్మిస్తే ,  సీతాదేవిని అడవులకు  పంపించేవారు  కాదు .   అనిపిస్తుంది.
................................................

సమాజంలో  గొప్ప  బాధ్యతలున్న  కుటుంబాలలోని  వ్యక్తులు,   సమాజశ్రేయస్సు  కోసం ,  కొన్నిసార్లు తమ సుఖాలను  త్యాగం  చేయటం  జరుగుతుంటుంది. 

పురాణేతిహాసాలలోని  త్యాగపూరితమైన  ఈ  పాత్రలు  తరువాత  తరాల  వారికి  ఎంతో  స్పూర్తిని  కలిగించాయి.

 ప్రజలలో  స్వార్ధం  తగ్గించి , సమాజశ్రేయస్సు  కోసం  తమ  వంతుగా  సాయం  చేయటానికి    తోడ్పడ్డాయి.  


స్వాతంత్ర్యోద్యమం  జరిగినప్పుడు  ఎందరో వ్యక్తులు   పురాణేతిహాసాలలోని  వ్యక్తులను  స్పూర్తిగా  తీసుకుని  తమకు  తోచిన  త్యాగాలను  చేసారు.

 గాంధీజీ  వంటివారు  తమపై  పురాణేతిహాసాల  ప్రభావం  ఎంతో  ఉందని  చెప్పటం  జరిగింది.


 ఆ  రోజుల్లో,  ఎందరో  స్వాతంత్ర్యసమరయోధులు  తమ  ఆస్తులను  స్వాతంత్ర్యోద్యమానికి  సమర్పించి , తమ   కుటుంబాలను  జనారణ్యంలో  వదిలి,   తాము  జైళ్ళలో  గడిపారు. 


 అప్పటి  వాళ్ళందరి   త్యాగాల  వల్లా  ఈ  దేశానికి  స్వాతంత్ర్యం  వచ్చింది.  


  సమాజంలో  బాధ్యతాయుత  స్థానాలలో  ఉన్నవారికి  కొన్నిసార్లు ,  కుటుంబశ్రేయస్సా   ?  లేక  సమాజశ్రేయస్సా  ? ఏది  ముందు  ?  ఏది  వెనుక  ? అనే   క్లిష్టపరిస్థితులు   ఎదురవుతాయి. 


 ఇలాంటప్పుడు  దేశం  గురించి  రాజుకు  బాధ్యత  ఉన్నట్లే  రాణికి  కూడా  బాధ్యత  ఉంటుంది.  


 ఎన్నో  విధాలుగా   ఆలోచించి   ఉత్తమ మైన రాజుగా రామయ్య ..ఉత్తమమైన   రాణిగా సీతమ్మ   తమ జీవితంలోని సుఖసంతోషాలను త్యాగం చేసి ఉంటారు.  అనిపిస్తుంది.

ఎవరికైనా  కుటుంబం,  సమాజం  రెండూ   ముఖ్యమే. 

శ్రీరాముడు కూడా ,
కుటుంబం,  సమాజం .. రెండూ ముఖ్యమే  అని   భావించి,   కుటుంబసభ్యుల  పట్ల,   సమాజం  పట్ల ..  తన  బాధ్యతను (  ధర్మాన్ని  ) నెరవేర్చటానికి  ఎంతో  కృషి  చేసారు. సీతాదేవి  కూడా  శ్రీరామునికి  తగిన  ఉత్తమురాలైన  భార్య. 

అయితే,
అందరూ  పరిపూర్ణంగా  ఆనందంగా  ఉండాలంటే  ఈ  లోకంలో  సాధ్యమయ్యే  పని  కాదు. అసలు  కష్టాలే   లేని  పరిపూర్ణమైన  ఆనందం  కావాలంటే   పరమాత్మను  చేరినప్పుడు (  మోక్షాన్ని  పొందినవారికి )  మాత్రమే  సాధ్యం. 

మనిషిగా  జన్మను  ధరించిన  తరువాత  అవతారమూర్తులు  కూడా  మానవులకు  వలే  భావాలను  ప్రకటిస్తారట.
............................

 సీతారాములు ఎన్నో  కష్టాలను  అనుభవించినా   ,  వారి  సంతానం  చక్కగా  జీవించి  రాజ్యాలను  పాలించారు. 

రావణుడు,   అతని  కుటుంబం  కొంతకాలం   సుఖాలను  అనుభవించినా,    చివరికి   రావణుడు  ,  తన   సంతానంతో  సహా  నశించారు.


 రావణాసురుని  వంటి    వారివల్ల  మంచివాళ్ళకు   కూడా  కొన్ని కష్టాలు   వస్తాయి. 

.............................. 
మరి  కొన్ని  అభిప్రాయాలూ  ఈ  లింక్  లో  ఉన్నాయండి.

కొందరు ప్రజల చిత్రమైన ప్రవర్తనలు....

............................................
వాల్మీకి  వారి  మూల  రామాయణాన్ని  నేను  చదవలేదు. . నాకు  తెలిసినంతలో   వ్రాసాను.
 ..................................


వ్రాసిన  విషయాలలో  పొరపాట్లు  ఉంటే  దయచేసి  క్షమించమని  దైవాన్ని  ప్రార్ధిస్తున్నాను.



Monday, November 12, 2012

కొన్ని విషయాలు..

ఓం.
విష్ణోః  అష్టావింశతి  నామ  స్తోత్రమ్ 


శ్రీ  భగవానువాచ :


మత్స్యం  కూర్మం  వరాహంచ  వామనంచ  జనార్దనమ్ 

గోవిందం  పుండరీకాక్షం  మాధవం  మధుసూదనమ్ 
పద్మనాభం  సహస్రాక్షం  వనమాలిం  హలాయుధమ్
గోవర్ధనం  హృషీకేశం  వైకుంఠం  పురుషోత్తమమ్
విశ్వరూపం  వాసుదేవం  రామం  నారాయణం  హరిమ్ 

దామోదరం  శ్రీధరంచ  వేదాంగం   గరుడధ్వజమ్ 
అనంతం  కృష్ణగోపాలం  జపతోనాస్తి  పాతకమ్ 
గవాం  కోటి ప్రదానస్య  చాశ్వమేధ  శతస్యచ.

శ్రీ  మహావిష్ణు  షోడశ నామ  స్తోత్రం.


ఔషధే చింతయే  ద్విష్ణుం  .....భోజనే చ  జనార్దనమ్ 
శయనే పద్మనాభంచ.....వివాహే చ  ప్రజాపతిమ్ 
యుధి  చక్రధరం  దేవం...ప్రవాసే చ  త్రివిక్రమమ్ 
నారాయణం  తను త్యాగే...శ్రీధరం  ప్రియసంగమే
దుస్వప్నేస్మర  గోవిందం....సంకటే  మధుసూదనమ్

 కాననే  నరసింహం చ...పావకే  జలశాయినమ్ 
జలమధ్యే  వరాహం చ...పర్వతే   రఘునందనమ్ 
గమనే  వామనంచైవ...సర్వకాలేషు  మాధవమ్ 
షోడశైతాని  నామాని...ప్రాతరుత్ధాయ  యః పఠేత్
సర్వపాప  వినిర్ముక్తో.....విష్ణులోకే  మహీయతే.


లక్ష్మ్యష్టకం


నమస్తే స్తు  మహామాయే  శ్రీ  పీఠే  సురపూజి తే
శంఖ  చక్ర  గదాహస్తే  మహాలక్ష్మీ  నమో స్తు తే .
నమస్తే  గరుడారూఢే  డోలాసుర భయంకరి
సర్వపాపహరే  దేవి  మహాలక్ష్మి  నమోస్తు  తే .
సర్వజ్ఞే  సర్వవరదే  సర్వదుష్ట  భయంకరి
సర్వపాపహరే  దేవి  మహాలక్ష్మి  నమోస్తుతే .
సిద్ధిబుద్ధి  ప్రదే దేవి  భుక్తి ముక్తి  ప్రదాయిని
మంత్రమూర్తే  సదాదేవి  మహాలక్ష్మి  నమోస్తుతే .
ఆద్యంతరహితే దేవి  ఆద్యశక్తే మహేశ్వరి
యోగజ్ఞే యోగ  సంభూతే  మహాలక్ష్మి  నమోస్తుతే .
స్థూలసూక్ష్మే  మహారౌద్రే  మహాశక్తే  మహోదరే
మహాపాపహరే దేవీ  మహాలక్ష్మి  నమోస్తుతే .
పద్మాసన స్థితే  దేవి   పరబ్రహ్మస్వరూపిణి
పరమేశి జగన్మాత ర్మహాలక్ష్మి  నమోస్తుతే .

శ్వేతాంబర  ధరే  దేవి నానాలంకారభూషితే
జగత్సితే  జగన్మాత  ర్మహాలక్ష్మి  నమోస్తుతే .
మహాలక్ష్మ్యష్టకం  స్తోత్రం యః  పఠే  ద్భక్తిమా న్నరః
సర్వసిద్ధి  మవాప్నోతి  రాజ్యం  ప్రాప్నోతి  సర్వదా .

ఏకకాలే  పఠే న్నిత్యం మహాపాపవినాశనం
ద్వికాలం  యఃపఠే న్నిత్యం   ధనధాన్యసమన్వితః
త్రికాలం  యః పఠేన్నిత్యమ్  మహాశత్రువినాశనమ్
మహాలక్ష్మీర్భవేన్నిత్యం  ప్రసన్నా   వరదా  శుభా.


ఇతి  ఇంద్రకృత మహాలక్ష్మ్యష్టక స్తవః

.................
వ్రాసిన   వాటిలో    అచ్చుతప్పుల  వంటివి  ఉంటే ,  దయచేసి  క్షమించాలని  దైవాన్ని  ప్రార్ధిస్తున్నాను.

ఈ  బ్లాగ్  ను  ప్రోత్సహిస్తున్న  సభ్యులకు  మరియు  అందరికి  అనేక  కృతజ్ఞతలండి.


అందరికి  నరకచతుర్దశి,  దీపావళి  శుభాకాంక్షలండి.



Saturday, November 10, 2012

కొందరు ప్రజల చిత్రమైన ప్రవర్తనలు....


ఈ  రోజుల్లో  చాలామంది   చిత్రవిచిత్రంగా  ప్రవర్తిస్తున్నారు. . భక్తులం  అని  చెప్పుకుంటూనే   భక్తులైనవారు  చేయకూడని  విధంగా  ప్రవర్తిస్తున్నారు.

   పురాణేతిహాసాలలోని  అవతారమూర్తుల  గురించి  తమకు  తోచినట్లు  కామెంట్  చేయటం   చాలామందికి   ఇప్పుడొక  ఫేషన్  అయిపోయింది.


    రామాయణ గాధ జరిగి తరాలు గడిచినా,  అప్పటి వారి ప్రవర్తన  గురించి...ఇప్పటికీ  ప్రజలు  చర్చించుకుంటున్నారు  కదా ! 

 ఇవన్నీ  ఊహించి,   తరువాత  తరాలవారికి    ఆదర్శంగా  ఉండటానికి  ఆ  అవతారమూర్తులు    తమ  జీవితాల్లో  ఎన్నో  త్యాగాలు  చేసారు.

1....... ఇప్పుడు  ఒకాయన  రాముడు  మంచి  భర్త  కాదు  అన్నారు. (  సీతాదేవిని  శ్రీ రాముడు అడవులకు  పంపినందుకు ..)

2......అప్పుడు  ఒకాయన  రాముడు  మంచి  భర్త  కాదు  అన్నారు. (  సీతాదేవిని  శ్రీ రాముడు  ఇంటికి  తీసుకువచ్చినందుకు.  )

కొందరు  లోకులు  ఎటుపడితే  అటు  మాట్లాడతారు.

1..  భార్యను    ఇంటికి  తీసుకురావటం   తప్పు  ...  అంటారు  కొందరు.

2...  భార్యను  అడవికి  పంపించటం  తప్పు  ....  అంటారు    కొందరు.

3.  అసలు  సీతారాములు  ఏం చేసి ఉంటే  ,  లోకంలోని  అందరూ  మెచ్చుకునేవారో ? 


*  తప్పనిసరి  పరిస్థితుల్లోనే ,  భవిష్యత్  తరాలను  కూడా  దృష్టిలో  ఉంచుకునే ,  ఆ  నాడు  సీతారాములు  అలాంటి  త్యాగాలు  చేసారు.
..............


*    కొన్ని  సినిమాల్లో  కూడా   మనం  పూజించే  దేవుళ్ళనే  పాత్రధారులుగా  చేసి  కామెడీ  చేయిస్తున్నారు. మనం కూడా   అలాంటి  సినిమాలను  విరగబడి  చూస్తుంటాం.  పగలబడి  నవ్వుకుంటున్నాం. (  నేను  కూడా  ఆ  సినిమాలను  చూసి  నవ్వాను  లెండి..),

అయితే  ఇప్పుడు  ఏమనిపిస్తుందంటే,  అలా    చేయటం  తప్పనిపిస్తోంది.

*దేవుళ్ళంటే   భయభక్తులు  లేకుండా    సినిమాల్లో  కామెడీ  పాత్రలుగా    యమధర్మరాజు  వంటి   దేవుళ్ళను  చూపించటం    అనేది  ఎంతో  పాపం .   భక్తులైన  వారు  ఇలా  దేవుళ్ళను  తక్కువ  చేయటం  అనేది  ఎంతో  తప్పు.

..............................
పురాణేతిహాసాలలోని  విషయాల   గురించి  నేను  వ్రాసిన   కొన్ని   పాత  టపాలు...వ్యాఖ్యలలోని  కొన్ని    అభిప్రాయాలు... .....మరియు  ఇప్పటి   కొన్ని  అభిప్రాయాలు...

*  రామాయణం లోని పాత్రలు,   వారి అవతార విశేషాలు,    వారి పూర్వ కర్మ విశేషములు,    శాపములు ......ఇవన్నీ చాలా.....  పెద్ద కధ . ఇవన్నీ ముందే   ఒక ప్రణాళిక ప్రకారం   జరిగిందని   పెద్దలు చెప్పటం  జరిగింది.


* రాములువారు  ఏం  తప్పు చేశారు ?  సీతాపహరణం తరువాత రాములవారు ఎంతో శోకించి , ఆమెకోసం ఎంతో ఆరాటపడి,   ఎన్నో కష్టాలు పడి   భార్యను   వెదికి తెచ్చుకున్నారు.   రాముడు   భార్యను   రక్షించుకున్న మంచి భర్త.    ఆ సందర్భములో ఎంతోమంది   రాక్షసులను కూడా సంహరించారు..


* ఈ ఆధునిక  కాలంలో అయినా , ఎంతమంది మగవాళ్ళు అలా   చేయగలరు ?  కొంతమంది  అయితే ,  భార్యను వెదకటం మాని ,  మరొక వివాహం   చేసేసుకుంటారు.

 *
ఒక భర్తగారాములవారు సీతాదేవిని ....లంక నుండి  రక్షించి  తీసుకు వచ్చారు.

ఒక రాజుగా,   ఒక  పామరుని   అభిప్రాయాన్ని ప్రజల అభిప్రాయంగా భావించి ... సీతాదేవిని అడవులకు పంపించవలసి వచ్చింది.

* అశ్వమేధ యాగం   సందర్భంలో  రాములవారిని  మళ్ళీ  వివాహం  చేసుకొమ్మని  కొందరు   సలహా  ఇచ్చారట.

*  అయితే,  అశ్వమేధ యాగం సందర్భంలో రాములవారు సీతాదేవి యొక్క బంగారు ప్రతిమను భార్యగా భావించటం ద్వారా .... ఎవరు ఎన్ని అన్నా,  తన భార్య సీతాదేవే .... అన్న విషయాన్ని లోకానికి   దృఢంగా   తెలియజేశారు.

* ఈ  విషయాన్ని  గమనించితే,   సీతాదేవిని  గురించి శ్రీరామునికి గల గొప్ప అభిప్రాయం తెలుస్తుంది.

* సీతమ్మవారు కూడా ,   రాజభోగాలు   అన్నీ  వదలి    భర్తతోపాటు అడవులకు వెళ్ళారు. ఎన్నో  కష్టాలను    అనుభవించారు.   సీతాదేవి  ఎంతో ఉత్తమ ఇల్లాలు.



* సీతమ్మను అడవులకు పంపించటం గురించి . .. ఇక్కడ గమనించవలసినది ఏమంటే, ఆ పామరుడు అలా అన్న తరువాత మాత్రమే రాములవారు భార్యను అడవులకు పంపించారు.



* ఒక వ్యక్తి అలా అన్న తరువాత నెమ్మదిగా మిగిలిన ప్రజలలో కూడా ఆ ఆలోచనలు వచ్చే ప్రమాదముంది. (పైకి అనకపోయినా.) ....అందుకే భవిష్యత్తులో దీనిపైన వాదోపవాదములు, అనవసర చర్చలు, అపార్ధములు రాకుండాను, ఒక్కోసారి కొంతమంది అవకాశవాదులు తమ చెడ్డపనులకు ఇలాంటి సంఘటనను తమకు అనుకూలంగా మలచుకుని అధర్మానికి పాల్పడకుండాను,ఎన్నో  రకాలుగా ఆలోచించి,   ప్రజల క్షేమం కొరకు సీతారాములు తమ జీవితాన్ని, సంతోషాలను త్యాగం చేశారు.


* సీతమ్మవారిని అడవులకు   పంపిన    తరువాత రాములవారు    ప్రజల కొరకు రాజ్యాన్ని పాలించినా..తాను రాజభోగాలకు    దూరంగా సామాన్యంగా జీవించారు .


 ( సీతాదేవి అడవిలో ఏ విధంగా నిరాడంబరంగా జీవిస్తుందో అలాగ). 

 ( హంసతూలికా తల్పం పైన శయనించటం కాకుండా , నేలపై  దర్భలు  పరిచిన  తల్పంపైన  శయనించటం లాంటివి.)
....................................


* సీతాదేవి లవకుశులను రాములవారికి అప్పగించి,  తాను భూదేవి ఒడిలోకి వెళ్ళిపోవటం గురించి నాకు ఇలా అనిపిస్తుంది....


అగ్నిపరీక్షలో నెగ్గిన తరువాత సీతాదేవిని   ఇంటికి తెచ్చుకున్నా కూడా ........ కొంతమంది ప్రజలు ఏదేదో మాట్లాడారు  కదా  !    అప్పుడు   సీతాదేవిని రాములవారు అడవికి పంపించటం జరిగింది.

ఇప్పుడు,   లవకుశులతో పాటు సీతాదేవి కూడా   రాజ్యానికి తిరిగి  వస్తే,

ఒకవేళ ,మళ్ళీ కొందరు ప్రజలు ముందులా మాట్లాడితే?
అప్పుడు సమస్య   మళ్ళీ మొదటికొస్తుంది. ఇవన్నీ ఆలోచించి ,
ఆ ఇబ్బంది  ఎదురు  కాకుండా   సీతమ్మవారు  అలా త్యాగం చేసి ఉంటారు.

*  తన ఇంటికి   తాను వెళ్ళలేని పరిస్థితి సీతమ్మది ....

*తన భార్యతో తాను జీవించలేని పరిస్థితి రామయ్యది.....

 ( ఇది ఎంత విచిత్రమైన విపరీత పరిస్థితి ! )

* అయ్యో  ! సీతాదేవి  భూదేవి  ఒడిలోకి  వెళ్ళిపోకుండా  ఉంటే   బాగుండేది. అనిపిస్తుంది.  వాల్మీకి  వారి  ఆశ్రమంలో  ఉంటే ,  భవిష్యత్తులో  పరిస్థితులు  చక్కబడేవేమో ?  అని  కూడా  అనిపిస్తుంది.

* అయితే,  అప్పటికే  జీవితంలో  ఎన్నో  కష్టాలను  సహించి,  సమీపభవిష్యత్తులో   చక్కటి  భవిష్యత్తు  ఉండే  ఆశ  కనిపించక,   ఎన్నో  విధాలుగా  ఆలోచించి,    వేరే  మార్గాంతరం  లేక  సీతాదేవి  ఆ  నిర్ణయం  తీసుకుని  ఉండవచ్చు  .  అనిపిస్తుంది.


*  సీతమ్మవారు ఎంత త్యాగమూర్తియో   రాములవారు   కూడా  అంతే  త్యాగమూర్తి.

*   రాముల వారు మళ్ళీ వివాహం చేసుకోలేదు. 

రాములవారు ఆదర్శ పుత్రుడు, ఆదర్శ సోదరుడు,, ఆదర్శ భర్త, ఆదర్శ తండ్రి, ఆదర్శ పాలకుడు, ఆదర్శవ్యక్తి, సీతమ్మవారు అన్నింటా ఆయనకు సాటి వచ్చే ఆదర్శ వ్యక్తి.

* సీతారాములు ఆదర్శ దంపతులు.


* మనిషిగా  జన్మను  ధరించిన  తరువాత  అవతారమూర్తులు  కూడా  మానవులకు  వలే  భావాలను  ప్రకటిస్తారు.
.....................
 
*  లక్ష్మణుల  వారు  కూడా  ఎంతో  ఆదర్శమూర్తి..  వారు  తనకు  వనవాసం  చేయవలసిన  అవసరం  లేకపోయినా ,  అన్నగారి     కష్టంలో  పాలు  పంచుకోవటానికి  సాయంగా  తానూ  త్యాగాలు  చేసారు.  లక్ష్మణుని  భార్య  ఊర్మిళాదేవి  కూడా  ఆదర్శ పత్ని.  ఊర్మిళాలక్ష్మణులు   కూడా  ఆదర్శ దంపతులు.

లక్ష్మణుడు  కూడా  సీతాదేవిని  అన్వేషించుటలో ,  ఇంకా    యుద్ధం  జరిగినప్పుడు  ఎంతో  శ్రమించారు. హనుమంతుడు  మొదలైన  వారు   కూడా   సీతాన్వేషణలో  ఎంతో  శ్రమించారు.

........................
* రామాయణ  గాధ  నుంచి  మనం  ఎన్నో  విషయాలను  నేర్చుకోవచ్చు. వాటిలో  కొన్ని.....

* శ్రీ  రామునికి  తెల్లవారితే పట్టాభిషేకం అనుకుంటే......దాని బదులు 14 ఏళ్ళ అరణ్యవాసం చేయవలసి రావటం.....

* అరణ్యవాసం ముగింపుకు వచ్చిందిలే    అనుకుంటే .....అంతలోనే    సీతాపహరణం జరగటం..

*  సరే ,  రావణవధ జరిగింది . సీతారాములు రాజ్యానికి తిరిగి వచ్చి.... ఇక అంతా సవ్యంగా ఉందిలే అనుకునేంతలో......కొందరు ప్రజల మాటలవల్ల  సీతాదేవిని   అరణ్యాలకు పంపవలసి రావటం...

* మరి   కొంతకాలానికి సీతాదేవిని, లవకుశులను వాల్మీకి మహర్షి ఆశ్రమంలో చూసిన తరువాత.... పిల్లలను చూసిన ఆనందములో రాములవారు ఉండగానే ..సీతాదేవి భూమాతను ఆశ్రయించటం.

*  ఇలా ఎన్నో ఆటు....పోట్లు, ఆశ....నిరాశలతో కూడిన  జీవితం. 


*  రాముడు, లక్ష్మణుడు, ఆంజనేయుడు ఇలా కొంతమంది ఎంతో పరాక్రమవంతులు. వానరులు కూడా దేవాంశసంభూతులట.

*
అయితే,  సాధారణ దృష్టితో చూస్తే ఎంతో క్రూరులు, బలవంతులైన రాక్షసులు ఎక్కడ?   సామాన్య బలం కలిగిన వానరులు ఎక్కడ ?

* ధర్మం అధర్మం పై   విజయాన్ని సాధించిన   కధ ఇది........

*రామతత్వం  రావణతత్వం పై  విజయాన్ని సాధించిన కధ ఇది......

* అందుకే ,  రామాయణ పారాయణం   ఎంతో శుభకరమని పెద్దలు  తెలిపారు......


*  ఎవరికయినా జీవితములో కష్టములు వస్తే ,  ఆత్మహత్యలకు పాల్పడటం, లేక  అధర్మాన్నిఆశ్రయించటం  వంటి  పనులను   చేయకుండా ఈ కధలను గుర్తు తెచ్చుకుని ,  అంత గొప్పవాళ్ళే అన్ని కష్టాలను  అనుభవించారు .  మనమెంత..... అని ధైర్యము తెచ్చుకోవాలి.

* వారు ధైర్య, సాహసములతో ధర్మంగా విజయాన్ని ఎలా  సాధించారో.. మనమూ నేర్చుకోవాలి. 


*ఎక్కడయినా, ఎప్పటికయినా , చివరకు   ధర్మమే గెలుస్తుంది అని తెలుసుకోవాలి.

* వ్రాసిన  విషయాలలో   ఏమైనా   పొరపాట్లు   ఉంటే   దయచేసి  క్షమించాలని   దైవాన్ని   ప్రార్ధిస్తున్నాను.

* అంతా  భగవంతుని దయ.