koodali

Wednesday, November 30, 2011

వరాహస్వామివారి అవతారం గురించి మరి కొన్ని వివరాలు . ........


* శ్రీపాదశ్రీవల్లభస్వామివారు, శ్రీ వరాహస్వామి వారి అవతారం గురించి చెప్పిన రకం జాతి జీవుల గురించి,
ఈ టపా వ్రాసిన తరువాత మళ్ళీ అంతర్జాలంలో స్పష్టంగా చూస్తే.... ఆ జీవులకు ఒకే కోర ఉంటుంది. ఇంకా, ఆ జాతిలోని కొన్ని రకాలకు రెండుకోరలు కూడా ఉండే అవకాశం ఉంది.అనీ ,


ఇంకా
అడవిజాతికి చెందిన వరాహాల గురించి అంతర్జాలంలో వ్రాసినది చూస్తే ...... వాటిలో పురుషజాతివరాహాలకు పెద్దకోరలు ఉంటాయనీ, స్త్రీజాతివరాహాలకు చిన్నవైన కోరలుంటాయని నాకు అర్ధమయింది మరి. ..


* చాలా,మంది భావిస్తున్నట్లు అడవిలో తిరిగే
వరాహాలకు ఒక్కటే కోర ఉండటం జరగదు కదా !. వాటికి నోటికి ఇరుప్రక్కలా రెండు కోరలు ఉంటాయి.


* వరాహావతారం శ్రీపాదశ్రీవల్లభస్వామివారు చెప్పిన జీవజాతికి సంబంధించినదే
.
.................

శ్రీ వరాహస్వామివారి అవతారం గురించి కొన్ని వివరాలు ......... క్రిందటి టపాలో వ్రాశాను కదండి. ...
." శ్రీ దేవీ భాగవతము " గ్రంధములో .........

వరాహస్వామి భూదేవిని సముద్రంలోనుంచీ పైకి తీసుకువస్తున్న సందర్భాన్ని గురించి ఒక దగ్గర ఇలా ఉంది..........

" ఒక పద్మాన్ని కోరమీద నిలబెట్టిన దిగ్గజం లాగా భాసించాడు.ఆదివరాహమూర్తియైన ఆ యజ్ఞేశుడూ యజ్ఞపూరుషుడూ "..... అని వర్ణించబడింది...అంటే " ఒకే కోర " .అన్నమాట.

అంటే మనం సామాన్యంగా చూసే వరాహాలకు కోరలుండవు. అడవిలో తిరిగే వరాహాలకు రెండు కోరలుంటాయి. అంటే ఆ అవతారమూర్తి మనం భావించే వరాహం వంటిది కాదు.
అని కొన్ని వివరాలు ,
............ఇంకా.......,

ఈ వసుంధర ( భూదేవి ) వరాహావతారము సమయంలో వారాహిగా అర్చింపబడిందట.

" శ్రీ దేవీ భాగవతము " గ్రంధములో ....

శుంభనిశుంభుల వధ గురించి చదివితే ఒక దగ్గర ...... శుంభనిశుంభులతో యుద్ధం జరిగిన సందర్భంలో .....వారాహీ దేవికి కోరలు ఉన్నట్లుగా మనకు తెలుస్తుంది.

మా ఇంట్లో ....ఇద్దరు రచయితలు వచనరూపంలో అందించిన .... "శ్రీ దేవీ భాగవతము " గ్రంధములు రెండు ఉన్నాయండి.


౧. ఒక దగ్గరేమో ....నారసింహి నఖాగ్రాలతోనూ, వారాహి ముట్టెతోనూ దానవుల శరీరాల్ని చీల్చివేశారు...అని ఉంది.
2 .ఇంకొకరు అందించిన గ్రంధములో ...... వారాహీ దంష్ట్రాలకు రానురాను పదును పెరిగింది. ....అనీ అలా ఉంది.

*మరి ." శ్రీ దేవీ భాగవతము " గ్రంధములో వరాహస్వామి గురించి.......


గజరాజు తొండంతో కమలాన్ని ఎత్తినట్లు......తన దంష్ట్రాగ్రంతో భూదేవిని పైకి ఎత్తాడు...అని ఉంది కదా !


ఇవన్నీ చదివిన తరువాత నాకు రకరకాల ఆలోచనలు వచ్చాయి.

* నాకు ఏమనిపిస్తోందంటే సృష్టిలో స్త్రీ పురుష జాతి జీవులకు శరీరనిర్మాణంలో తేడాలుంటాయి కదా!

అలాగే వరాహస్వామికి పెద్దగా ఒక కోర ఉంటే వారాహీదేవికి రెండు కోరలున్నాయేమో ? అనిపించింది. ( పొరపాటైతే దైవం దయచేసి క్షమించాలని ప్రార్ధిస్తున్నాను. )

వరాహస్వామి అవతారం చాలా కాలం క్రితం జరిగింది కదా ! ఇప్పుడున్న అలాంటి జీవులలో , స్త్రీజాతి జీవులలో కొన్ని మార్పులు జరిగి కూడా ఉండవచ్చేమో ? అనికూడా అనుకున్నాను.

ఇదంతా చదువుతున్న వారికి అసలు వరాహస్వామి ధరించినది ఏ జీవి రూపం అన్నది స్పష్టంగా తెలుసుకోవాలంటే ....... దీనికి సమాధానం " శ్రీ పాద శ్రీ వల్లభ స్వామి " వారే చెప్పటం జరిగింది.

" శ్రీ పాద శ్రీవల్లభ సంపూర్ణ చరితామృతము " అన్న గ్రంధములోని 7 వ అధ్యాయములో 61 వ పేజీలో ఆ వివరములు చక్కగా ఉన్నాయండి.

ఇంకా....

ఒకసారి బ్రహ్మ, విష్ణువులు తామే గొప్ప అని భావించిన సందర్భంలో ఒక మహా లింగాకారం వారి మధ్యన ఆవిర్భవించిన కధ మనకు తెలుసు.

* అయితే బ్రహ్మదేవుడు, విష్ణుమూర్తి లింగాకారము యొక్క ఆది ..అంతము , కనుగొనే సమయంలో ....... వారు వేరొక విధమైన ఆకారములు ధరించారని "శ్రీదేవీ
భాగవతము"లోవివరించబడలేదు. .
................................................................

* ఈ టపా చదువుతున్న వారికి నేను ఎక్కువగా ఆలోచిస్తున్నానని అనిపిస్తోందా ?

మరి .. వారాహీదేవికి రెండు కోరలున్నాయని చదివాను అని ఎవరైనా అంటారేమోనని ఇలా వ్రాయటం జరిగింది.

విజ్ఞానం గురించి లోతుకు వెళ్ళేకొద్దీ
ఎన్నో ప్రశ్నలు వస్తాయి. ( ఇది ఆధునిక శాస్త్రవేత్తలకు కూడా వర్తిస్తుంది. )

కొన్ని విషయాల్లో కొంతవరకూ ఎక్కువగా ఆలోచించటం అవసరం , కొన్ని విషయాల్లో అనవసరం . ఏది ఎంతవరకు అన్నది .... అది వారివారి విచక్షణ మీద ఆధారపడి ఉంటుంది. తెలియకపోతే చేతనయినంతవరకూ ప్రయత్నించి , సరైన మార్గాన్ని చూపించమని దైవాన్ని ప్రార్ధించటం ఉత్తమం...

*వ్రాసిన విషయాల్లో అచ్చుతప్పులు గానీ, ఇతరత్రా ఏమైనా పొరపాట్లు ఉంటే దైవం దయచేసి క్షమించాలని ప్రార్ధిస్తున్నాను. 

 

Monday, November 28, 2011

వరాహావతారం గురించి కొన్ని విషయాలు..........

తెలుగుభావాలు వారి బ్లాగులో వరాహమూర్తి అవతారం గురించి కొన్ని అభిప్రాయాలు చదివానండి.

* నాకు ఏమనిపిస్తోందంటే......." శ్రీ దేవీ భాగవతము " గ్రంధములో .........వరాహస్వామి తన బంగారుకోరతో భూదేవిని సముద్రం నుంచీ పైకి తెచ్చి స్థిరంగా నిలబెట్టారని చెప్పటం జరిగింది. అంటే " ఒకే కోర " .


ఇంకా, వరాహస్వామి భూదేవిని సముద్రంలోనుంచీ పైకి తీసుకువస్తున్న సందర్భాన్ని గురించి ఒక దగ్గర ఇలా ........." ఒక పద్మాన్ని కోరమీద నిలబెట్టిన దిగ్గజం లాగా భాసించాడు.ఆదివరాహమూర్తియైన ఆ యజ్ఞేశుడూ యజ్ఞపూరుషుడూ "..... అని వర్ణించబడింది...


అంటే మనం సామాన్యంగా చూసే వరాహాలకు కోరలుండవు. అడవిలో తిరిగే వరాహాలకు రెండు కోరలుంటాయి. అంటే ఆ అవతారమూర్తి మనం భావించే వరాహం వంటిది కాదు.

* మరి ఏమిటి ? అంటే దీనికి సమాధానం " శ్రీ పాద శ్రీ వల్లభ స్వామి " వారే చెప్పటం జరిగింది. " శ్రీ పాద శ్రీ వల్లభ సంపూర్ణ చరితామృతము " అన్న గ్రంధంలో
7 వ అధ్యాయములో .... 61 వ పేజీలో వివరములు ఉన్నాయండి.


ఇంకా " శ్రీ దేవీ భాగవతము " గ్రంధములోని వివరముల ప్రకారం చూస్తే ........ భూమిని హిరణ్యక్షుడు మహా సముద్రంలో విసిరేశాడని చెప్పబడింది. అంటే ఈ సముద్రం భూమిపైన ఉన్న సముద్రం కాదు. అయినా భూమిపై ఉన్న సముద్రంలోకి భూమిని ఎలా పడవేస్తాడు లెండి.


*మరి ఆ మహా సముద్రం మాత్రం దేని ఆధారంగా నిలబడిఉందని మనకు సందేహం వస్తుంది. ఆలోచిస్తే సమస్త విశ్వానికి ఆదిశక్తి అయిన పరమాత్మ శక్తే ఆధారశక్తిగా నిలుస్తోంది. ఆ మహా శక్తివల్లనే అనంతబ్రహ్మాండాలుగా సృష్టిరచన సాగుతోందని మనం తెలుసుకోవచ్చు.


ఉదా... భూమి తిరుగుతున్నప్పుడు భూమిపైని సముద్రాలలోని నీరు క్రింద పడటం లేదు కదా ! గురుత్వాకర్షణ శక్తి వల్ల పడటం లేదు అంటే భూమికి గురుత్వాకర్షణ శక్తిని ఇచ్చింది దైవమే కదా ! అలాగే .ఎన్నో గ్రహాలు కూడా క్రింద పడిపోకుండా విశ్వంలో నిలిచే ఉన్నాయి.


సూర్యచంద్రులు గతి తప్పకుండా వస్తున్నారు.
ఊళ్ళను ముంచేసే వానలు వానగా కురవకముందు తేలికైన మబ్బుల్లో ఆకాశంలోనే నిలిచి ఉంటున్నాయి కదా !

 ఇన్ని సాధ్యమయినప్పుడు మహాసముద్రాలు కూడా ఏ ఆధారం లేకపోయినా వాటికవే విశ్వంలో నిలిచి ఉండగలవు. దైవం ప్రసాదించిన విశ్వగురుత్వాకర్షణశక్తి కూడా ఉంటుందేమో ! దైవానికి ఏదీ అసాధ్యం కాదు.

కొన్ని విషయాలు ................

*ఒకప్పుడు త్రిమూర్తులు ఆదిపరాశక్తి అయిన పరమాత్మ వద్దకు వెళ్ళి వారిని స్తుతించగా ఆదిపరాశక్తి వారికి ఎన్నో విషయాలను వివరించటం జరిగిందట. అందులో కొద్ది భాగం.........


ఆదిపరాశక్తి బ్రహ్మదేవునికి వివరించిన విషయాలలోని కొద్ది భాగం.........

*.........ఇక్కడ అంతా జలమయం, పృధివి లేదు, సృష్టి ఎలా చెయ్యను అని కదా అడిగావు. స్థూలాకారంలో పృధివి లేదు అంటే పరమాణువు(లు )గా ఉందని తెలుసుకో. పృధివ్యభావం పరమాణ్వభావం కాదు........అని
ఆదిపరాశక్తి ( పరమాత్మ ) ఎన్నో విషయాలను చెప్పటం జరిగింది.

..............................................

* యమధర్మరాజు సావిత్రీదేవితో చెప్పిన దేవీ మహిమలోని కొన్ని భాగాలు...
........................................................
సర్వకారణకారణుడు సర్వాత్మకుడు సర్వభగవంతుడు సర్వేశ్వరుడు సర్వాద్యుడు సర్వవేత్త సర్వపరిపాలకుడు నిత్యరూపి నిత్యదేహి నిత్యానందుడు నిరాకృతి నిరంకుశుడు నిరాశంకుడు నిర్గుణుడు నిరామయుడు నిర్లిప్తుడు సర్వసాక్షి సర్వాధారుడూ అయిన పరాత్పరుడు ( ప్రకృతి ) మాయావిశిష్టుడై ప్రకృతి శబ్దవాచ్యుడు అవుతున్నాడు. ప్రకృతిపురుషులు పరస్పరం అభిన్నులు. అగ్ని - దాని దాహకశక్తి లాగా అవిభాజ్యులు. వీరి వికారాలే సర్వప్రాకృతరూపాలూనూ. ప్రకృతి శక్తినే మహామాయ అంటారు. సచ్చిదానందరూపిణి. తాను రూపరహిత అయినా భక్తులను అనుగ్రహించడం కోసం రూపం ధరిస్తూ ఉంటుంది. మొట్టమొదటగా గోపాలసుందరీ రూపాన్ని సృష్టించింది. వెంటనే అత్యంత మనోహరుడైన గోపసుందరుణ్ణి సృష్టించింది. ఆమె రాధాదేవి,. అతడు శ్రీకృష్ణపరమాత్మ. ...............

*యముడు చెప్పిన మరికొన్ని విశేషాలు.........

వాయువు సముద్రాన్ని మోసినా, సముద్రం కూర్మాన్ని మోసినా, కూర్మం అనంతుణ్ణి మోసినా ,అనంతుడు ధరణిని మోసినా, ధరణి రత్నరాశులనూ సముద్రాలనూ పర్వతాలనూ సకల చరాచర ప్రాణికోటినీ ఓర్పుతో భరిస్తున్నా - ఇదంతా పరమాత్ముని ఆజ్ఞయే.

*యమధర్మరాజు ప్రళయం గురించి చెప్పిన మరి కొన్ని విషయాలు ..........................

వైకుంఠంలో క్షీరసముద్రమధ్యాన శేషతల్పం మీద శయనించే చతుర్భుజ నారాయణుడు సైతం శ్రీకృష్ణపరమాత్ముని వామపార్శ్వంలో లీనమవుతాడు............అనీ,

ఇంకా........

* ఇలా ప్రళయం సంభవించినప్పుడు సమస్తమూ శ్రీకృష్ణుడిలో లీనమైతే శ్రీకృష్ణుడు ప్రకృతిలో లీనమవుతాడు. ఒక్కటే పరాశక్తి. ఒక్కడే పరాత్పరుడు నిర్గుణుడు. అగ్ర అసీత్ అని వేదాలు చెప్పేది ఇదే. అవ్యక్త మూల ప్రకృతి . అవ్యాకృత పదవాచ్య. చిదభిన్న. ప్రళయంలో తానే మిగులుతుంది. పరాశక్తి గుణాలను కీర్తించడం బ్రహ్మాండంలో ఎవరి వల్లా కాదు .........అని ఇంకా ఎన్నో విషయాలను యముడు సావిత్రికి చెప్పటం జరిగింది.

 ...............................

ఒకసారి బ్రహ్మ, విష్ణువులు తామే గొప్ప అని భావించిన సందర్భంలో ఒక మహా లింగాకారం వారి మధ్యన ఆవిర్భవించిన కధ మనకు తెలుసు. అప్పుడు విష్ణుమూర్తి వేరొక ఆకారం ధరించి లింగాకారం యొక్క వేరొకకొస కనుగొనాలని ప్రయత్నించారు అని కొందరు అంటారు. . అప్పుడు ధరించిన అవతారం కూడా వరాహావతారం లాంటిదేనో నాకు తెలియదు.


* అయితే బ్రహ్మదేవుడు, విష్ణుమూర్తి లింగాకారము యొక్క ఆది అంతము కనుగొనే సమయంలో ....... వారు వేరొక విధమైన ఆకారములు ధరించారని "శ్రీ దేవీ భాగవతము "లో వివరించబడలేదు. .
...............................

*బ్రహ్మమానసపుత్రుడైన స్వాయంభువ మనువు తన తండ్రియైన బ్రహ్మదేవుడు చెప్పిన ప్రకారం మహాదేవిని ఆరాధించి ప్రజలను సృష్టించే శక్తిని పొందారట.

అచ్చుతప్పులు గానీ ఇతరత్రా పొరపాట్లు గానీ ఉంటే దయచేసి క్షమించాలని దైవాన్ని ప్రార్ధిస్తున్నాను..
 

Friday, November 25, 2011

పరిణామవాదాన్ని వేరొక కోణం నుండి పరిశీలిస్తే..... .. మూడవ భాగం........

 
ఈ ప్రపంచం ఒక పద్దతి ప్రకారం దైవం చేత సృష్టించబడింది. ఉదా.... మొక్కలు ఉన్నాయి. అవి విపరీతంగా పెరిగిపోకుండా వాటిని ఆహారంగా తీసుకునే కుందేలు, మేకలు వంటి శాకాహార జంతువులు సృష్టించబడ్డాయి అనిపిస్తుంది .


ఈ శాకాహార జంతువులు ఎక్కువగా పెరిగిపోయి మొక్కలను బాగా తినేస్తే మొక్కలు గణనీయంగా తగ్గిపోయే పరిస్థితి వస్తుంది. అందుకని ఈ జంతువులు విపరీతంగా పెరిగిపోకుండా వాటిని ఆహారంగా తీసుకునే మాంసాహార జంతువులు సృష్టించబడ్డాయి అనిపిస్తుంది.


పులి వంటి కొన్ని జీవులను పరిశీలిస్తే ......పులి పిల్లలకు జన్మ ఇచ్చాక వెంటనే తన పిల్లలను తానే చంపుతుంది అని ఒక దగ్గర చదివానండి,. . . . . అలా చంపబడకుండా మిగిలిఉన్నవి జీవిస్తాయట.


లేకపొతే పులులవంటి బలమైనక్రూర జంతువుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతే మిగిలిన జీవులకు అపాయం కాబట్టి సృష్టిలో ఇలాంటి ఏర్పాటు జరిగిఉంటుంది అని కూడా చదివానండి.


యిలా ఏది ఎంతలో ఉండాలో అంతలో ఉండేలా దైవం ఏర్పాటు చేశారు.


ఇక్కడ మనకు ఒక సందేహం వస్తుంది . మరి మొక్కలు వంటి జీవులు విపరీతంగా పెరిగితే తప్పేమిటని ? మొక్కలు విపరీతంగా గుబురుగా పెరిగిపోతే వాటికి ఆహారసమస్య ఎదురవుతుంది. అంటే, వాటికి నేలనుండి అందే పోషకాలు సరిపోవు.

ఉదా...మన ఇళ్ళలో కూడా మొక్కలు ఏపుగా పెరగాలంటే మొక్కకుమొక్కకు నడుమ కొంచెం దూరంగా నాటాలి.


ఇంకా ప్రపంచంలో ఒకో ప్రదేశంలో ఒకోరకమైన వాతావరణం ఉంటుంది. ఆ వాతావరణానికి తగ్గట్టు జీవులు ఉంటాయి.

ఒకే దేశంలో కూడా రకరకాలుగా వాతావరణం మారుతుంటుంది.


ఒక ప్రదేశంలో పెరిగే మొక్కలకు వాటికి తగ్గ సహజ మిత్రులు, సహజ శత్రువులు ఉంటాయట.


అంటే మొక్కలు విపరీతంగా పెరిగిపోకుండా చీడపురుగుల వంటివి కూడా వస్తాయి. చీడపీడలు మరీ ఎక్కువయితే మొక్కలు పూర్తిగా అంతరించిపోతాయి.


( అప్పుడు ఇతర జీవులకు ఆహారసమస్య ఎదురవుతుంది.)అలా కాకుండా మొక్కలనాశించే చీడపురుగులను పట్టితినే పక్షులు ఉంటాయి.అలా మొక్కలకు తగు రక్షణ ఉంటుంది.

ఇలా సృష్టిలో ఒక క్రమం ఉంది. మనుషుల్లో కూడా జనాభా విపరీతంగా పెరగకుండా ప్రకృతిలో ఏర్పాట్లు ఉన్నాయి.


అయితే ఒక దగ్గర జీవించే మొక్కలను తీసుకెళ్ళి వేరొక ప్రాంతంలో నాటితే ........ అక్కడ వాటికి సహజ శత్రువులు , సహజ మిత్రులు లేక ....... ఆ జీవులు అంతరించిపోవటమో లేక విపరీతంగా వృద్ధి చెంది సమస్య రావటమో జరుగుతుందట.

అందుకే ఎక్కడివాటిని అక్కడే ఉంచటమే మంచిపద్ధతి.

అయితే జీవులు కూడా ఒక్కసారిగా పరిసరాలు, వాతావరణం మారినప్పుడు త్వరగా అలవాటుపడలేవు.

కొన్ని జీవులు ప్రపంచంలో ఎక్కడయినా జీవించే లక్షణాన్ని కలిగి ఉంటాయి. . .

కొన్ని అలా కాదు . ఉదా.... ఇప్పుడు మనం చూస్తున్న మిరపమొక్క విదేశాలనుంచి వచ్చిందంటారు. ( పూర్వం మనవాళ్ళు కారం కోసం మిరియాలు వాడేవారట. ) ఇప్పుడు మిరప భారతదేశంలో బాగానే పెరుగుతోంది .

అయితే దూరంగా ఉన్నా కూడా ప్రపంచంలోని వివిధ ప్రాంతాల్లోని వాతావరణంలో పోలికలు కనిపిస్తాయి .

అయితే యాపిల్ మొక్క వేడిగాఉండే ప్రాంతాలలో తెచ్చినాటితే ఏపుగా పెరగదు. చలిప్రాంతాల్లోనే బాగా పెరుగుతుంది. ఇలాంటి వాటిని వాటికి తగ్గ చల్లనివాతావరణం ( గ్లాస్ హౌస్ ) ఏర్పరిచి పండించటానికి ప్రయత్నిస్తున్నారు .


కోతులు ప్రపంచంలో చాలాచోట్ల ఉంటాయి. కానీ, ధ్రువపు ఎలుగుబంట్ల వంటి వాటిని వేడి ప్రదేశాల్లో పెంచలేము కదా!

ఇంకా నాకు అనిపిస్తుంది ఎక్కడి వారికి ఆ ప్రాంతంలో దొరికే ఆహారమే బలాన్ని కలిగిస్తుందేమో అనిపిస్తుంది. ఉదా...మనకు నిమ్మ, ఉసిరి వంటివి బాగా దొరుకుతాయి.

కానీ మనకు పొరుగింటిపుల్లకూర రుచి అన్నట్లు యాపిల్ పండే బలమని చాలామంది నమ్మకం.

20 రూపాయలు పెట్టి ఒక యాపిల్ కొంటారు గానీ, 2 రూపాయలు పెట్టి ఒక నిమ్మకాయ లేక ఒక ఉసిరి కాయ కొని రోజూ రసం తాగితే కావలసినంత 'సి ' విటమిన్ లభిస్తుంది.

అసలు నిమ్మ, ఉసిరిలో యాపిల్ కన్నా గొప్ప సుగుణాలు ఉన్నాయట.

అందుకే ఎక్కడి వాతావరణానికి తగ్గట్టు అక్కడ లభించే వాటిని ఎక్కువగా తినటం మరింత మంచిదేమోనని నాకు అనిపిస్తుంది.

కొన్ని పక్షులు వలస వస్తుంటాయి. కొంతకాలం గడిచాక తిరిగి తమదేశాలకు వెళ్ళిపోతుంటాయి. వాటికి పరిణామం చెందవలసిన అవసరం ఉండకపోవచ్చు.

కానీ , కొన్ని జీవులు తప్పనిసరి పరిస్థితిలో కొత్త వాతావరణంలో పరిసరాలలో జీవించవలసి వస్తుంది.

ఉదా.. ఒక మొక్కనో, జంతువునో వేరే ప్రదేశాలకు తీసుకెళ్తే వాటిజాతి తప్పనిసరిగా కొత్తప్రదేశానికి అనుగుణంగా నెమ్మదిగా పరిణామం చెందవలసి ఉంటుంది కదా ! ఇలాంటి సందర్భాలలో జీవులకు పరిణామలక్షణం అన్నది మంచిదే కదా!

ఈ రోజుల్లో మనుషులు అంతులేని కోరికలతో రకరకాల రసాయనాలు కనుక్కుని వాటితో (వాటి వ్యర్ధాలతో ) భూమిని, నీటిని, గాలిని పొల్యూట్ చేస్తున్నారు.


ఆ నీటిని త్రాగుతూ, ఆ భూమిలో పండిన పంటలను తింటూ, ఆ గాలిని పీలుస్తూ జీవులలో క్రమంగా బలం తగ్గిపోతోంది.


తీసుకునే ఆహారంలో బలం తగ్గిపోవటం, యంత్రాల వల్ల శారీరిక శ్రమ కూడా చాలావరకూ తగ్గిపోవటం వంటి అనేక కారణాల వల్ల ........ఈ రోజుల్లో మనుషుల్లో మధ్య వయసుకే కాళ్ళుకీళ్ళు నెప్పులు, నడుము నెప్పులవంటి లక్షణాలు చూస్తూనే ఉన్నాము కదా!

ఇక మాటలు రాని , తమ బాధ ఇదీ అని చెప్పుకోలేని మూగ జీవులు వాటి బాధలను ఎలా చెప్పుకుంటాయి ?

ఇంతగా పొల్యూట్ అయిపోయిన తరువాత జీవులు ఇక పరిణామం చెందటానికి కూడా అవకాశం ఉండదు. కొత్త మార్పులకు అనుగుణంగా పరిణామం చెందాలన్నా కొంతశక్తి కావాలి కదా !


విపరీతంగా పెరిగిపోయిన పొల్యూషన్ వంటి కారణాల వల్ల పిచ్చుకల వంటివి బాగా తగ్గిపోతున్నట్లు, మరి కొన్ని జీవజాతులు అంతరించే ప్రమాదం కూడా ఉందని కొందరు అంటున్నారు కదా !


ఇలాగే విజ్ఞానం పేరుతో విపరీతపోకడలు పోతూ ... జీవులన్నీ విలవిలలాడే స్థితికి వచ్చినప్పుడు .... దైవం చూస్తూ ఊరుకోరు కదా ! ఆ పరిస్థితి రాకుండా విజ్ఞులైనవారు మేలుకుంటే మంచిది..


ఇందులో చాలా విషయాలు పెద్దవాళ్ళు ,పిన్నలు, పండితులు, పామరులు ,... ద్వారా తెలుసుకున్నవి , పత్రికల్లో చదివినవేనండి. . అందరికి నా కృతజ్ఞతలు. అంతా దైవం దయ......దైవానికి కృతజ్ఞతలు.


Tuesday, November 22, 2011

పరిణామవాదాన్ని వేరొక కోణం నుండి పరిశీలిస్తే..... .. రెండవ భాగం.....

 

(Indian Minerva )

సీతగారూ మీ వ్యాఖ్యకు కృతజ్ఞతలండి..

కానీ, నాకు ... తెలుగంత బాగా ఇంగ్లీష్ రాదు. అందుకని తెలుగులో వ్యాఖ్య వ్రాస్తే బాగుండేది అనుకున్నాను.

అయితే,నాకు ఇంగ్లీష్ అంత బాగా రాదన్న విషయం మీకు తెలియదుకదా!

* పరిణామవాదానికి వీలులేకుండా..... దైవం మొదలే జీవులను పరిపూర్ణంగా సృష్టించవచ్చు కదా ! అని చాలా మంది సందేహం ...........

దైవం భూమిపై జీవుల్ని రరకాలుగా సృష్టించటం జరిగింది.

అయినా పిండ దశలో ఉన్నప్పుడు వివిధ జీవజాతుల పిండాల్లో ఆశ్చర్యకరమైన పోలికలు కనిపిస్తాయి.అని శాస్త్రవేత్తలు అంటున్నారట.

మానవులకు జ్ఞానాన్ని , ఎన్నో తెలివితేటల్ని ఇచ్చిన దైవం తలచుకుంటే మొక్కలకూ, జంతువులకూ కూడా ఇవన్నీ ఇవ్వగలరు.

* కానీ ఏ జీవులకు ఏ లక్షణాలను ఇస్తే సృష్టి సజావుగా సాగుతుందో దైవానికే తెలుసు.

* పరిణామ సిద్ధాంతం కూడా సృష్టికి ఆటంకం కలుగకుండా పరిమితమైన పరిధిలోనే జరుగుతుంది అనిపిస్తుంది.

ఉదా... మొక్కలు ..వాటికి మనుషుల్లాగా మాట్లాడటం ,నడవటం చేతకాదు.

దైవం మొక్కలకు మాటలు, నడక ఇచ్చినట్లయితే మానవులకు ఆహారం పొందటం చాలా కష్టమయ్యేది కదా..

మనం కాయలు, పువ్వులు తెంపుకునేటప్పుడు, వాటిని పీకి ఆకుకూరగా వండుకునేటప్పుడు .... అవి బాధపడితే లేక పోట్లాడితే .... మనం కాయలు, పండ్లు కోయగలమా ? వాటిని ఆహారంగా తీసుకోగలమా ?


............................

* పరిణామవాదానికి వీలులేకుండా..... దైవం మొదలే జీవులను పరిపూర్ణంగా సృష్టించవచ్చు కదా ! అని చాలా మంది సందేహం .

*. ఒక కుక్క పిల్లనో, కుందేలు పిల్లనో భారతదేశంలోని వేడిప్రాంతం నుంచీ విదేశాల్లోని చలిప్రాంతాలకు తీసుకువెళ్తే ......అక్కడి కొత్త వాతావరణానికి తట్టుకోవాలంటే శరీరం కొంత మార్పుకు అలవాటుపడాలి.

ఇలాంటప్పుడు దైవం జీవుల శరీరాలను ఎండకు, లేక చలికీ మాత్రమే తట్టుకునేటట్లు ముందే ఏర్పాటు చేస్తే జీవులకు కష్టమయిపోతుంది.

ఒకోసారి ఒకే దేశంలో కూడా వాతావరణంలో విపరీతమైన మార్పులు వస్తూంటాయి.

ఇలాంటప్పుడు దైవం జీవులకు పరిణామలక్షణం ఉండేలా ఇచ్చిన అవకాశం మంచిదే కదా !

అయితే
పరిణామ సిద్ధాంతం కూడా సృష్టికి ఆటంకం కలుగకుండా పరిమితమైన పరిధిలోనే జరుగుతుంది అనిపిస్తుంది.

ఉదా..నదిలో ఒకేరకమైన వాతావరణం ఉన్నప్పటికీ జీవులు ఆల్గే, కప్పలు, చేపలు ఇలా...... విభిన్న రూపాల్లో ఉంటాయి కానీ, ఒకే లక్షణాలు కలిగిన జీవుల్లా మారిపోవటం లేదు కదా !

.....................
దైవం మానవులను చక్కగా సృష్టించారు. కానీ పాపాత్ములయ్యేది, పుణ్యాత్ములయ్యేదీ వారికి అవకాశాన్ని కూడా ఇచ్చారు.

పుణ్యాలు చేస్తే ఉత్తమలోకాల్లో గొప్ప జన్మ లభిస్తుంది. పాపాలు చేస్తే నీచజన్మ లభిస్తుంది.

అలాగే జీవులకు కూడా పై తరగతి జీవులుగానూ, లేక క్రింద తరగతి జీవులుగానూ పరిణామాన్ని చెందేట్లుగా అవకాశాన్ని ఇచ్చారేమో ?

( అంటే ఇక్కడ పాపపుణ్యాలు అని కాకుండా వేరే పద్ధతిలో చూడాలి. అంటే పరిస్థితులు, అలవాట్లకు అనుగుణంగా పరిణామం చెందే విధంగా అని అర్ధం చేసుకోవాలి. )

పరిణామవాదం నిజమే అయితే ....ఈ వాదాన్ని గమనిస్తే నాకు ఇలా కూడా అనిపించింది.
.................

దైవం తన సృష్టి రచనలో భాగంగా . జీవులకు అవసరమైన వాతావరణాన్ని ఏర్పరిచారు. జీవులను సృష్టించారు.

* అయితే జీవనసమరంలో జీవుల ప్రయత్నాలకు గుర్తింపు, ప్రాముఖ్యత ఉంటుందని మనం తెలుసుకోవచ్చేమో !

* జీవులు ప్రయత్నిస్తే ఉన్నతస్థాయికి గానీ, అధమ స్థాయికి గానీ మారే అవకాశాన్ని దైవం కల్పించారు అనిపిస్తుంది.

అంటే కొందరు అనేటట్లు మనతలరాత.. మనం ఏం చేయగలం .. అని అనుకోకూడదనీ , జీవుల ప్రయత్నానికి కూడా ప్రాముఖ్యత ఉందని మనం అర్ధం చేసుకోవచ్చు.

లోకానికి మొక్కలు, వంటి జీవజాతులు చాలా సహాయపడుతున్నాయి.

* అవి కష్టపడకుండా , తమను తాము కాపాడుకోవటానికి వీలుగా అంటే పరిసరాలకు అనుగుణంగా పరిణామం చెందే అవకాశాన్ని దైవం కల్పించారేమో అనిపిస్తుంది.

........................
ఇంకా, 

* పరిణామవాదానికి వీలులేకుండా..... దైవం మొదలే జీవులను పరిపూర్ణంగా సృష్టించవచ్చు కదా ! అని చాలా మంది సందేహం .

* నిజమే కానీ ఈ భూలోకాన్ని జీవులకు పరీక్షాలోకం అనికూడా అనుకోవచ్చేమో !

( అయితే , ఆదిశక్తియైన పరమాత్మ యొక్క దయ ఉంటే , ఇహలోక భోగము ... పరలోకమోక్షము కూడా పొందవచ్చని పెద్దలు చెప్పటం జరిగింది.)

* పరిపూర్ణత్వమనేది పరమాత్మకే సాధ్యం.

జీవులు కూడా పరిపూర్ణత్వాన్ని పొందాలంటే పరమాత్మను పొందాలి. దానినే పెద్దలు మోక్షం అన్నారు.

భూలోకంలో ఎన్నో కష్టాలు ఉన్నాయి..ఒక ప్రాణిని బాధించి లేక చంపి ఆహారాన్ని పొందటం ద్వారా ఇంకొక ప్రాణి జీవించటం వంటి పద్ధతి ఈ లోకంలో ఉంది.

ఈ లోకాన్ని దైవం ఇలాగే సృష్టించారు.

( కొందరు మహాత్ములు సమాధి వంటి పద్ధతుల ద్వారా ఆహారం లేకుండా కూడా జీవిస్తారు. అది వేరే విషయం . )

* భూమి కన్నా పైన ఎన్నో ఉత్తమ లోకాలున్నాయి. అక్కడ పద్ధతి వేరేగా ఉంటుంది.

ఆహారం గురించి ఇతర జీవులపై ఆధారపడే పద్ధతి అక్కడ ఉండదు.

పుణ్యాత్ములు వెళ్ళే ఆ లోకాల్లో వారికి సంకల్పమాత్రం చేతనే ఆహారాన్ని సృష్టించుకోగల శక్తి ఉంటుంది. ( వారికి ఆహారంతో అవసరం కూడా ఉండదేమో ! . . )

* అలా జీవులు పరమాత్మను చేరుకుంటే మోక్షమనబడే .....ఏ
కష్టాలూ లేని పరిపూర్ణమైన పరమానందస్థితికి చేరుకుంటారు.


ఈ విధమైన చాలా విషయాలు " ఒక యోగి ఆత్మ కధ " గ్రంధంలో చెప్పబడ్డాయి.

* విజ్ఞానం, విశ్వవిజ్ఞానం కూడా ఆధ్యాత్మికతలో భాగమే.

......................

ఒక ఇంట్లో పెద్దవాళ్ళు బాగా చదువుకుని ఎన్నో విషయాలు తెలిసినా కూడా........ చిన్నపిల్లలకు అక్షరాలను దిద్దించటం నుంచే ప్రారంభిస్తారు గానీ, అన్నప్రాశననాడే ఆవకాయ సామెతలాగ చెయ్యరు గదా !

* అలాగే సృష్టి విధానం ఈ భూలోకంలో మాత్రం ఈ క్రమంలో జరుగుతుంది అనిపిస్తుంది. . ( పసితనం నుంచి వృద్ధాప్యం వచ్చినట్లుగా. )

...................
* అసలు ఇలా జీవులను సృష్టించటం ఇదంతా ఎందుకు ? అనుకుంటే ఇదంతా దైవానికి ఒక వినోదం అనుకోవచ్చేమో ..


ఉదా...మన ఇంట్లో పిల్లలకు ఆహారం అన్నీ అమర్చి ఇంట్లో కదలకుండా ఉండమంటే పిల్లలు వింటారా ? వినరు కదా !

బయటకెళ్ళి ఆడుకుంటాము.. అని పెద్దవాళ్ళను అడుగుతారు.

ఆటల్లో కొన్నిసార్లు దెబ్బలు తగులుతాయని తెలిసినా, ఒకోసారి ఓడిపోతామని తెలిసినా కూడా ఆడుకోవటానికే పిల్లలు ఉత్సాహ పడతారు.

* ఎంత బయట ఆడుకున్నా తిరిగి పిల్లలందరూ ఇంటికి వెళ్ళాలి కదా !

అలాగే లోకంలో జీవులు అందరూ కష్టాలనూ, సుఖాలనూ అనుభవించి ఈ జగన్నాటకమనే ఆట ముగించి తిరిగి ఇంటికి వెళ్ళవలసిన వారే. జగన్మాతాపితరుల్ని చేరుకోవలసిన వారే.


సరైన మార్గంలో నడిచిన పిల్లలు ఇంటికి త్వరగా చేరుకుంటారు. దారి తప్పిన పిల్లలు ఆలస్యంగా ఇంటికి చేరుకుంటారు....

ఇంటికి అంటే దైవం దగ్గరకు అన్నమాట. ( ఇలా నేను ఇంతకుముందు ఒక టపాలో వ్రాశానండి. . )

ఈ సృష్టి అనేది లేకపోతే విశ్వం స్తబ్దంగా బోర్ గా ఉండేది.....
............................

*..ఏంటో తోచినట్లు వ్రాశాను. వ్రాసినదానిలో పొరపాట్లు ఉంటే దైవం క్షమించాలని ప్రార్ధిస్తున్నాను. ఇందులో తప్పులు ఉంటే నావిగానూ, ఒప్పులు ఉంటే దైవం దయగానూ నేను భావిస్తున్నాను.......
అంతా దైవం దయ.

ఇదంతా పెద్ద వ్యాఖ్యగా రాయటం కుదరక ఇక్కడ పోస్ట్ చేయటం జరిగింది...


Monday, November 21, 2011

పరిణామవాదాన్ని వేరొక కోణం నుండి పరిశీలిస్తే..... ఒకటవ భాగం.....


డార్విన్ పరిణామవాదం గురించి చిన్నప్పుడు చదువుకున్నాను కానీ, ఇప్పుడు అంత గుర్తు లేదండి. .

పరిణామవాదం గురించి ఈ మధ్య శాస్త్ర విజ్ఞానం వారి బ్లాగులో చదివాక నాకు రకరకాల ఆలోచనలు వచ్చాయి.

నాకు శాస్త్రవేత్తలలా విషయపరిజ్ఞానం లేదు కానీ, కొన్ని ఆలోచనలు వచ్చాయి. చూసి తప్పుగా భావించవద్దండి.

పరిణామవాదం అంటే నాకు అర్ధమయింది ఏమంటే, జీవులు తమ అలవాట్లు, పరిసరాలకు అనుగుణంగా పరిణామాన్ని చెందే అవకాశం ఉందనీ,

ఉదా...మనిషి కోతి నుంచీ పరిణామాన్ని చెందిఉండవచ్చని ఇలాగ.........అన్నారు కదా.. నిజమే పరిణామసిద్ధాంత నిజమే కావచ్చు.

అయితే , దైవం యొక్క సృష్టిరచన అత్యద్భుతమైనది. వారు ఒక పద్ధతి ప్రకారం జీవులను సృష్టించారు.

ముందు జీవుల మనుగడకు, ఆహారానికి అవసరమైన పద్ధతిలో సూర్యుడు, వాతావరణం మొదలైనవి , సూర్యరశ్మి ద్వారా పత్రహరితాన్ని తయారుచేసుకునే మొక్కలు, మొక్కలపై ఆధారపడి జీవించే జంతువులు ఇలాగా ...........అన్నమాట.

ఇంకా,

ఒక నదిలో ఒకేరకమైన వాతావరణం ఉన్నా కూడా ఆల్గే, దాన్ని తినే చిన్న జీవులు, కప్పలు, చేపలు, చిన్నచేపలను తినే పెద్దచేపలు ఇలా ఒక ప్రణాళిక ప్రకారం సృష్టి ఏర్పడి ఉంది.

(నదిలో ఒకే రకమైన వాతావరణం ఉన్నా కూడా జీవులన్నీ ఒకే రకంగా మారిపోలేదు మరి. )

అలాగే జీవులకు పరిస్థితులను బట్టి పరిణామం చెందే అవకాశాన్ని కూడా దైవం కల్పించారేమో ? అని కూడా అనిపిస్తుంది.

ఇంకా ఏమనిపించిందంటే , ఉదా... కొందరి భావన ప్రకారం . జీవులలో పనికిమాలిన అవయవాలు అని చెప్పుకుంటున్నవి. పనికిమాలినవి కాదేమో ?

1...ఉదా...... కొన్ని పాములకి కాళ్ళు ఉంటాయి. పాకే పాములకి కాళ్లతో ఏం పని? బల్లులకి, మొసళ్లకి ఉన్నట్టే ఉంటాయి గాని నిజానికి ఆ కాళ్లు ఆ పాముల కదలికలో పాల్గొనవు. ఇలాంటి అంగాలనే వ్యర్థ అంగాలు అంటారు. అని కొందరి అభిప్రాయం.

కానీ, కొన్ని ప్రాకే జీవులకు కదలికలో కాళ్ళు కూడా సహాయపడతాయి. అలాగే పాములకు కూడా కాళ్ళు సహాయంగా ఉండటానికి వీలుగా పరిణామం జరుగుతోందేమో ?

( పాము కాళ్ళు వ్యర్ధ అవయవాలు కాదేమో ! )

2....అలాగే మోల్ అనబడే ఎలుకని పోలిన జంతువులకి చెందిన బ్లైండ్(గుడ్డి) మోల్ అనే ఉపజాతి ఒకటి ఉంది. ఇవి ఎక్కువగా కలుగుల్లో, చీకటి ప్రాంతాల్లో బతుకుతుంటాయి. వీటికి కళ్లు ఉంటాయి గాని అవి పని చెయ్యవు. వాటి మీదుగా ఓ చర్మపు పొర కప్పబడి ఉంటుంది. చూపు లేని ఈ జీవాలకి కళ్లెందుకు ? అని కొందరి అభిప్రాయం.

మోల్ అనే ( బ్లైండ్ )జంతువుకి కళ్ళెందుకు ? అనుకోకూడదు. వాటికి అవి నివసించే చీకటి ప్రాంతాల్లో కూడా చూడటానికి వీలుగా వాటికి కళ్ళు ఏర్పాటు జరుగుతోందేమో ? ( గుడ్లగూబలు చీకటిలో కూడా చూడగలవు కదా ! )

( కళ్ళు వ్యర్ధ
అవయవాలు కాదేమో ! )

3... అలాగే కోళ్ళకు రెక్కలెందుకు ? అని కాకుండా అవి నెమ్మదిగా పక్షుల్లా పైకి ఎగరటానికి సిద్ధమవుతున్నాయేమో ? అనుకోవచ్చు కదా ! ( కోళ్ళు పల్లెటూళ్ళలో ఇళ్ళ మధ్యన ఉండే అతి చిన్న కాలువలను ఎగిరి దాటుతుంటాయి. )

( కోడి రెక్కలు వ్యర్ధ అవయవాలు కాదేమో !)

అందుకే వీటిని వ్యర్ధ అవయవాలు అనుకోకూడదేమో ? అనిపించింది. దైవ సృష్టి తప్పకుండా ‘ప్రతిభతో కూడిన రూపకల్పనే. ’


౪... ఈ నాటి మానవులు అభివృద్ధి పేరుతో పనులన్నీ యంత్రాలకు అప్పజెప్పి తాము సుఖపడుతున్నామనే భ్రాంతిలో ఉన్నారు.


.ఈ నాటి మానవులు చాలామంది తమ శరీరాలకు అతిగా ఇచ్చిన విశ్రాంతి వల్ల  కొన్ని తరాల తర్వాత మానవుల కాళ్ళూచేతులూ బలహీనమయిపోతాయేమో ?

( పరిణామవాదం ప్రకారం చూస్తే .....)

కాలిక్యులేటర్లూ గట్రా అతిగా వాడటం వల్ల ఆలోచనాశక్తి, జ్ఞాపకశక్తి మందగిస్తాయేమో ?
.............. 
ఇంకా ఈ మధ్య మనుషుల్లో పెరిగిపోతున్న అజ్ఞానం, ఆటవిక ప్రవృత్తి చూస్తుంటే ,మానవులలో జంతువుల వలె  శారీరిక లక్షణాలు పెరుగుతున్నాయేమో ? ( కొందరిలో ) అనిపిస్తోంది.

ఉదా..మానవుల్లో వ్యర్ధభాగంగా భావిస్తున్న coccyx ( tail bone) గతకాలపు అవశేషం కాదేమో ?  తోక అవసరమయ్యే విధంగా శారీరిక పరిణామం చెందుతున్న లక్షణమేమో ? అనిపిస్తోంది.

................ 

టాన్సిల్స్ తీసివేసిన వారిలో రోగనిరోధక శక్తి తగ్గుతుందని కొందరు అంటున్నారు.    అయితే, ఈ రోజుల్లో కొందరు డాక్టర్లు రోగం వస్తే చాలు ఆ భాగం వేస్ట్ అంటూ కోసిపారేస్తున్నారు.

౫.... ఒక జీవి ఇంకొక జీవిగా మారటానికి ....... బోలెడుతరాలు అక్కర్లేని జీవులు కూడా సృష్టిలో ఉన్నాయి. ఉదా...సీతాకోకచిలుక.

దైవసృష్టి యొక్క గొప్పదనానికి గొప్ప ఉదాహరణ .........

* గగుర్పాటు కలిగించే గొంగళిపురుగు సమాధి స్థితి వంటి ప్యూపా దశ తరువాత అందమైన రంగురంగుల సీతాకోక చిలుకగా మారటం మనకు తెలుసు కదా !

దైవం ఏం చేసినా అందులో ఎన్నో అంతరార్ధాలు ఉంటాయి.


* దైవ సృష్టి ఎప్పుడూ గొప్పదే. " ఒక యోగి ఆత్మకధ "లో ఏం చెప్పారంటే........... సర్వార్ధ సాధకమైన అనంత సంకల్పంతో అనుసంధానం పొంది బాబాజీ , మూలక అణువుల్ని , సుసంయుక్తమైన ఏ రూపంలోనైనా సాక్షాత్కరించ వలసిందిగా ఆదేశించగలరు.....అలా చెప్పబడింది.

దైవం తలచుకుంటే దేనినైనా ఏ విధంగానైనా మార్చగలరు.

దైవం ఏం చేసినా అందులో ఎన్నో అంతరార్ధాలు ఉంటాయి.

* సృష్టి గొప్ప ప్రణాళిక ప్రకారం దైవం చేత సృష్టించబడింది. అయితే పరిణామవాదాన్ని గమనిస్తే. ,జీవులకు పరిణామం చెందే అవకాశం కూడా ఇవ్వబడిందని అనిపిస్తూంది.. దైవం యొక్క సృష్టి " ప్రతిభతో కూడిన రూపకల్పనే ".


Saturday, November 19, 2011

నేను నిన్న, మొన్న పాత పుస్తకాలు సర్దుతుంటే.......

నేను నిన్న, మొన్న పాత పుస్తకాలు సర్దుతుంటే.....

అంటే మా ఇంట్లో దగ్గరదగ్గర 10 సంవత్సరాల క్రిందటివి కొన్ని పత్రికలు, పుస్తకాలు ఉన్నాయి.

వాటిని
సర్దుతూ మధ్యమధ్య అందులో వ్రాసిన వంటలు, ఇంకా ఇతర ఆర్టికల్స్ చదువుతుంటే ఒక వ్యాసం కనిపించింది.

అది
" ఉత్పల " గారు వ్రాసిన " భగవన్నామం " అనే వ్యాసం.

అందులో
ఒక దగ్గర ఇలా ఉందండి............

శ్రీ
రాముని కంటే శ్రీ రామనామం గొప్పదన్నారు గోస్వామి తులసీదాసు. శ్రీ రాముడు తన అవతార సమయంలో ఎందరినో తరింపజేశాడు. నిజమే. ఎన్నో యుగాలు గడచినా శ్రీరామనామం భక్తుల్ని ఇప్పటికీ తరింపజేస్తున్నది కనుక రామనామమే గొప్పది. ..అంటూ వారు వ్రాయటం జరిగింది.

పుస్తకాలలోని పేజీలు గబగబా త్రిప్పుతూ వెళ్ళినా కూడా పుస్తకంలోని పేజీ మిస్సవకుండా కనిపించటం. నాకు ఎంతో ఆశ్చర్యాన్ని కలిగించింది.

మధ్యన బ్లాగుల్లో రాముడు గొప్పా ? రామనామం గొప్పదా ? అనే విషయంపై నేను కూడా అభిప్రాయాన్ని వ్రాయటంజరిగింది.

అందుకే
వ్యాసం నాకు కనిపించటం నాకు ఎంతో ఆశ్చర్యాన్ని కలిగించింది. అంతా దైవం దయ.
...............................

ఇంకా కొన్ని ఇతర రచనల గురించి కూడా చెప్పాలి.

" హిమయోగి " అనే రచనలో " ఒక యోగి ఆత్మకధ " లో చెప్పబడిన " బాబాజీ " వారి గురించి కొన్ని వివరాలను వివరించారు రచయిత.

ఇంకా, హిమాలయాల్లో నివసించే కొందరు యోగుల గురించి కూడా ఎన్నో విషయాలను చెప్పారు.

ఇంకా
రచయిత " అగ్నిసూర్య " అనే రచనలో జ్యోతిష శాస్త్రం గురించి కొన్ని విషయాలను చెప్పటం జరిగింది. రచయితపేరు. " సాత్విక్ ."

ఇంకా
ప్రొఫెసర్ ముదిగొండ శివప్రసాద్ గారు అందించిన " గుణాఢ్యుని బృహత్కధ " కూడా చాలా బాగుంది.
...........................

తెలుగులో
ఇంకా ఎన్నో గొప్ప రచనలున్నాయి. గొప్ప రచయితలు, రచయిత్రులు ఉన్నారు.

చాలామంది
ఇలా పుస్తకాలతో లైబ్రరీ ఏర్పాటు చేసుకుంటారు.

నా
దగ్గర ఎక్కువ పుస్తకాలు లేవు కానీ, పత్రికల్లో , పుస్తకాల్లో బాగున్నవి అనిపించిన ఆర్టికల్స్ ను కత్తిరించి దాస్తూఉంటాను.

అయితే
ఇప్పుడు అలా చేయటం బాగా తగ్గించానులెండి.

ఎందరో
ఎన్నో విషయాలను వ్రాస్తున్నారు. ఎంతో విజ్ఞానం ఉంది. . ఎంతకని సేకరించగలం అనిపిస్తోంది ?

అసలు
అతిగా విషయసేకరణ కూడా మనిషికి ఒక లంపటం అవుతుందేమో?

దైవభక్తి
విషయంలో తప్పించి ఇక విషయంలోనైనా అతి పనికిరాదు అని కూడా అనిపిస్తోంది.

విశ్వరహస్యాలను శోధించాలని అతిగా ఆరాటపడి ఆయాసపడి అలసిపోయే కన్నా అన్నింటికీ ఆదియైన  విశ్వాత్మనే (దైవాన్ని ) శరణు వేడితే ఉత్తమం కదా !

అప్పుడు అంతా వారే చూసుకుంటారు కదా !. అని కూడా అనిపిస్తోంది.....


Wednesday, November 16, 2011

నేను గృహిణిని ....

 

గృహిణి అంటే పని అంతగా ఏముంటుంది ? అనుకుంటారు చాలామంది.

నాకయితే పని ఎక్కువగానే ఉంటుంది. అంటే నేను అలా పని కల్పించుకుని బిజీగా ఉంటాను అన్నమాట. .


నాకు తోచినంతలో పూజ చేస్తాను.

వంట చేయటం, ఇల్లు సర్దుకోవటం, ఇవన్నీ ఎలాగూ ఉంటాయి.

ఇంట్లో పని అంటే పాత్రలు శుభ్రం చేయటం, బట్టలు ఉతకటం ఇవన్నీ కూడా నేనే చేస్తాను.

వాషిగ్ మెషీన్ ఉంది కానీ , అప్పుడప్పుడూ వాడుతాము అంతే. .


పనికి సాయంగా ఎవరినీ పెట్టుకోలేదు. గత మూడు సంవత్సరాలనుంచీ నేనే ఇంటిపని చేసుకుంటున్నాను. దానికి కారణాలు ఉన్నాయి లెండి.


వాళ్ళు వస్తారో రారో అని రోజూ ఎదురుచూడటం, వాళ్ళు వచ్చినా ఒక పూటే వస్తున్నారు ఈ రోజుల్లో .


మరి రాత్రి వంట చేసిన పాత్రలు నేనే శుభ్రం చేసుకోవాలి కదా ! .

ఒక పూట పనికోసం వాళ్ళు ఎందుకులే ! అని మానిపించేసాను.

ఇప్పుడయితే నేనే ఇంటి పనంతా చేస్తున్నానని ఇంట్లో వాళ్ళ వద్ద క్రెడిట్ పొందవచ్చు కదా !


ఎవరినైనా పనికి మాట్లాడుకోమని మా పెద్దవాళ్ళు కోప్పడుతుంటారు. . . . . విదేశాల్లో చాలామంది వారిపని వారే చేసుకుంటారట ! అని నేను వాళ్ళతో అంటాను.

అయినా ఎవరి పని వారు చేసుకుంటే తప్పేముందిలెండి.

నేను ఇంటి పని చేసుకోవటానికి ఇంకో కారణమేమిటంటే మా పెద్దవాళ్ళకి డయాబెటిస్ వ్యాధి ఉంది.

ఆ వ్యాధి వంశపారంపర్యంగా వచ్చే అవకాశాలున్నాయట. ఆ వ్యాధి వస్తే బోలెడు ఎక్సర్ సైజులు చేయాలట.

అలా జాగింగులు గట్రా చెయ్యటం నావల్ల కాదు.

అందుకని వ్యాధి రాకూడ
ని ముందు జాగ్రత్తగా ఇలా పని చేసుకుంటున్నాను . మన ప్రయత్నం మనం చేస్తే ఫలితం దైవాధీనం కదండి.


డయాబెటీస్ ఉన్నవారు రోజూ రెండు రాతిఉసిరికాయలు ( పచ్చివి ) మిక్సీలో రసం తీసుకుని ఉదయాన్నే త్రాగితే చాలా మంచిదట.


మా పెద్దవాళ్ళు ఇలాగే చేస్తుంటారు. ఆ వ్యాధి బాగా కంట్రోల్ అయింది. ( అంటే వ్యాధి ఇంకా పెరగలేదు. )

అసలు ఉసిరి కాయ చాలా వ్యాధులకు మంచిది.

ఇప్పుడు ఉసిరికాయలు బాగా దొరుకుతాయి, ఇప్పుడు ఎండబెట్టి ముక్కలు ,చేసి నిలవపెట్టుకోవచ్చు, పొడి, పచ్చడి చేసుకోవచ్చు.

కొందరు తేనెలో, పంచదారపాకంలో నిలువచేసుకుంటారు. ఉసిరితో చేసే చ్యవనప్రాశ ఎప్పుడూ దొరుకుతుంది.


*******
ఇంకా నాకు వార్తాపత్రికలు పుస్తకాలు చదవటమంటే చాలా ఇష్టం. .

వార్తాపత్రికలు చదవటమంటే చాలామందికి బోర్. కానీ నాకు చాలా ఇష్టం.

ఇలాంటి మంచి అలవాటు కలిగించినందుకు నేను దైవానికి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను.


పుస్తకపఠనం ఆసక్తి ఉన్నవారికి బోర్ అనే సమస్యే ఉండదు. సమయం చక్కగా గడిచిపోతుంది.

కొంతకాలం క్రిందట దైవం దయ వల్ల M. A ( చరిత్ర ) ప్రైవేటుగా చదివి పూర్తిచేశానండి.

ఇంకా ఈ మధ్యనే ఒక ఆమె వద్ద సంగీతం నేర్చుకోవటానికి వెళ్తున్నాను.

సంగీతం ఒక మహాసముద్రం. ఎంత నేర్చుకున్నా తరగదు.


సంగీతం సరిగ్గా నేర్చుకోవాలంటే చాలా శ్రద్ధగా నేర్చుకోవాలి. నాకు సమయం సరిపోక సరిగ్గా వెళ్ళటం లేదు.


ప్రస్తుతానికి వెళ్తున్నాను. ఎంతకాలం నేర్చుకుంటానో తెలియదు.

ఇక బ్లాగు మొదలుపెట్టాక ఇంకా బిజీ అయిపోయింది. మరి అందరూ ఎలా వ్రాస్తున్నారో తెలియదు.


నేను పని త్వరగానే చేస్తాను. అయినా ఎంత చేసినా సమయం సరిపోవటం లేదండి.

అయినా నేను ఇలా బ్లాగు వ్రాయటం ఏమిటో తలుచుకుంటే అత్యంత ఆశ్చర్యంగా ఉంటుంది నాకు.

ఇది దైవం వేసిన భిక్షగా అనుకుంటున్నాను నేను.

ఒక సంవత్సరం కన్నా వ్రాయగలనా ? అనుకున్నాను. ఇంకా వ్రాస్తున్నాను మరి.

బ్లాగుల్లో అందరూ ఎంతో విషయపరిజ్ఞానం కలిగినవారుంటారు. నేను ఏం వ్రాయగలను ? అని భయపడ్డాను.


ఏదో దైవం దయవల్ల నాకు తెలిసినంతలో వ్రాస్తున్నానండి. ఆదరిస్తున్న మీ అందరికీ కృతజ్ఞతలు, .


నేను గృహిణిని అయినా కూడా ఇంటిపనీ, సంగీతం క్లాసులు, బ్లాగులు చూడటం, పత్రికలు చదవటం , టివీలో కొన్ని ప్రోగ్రాములు చూడటం ఇలా చాలా బిజీ అన్నమాట.....

అంతా దైవం దయ.



Monday, November 14, 2011

విపరీతమైన రద్దీ సమయాల్లో దైవ దర్శనం.... ...

క్రితం సోమవారం ప్రసిద్ధ దేవాలయానికి వెళ్ళాము కదండి. అబ్బో విపరీతమైన రద్దీగా ఉంది.

దేవాలయాల్లో ధర్మదర్శనంతో పాటూ , 100 , 200 రూ... ఇలా టికెట్ దర్శనాలు కూడా ఉంటాయి కదా !

ఇలా టికెట్ కొని దైవదర్శనం చేసుకోవటం అనే విషయంలో రకరకాల అభిప్రాయాలు ఉన్నాయి.

దేవుని దగ్గర అందరూ సమానమే కదా ! ఇలాంటి సిస్టం ఎందుకు ? అని కూడా అనిపిస్తుంది. అయితే , మేము కూడా ఇలా టికెట్ కొని వెళ్ళవలసి వచ్చింది

. ధర్మదర్శనానికి, టికెట్ కొన్న వారికి వేరువేరు క్యూలైన్స్ ఉన్నాయి. మేము వెళ్ళి క్యూలో నిలుచున్నాము.

అప్పటికి ఎంతోసేపట్నించీ దర్శనాలు ఆపేసారట.

కొందరు చెప్పటమేమంటే ఎవరో వీఐపీలు వచ్చారట. అందుకే సామాన్యభక్తులకు దర్శనాలు ఆపేసారని చెప్పుకుంటున్నారు.

ప్రక్క క్యూలైన్లో వాళ్ళు ఉదయం 2 గంటల నుంచీ లైన్లోనే ఉన్నారట చిన్నపిల్లలతో సహా. దాంతో వారు నీరసంతో వచ్చే విసుగుతో ఉండటం సహజమే కదా ! .
ఇంతలో మేము ఉన్న క్యూలైన్లోని వారిని దర్శనానికి వదిలారు.

ఇది చూసి అప్పటికే ఉదయం నుంచీ వేచి ఉన్న ధర్మదర్శనం భక్తులు ఇది అన్యాయం. అని డబ్బు పెట్టి టికెట్ కొన్నవారికే దైవ దర్శనమా ? అని అనటం జరిగింది.

వాళ్ళు అన్నది న్యాయమే కదా ! ఇదంతా చూసి నాకు సిగ్గనిపించింది.

మేము పెద్దగా వెయిట్ చేయకుండానే ముందుకు వెళ్ళటం న్యాయం కాదు అనిపించింది.

నేను నా భర్తతో అన్నాను. మనం ఇప్పుడేకదా వచ్చాము . కొంచెంసేపు అయ్యాక వెళ్ళొచ్చు కదా ! అన్నాను.


కానీ, క్యూలో కొచ్చాక మనం ఏం చేయగలం ? ఈ బుద్ధి ముందే ఉండాలి మాకు అని కూడా నాకు అనిపించింది. . నేను ఇదంతా ఊహించలేదు.

టికెట్ కొని వెళ్ళేవారి క్యూ కూడా బాగా రద్దీగా ఉంది.

ఇది ఇలా జరుగుతుండగానే క్యూ కదలటం జరిగింది. ,

ఈ లోపు మావాళ్ళు ఆ జనంలో ముందుకు వెళ్ళ్తూ నన్ను , మా అమ్మాయిని కూడా త్వరగా వాళ్ళ వెనకే రమ్మంటున్నారు.

ఒక ప్రక్క ధర్మదర్శనం వారి కష్టాలు విన్నాక . ఈ తోపుళ్ళు ఇదంతా చూశాక నాకు కొంచెం సేపు అయ్యాక వెళ్ళొచ్చులే అని అనిపించింది.

నేను మా అమ్మాయి అక్కడ క్యూలో ప్రక్కన నిలుచుండిపోయాము.

.మా వాళ్ళేమో మమ్మల్ని త్వరగా రమ్మని పిలుపులు. తొందరేముందని నేను.......

ఇంతలో దేవుని దయవల్ల మా ప్రక్క వారి క్యూలైన్ కూడా కదిలింది.

రెండు క్యూలైన్లలో వారినీ కూడా దర్శనానికి అనుమతించాలని దేవాలయ సిబ్బంది నిర్ణయించారట.

పాపం ! ఎప్పటినుంచో వేచిఉన్న మా ప్రక్కన క్యూలైన్ వారికి కూడా ఉత్సాహం వచ్చింది.

వారు కూడా ఆనందంగా దర్శనానికి వెళ్ళటం చూసాక నాకు ఆనందం కలిగింది.

మేము కూడా దైవదర్శనం చేసుకున్నాము.

క్యూలైన్లలో ఈ తోపుళ్ళు , ఇదంతా జరిగాక అక్కడ భక్తులకు దైవం సర్వాంతర్యామి కదా ! అన్న విషయం బాగా గుర్తుకు వచ్చింది.

మన ఇంట్లో దేవుని పూజ ప్రశాంతంగా చేసుకున్నా దైవం కరుణిస్తారు కదా ! ......అనీ ...

ఇంత రద్దీలో కాకుండా .మన ఊళ్ళో దేవాలయంలో పూజ చేయించుకున్నా దైవం కరుణించరా ఏమిటి ..... వంటి అభిప్రాయాలు భక్తులు చెప్పటం జరిగింది.

కొందరు ఏమన్నారంటే , వీఐపీలను తెల్లవాఝామున మాత్రమే పూజలకు అనుమతిస్తే బాగుంటుంది. సాధారణ భక్తులకు ఇబ్బందులు ఉండవు అన్నారు .

ఇది నిజమే . నాది కూడా ఇదే అభిప్రాయం.

( అసలు సామాన్య ప్రజల దగ్గర మంచి ఐడియాలు ఉంటాయి. వాళ్ళకు అనుభవజ్ఞానం ఎక్కువకదా ! )

అసలు టికెట్ పద్ధతి లేకుండా అందరికీ ఒకటే దర్శనం అన్నది బాగుంటుంది అనిపిస్తుంది, .

కానీ, కొన్ని సందర్భాలలో , కొందరు వ్యక్తుల విషయంలో టికెట్ అవసరమేమో అనిపిస్తుంది.

ధర్మదర్శనంలో వెళ్ళేవారికీ ....... టికెటి కొని త్వరగా దర్శనం చేసుకునేవారికీ .......వచ్చే పుణ్యంలో ఏమన్నా తేడా ఉంటుందా ఉంటుందా ? అనే ధర్మ సందేహం కూడా వచ్చింది నాకు.

ఈ ధర్మ సందేహం తీరాలంటే పరిస్థితిని ఎన్నో కోణాలనుండీ విశ్లేషిస్తే మాత్రమే సరైన సమాధానం లభిస్తుంది. ప్రతి వ్యక్తి పరిస్థితిని ఆలోచించి విశ్లేషించవలసి వస్తుంది.

సరే, రద్దీ రోజుల్లో దేవాలయాలకు వెళ్ళాలనుకునే వారు గమనించవలసిన విషయం ఏమిటంటే,

మామూలు రోజుల్లోలాగ ప్రశాంతంగా దైవదర్శనం కుదరకపోవచ్చు అన్నది ..

తిరువణ్ణామలైలో కార్తీక దీపం సందర్భంగా విపరీతమైన రద్దీ ఉంటుంది.

ఒకసారి మేము ఏం చేశామంటే విపరీతమైన రద్దీ వల్ల దేవాలయంలో మూలదైవం యొక్క దర్శనం కష్టమని భావించి దర్శించుకోలేదు.

తిరువణ్ణామలై గిరిప్రదక్షిణ మాత్రం చేసి తృప్తి చెందాము.

...........................................................

ప్రజల అభిప్రాయాలు గమనించాక నాకు ఏమనిపిస్తుందంటే,

పండుగ రోజుల్లో , ఉదయం సమయంలో మాత్రమే వీఐపీలు పూజలు చేసుకుంటే వారూ ప్రశాంతంగా పూజ చేసుకోవచ్చు. సామాన్య భక్తులకూ ఇబ్బంది లేకుండా ఉంటుంది.

ఇంకా ,

టికెట్ కొనుక్కున్న వారిని ముందు పంపించి ధర్మదర్శనం భక్తులను ఆపివేయటం అన్యాయం. ఇద్దరినీ ఒకేసారి అనుమతించటం బాగుంటుంది.అనీ,

ఇంకా,

ఆపవలసివస్తే కొంచెంసేపు టికెట్ కొనుక్కున్న భక్తులనే ఆపాలి గాని .... ధర్మదర్శనం భక్తులను ఆపకూడదు అనీ అనిపించింది.

అసలు టికెట్ పద్ధతి లేకుండా అందరికీ ఒకటే దర్శనం అన్నది బాగుంటుంది.

ఇంకా,

రద్దీ సమయాల్లో కొన్ని చోట్ల ప్రమాదాలు జరిగి భక్తులు ప్రమాదాలకు గురి అయిన సంఘటనలు కూడా కొన్ని జరిగాయి కదా !

ఇలాంటివి జరగకుండా ఉండాలంటే భక్తులూ, దేవాలయాల సిబ్బందీ కూడా ఎన్నో జాగ్రత్తలు తీసుకోవలసి ఉంటుంది.

ఇంకా,

కొన్ని సార్లు కొందరు భక్తులు కూడా , ఎంత రద్దీగా ఉన్నా సరే, ఎలాగోలా ప్రయత్నించి ఒకేరోజు మూడు, నాలుగు సార్లు దర్శనం చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు.

అలా ఎక్కువసార్లు దర్శనం చేసుకుంటే గొప్ప అనుకుంటారు.

ఒక్కసారి దర్శనం చేసుకున్నా దైవ కృప లభిస్తుంది. ఇతరులకు అవకాశాన్నీ ఇచ్చినట్లు అవుతుంది.

ఇంకా,

కొందరికి వెళ్ళవలసిన ట్రైన్ సమయం మించిపోతుందనో, అనారోగ్య సమస్యలు వంటి కారణాల వల్ల ఇలా టికెట్ కొని శీఘ్రంగా దర్శించుకౌంటారు.

అయితే ఇలాంటి సమస్యలు పేదవారికి కూడా ఉంటాయి. కానీ వారు అంత డబ్బుపెట్టే తాహతు లేక సర్దుకుపోతుంటారు.

ఏమైనా సాధ్యమైనంత వరకూ ధర్మదర్శనమే మంచిది అనిపిస్తుంది.

ఏమైనా పండుగల వంటి రద్దీ రోజుల్లో ప్రసిద్ధ పుణ్య క్షేత్రాలకు వెళ్ళాలంటే చాలా విషయాలు ఆలోచించుకోవాలి అనిపిస్తోంది.

జీవితంలో జరిగే కొన్ని సంఘటనల ద్వారా మనకు ఆలోచనలలో మార్పు వస్తుంటుంది... ...

 

Friday, November 11, 2011

క్రితం సోమవారం జరిగిన ఒక సంఘటన....


మేము క్రితం సోమవారం ఒక ప్రసిద్ధ పుణ్యక్షేత్రానికి వెళ్ళాము. ఇలాంటి చోట్ల ప్రశాంతంగా దైవదర్శనం జరగాలంటే పండుగల రోజుల్లో కాకుండా మామూలు రోజుల్లోనే వెళితే బాగుంటుంది.

సరే వెళ్ళాము . దైవ దర్శనం చేసుకుని తిరుగు ప్రయాణమయ్యాము.

కొంత దూరం వెళ్ళాక , ఏ.టి.ఎం వద్దకు వెళ్ళి ఇప్పుడే వస్తానని నా భర్త రోడ్డు పక్కన కారు పార్క్ చేసి వెళ్ళటం జరిగింది.

అక్కడే అరుగు మీద కూర్చున్న ఒక వ్యక్తి కారు టైరులో గాలి తగ్గిందని గమనించి మాకు చెప్పటం జరిగింది.

అప్పటికే సాయంత్రం అవుతోంది. ఇలా జరిగిందేమిటి ? అని విచారిస్తున్నంతలో , నా భర్త తిరిగి వచ్చారు.

పరీక్షిస్తే టైరు పంచర్ కూడా జరిగిందని తెలిసింది.

అక్కడున్న వారిని మెకానిక్ ఎక్కడ ఉంటారని అడగగా కొంచెం దూరంలో ఉంటారని చెప్పారు.

ప్రక్కనే ఉన్న వేరొక కారు డ్రైవర్ సహాయంతో టైరు మార్చటం జరిగింది.

( దైవం దయ వల్ల టైరు ప్రాబ్లం ఊరు దాటక ముందే ఎదురయ్యింది. ఊరు దాటినతరువాత వస్తే ? ఎంతో కష్టమయ్యేది కదా !. అంతా దైవం దయ. అనుకున్నాము. )

టైరు మార్చటం జరుగుతుంటే నేను కారు దిగి బయట నుంచుని చుట్టూ చూస్తుంటే అక్కడున్న వారు కొందరు ఏదో చూస్తున్నారు.

ఏమిటా ? అని నేనూ చూశాను. ఒక చిన్న పాప ఏడుస్తూ నడిచి వెళ్తోంది. పాపం తప్పిపోయింది అనుకుంటున్నారు.

పాప అలా నడిచి వెళ్తూ ఉంది.

నేను ఆ పాప దగ్గరకు వెళ్ళి నీ పేరు ఏమిటి ? అని వివరాలు అడిగితే ఆ పాప ఏడవటం తప్పా ఏమీ చెప్ప లేదు.

నాకు ఏం చేయాలో అర్ధం కాలేదు. అప్పుడు ఆ పాపను ఎత్తుకుని అక్కడకు కొంచెం దూరంలో ఉన్న పోలీసు వారి దగ్గరకు వెళ్ళి ఈ విషయం చెప్పాను.

ఆ పోలీసులు ఏమన్నారంటే, గుడికి ఎదురుగా తప్పిపోయిన వారిని అప్పగించే కేంద్రం ఉంది అక్కడ అప్పగిస్తారా ? అన్నారు.

( ఉదయం నుంచీ జనం రద్దీ వల్ల వాళ్ళూ బాగా అలసటగా కనిపించారు. పాపం వాళ్ళూ ఎంతకని చేయగలరు. )

నేను, ఆ పాపను ఎత్తుకుని వెళ్తుంటే , ఇదంతా చూస్తున్న ఒకతను నా వద్దకు వచ్చి గుడి కొంచెం దూరంగా ఉంది కదా ! నేను అప్పగిస్తాను అన్నాడు.

నాకు ఇవ్వాలనిపించక మా అబ్బాయిని తోడు తీసుకుని గుడి దగ్గరకు వెళ్ళాను.

( అప్పటికి నడిచి కాళ్ళు నెప్పులుగా ఉన్నాయేమో ఎత్తుకున్న తరువాత పాప ఏడవలేదు. )

గుడి వద్దకు చేరుకుని తప్పిపోయినవారిని అప్పగించే ప్రదేశం ఎక్కడ ఉందా ? అని వెతికాము. మాకు కనిపించలేదు.

చుట్టుప్రక్కల వారిని అడిగితే, కొందరు ఇటువెళ్ళండి అన్నారు. కొందరు అటు వెళ్ళండి అన్నారు.

మేము అలా వెతుకుతుండగా ఒక భార్యా భర్తా హడావుడిగా మా వద్దకు వచ్చారు.

గ్రామీణుల్లా ఉన్నారు . వారి వద్ద చంటి వయస్సు గల ఒక బిడ్డ , కొద్దిగా పెద్ద వయస్సు గల ఇంకొక బిడ్డ ఉన్నారు.

వారు నా దగ్గరున్న పాపను వాళ్ళమ్మాయి అని చెప్పి ,పాపకేసి చేయి చాపారు.

పాప కూడా వారిని చూడగానే తల్లి చేయి చాపగానే నవ్వు ముఖంతో తల్లి వద్దకు వెళ్ళింది.

( ఆ పెద్దవాళ్ళు కొద్దిగా ఏడుస్తున్నారు కూడా . )పాపను తీసుకుని కళ్ళనీళ్ళతో నాకు నమస్కరించి కృతజ్ఞతలు చెప్పటం కూడా జరిగింది.

అయినా నాకు కొంచెం అనుమానాలు ఎక్కువ కదా !

వీళ్ళు ఆ పాప తల్లిదండ్రులేనని ఏమిటి నమ్మకం ? అని అనుమానం వచ్చి పాపను అడిగాను. ( ఈ మాత్రం ఆలోచన రావటం దైవం దయే. )

వీళ్ళు ఎవరు ? నీకు తెలుసా ? అని అలా అడిగాను.

కానీ ,ఆ పాప ఏమీ చెప్పలేదు. కానీ, తల్లి ఎత్తుకునే సమయంలో నేను ఆ పాప ఫీలింగ్స్ గమనించాను.

పాప కొత్త లేకుండా గబుక్కున వారి వద్దకు వెళ్ళింది.

ఇదంతా చుట్టూ కూర్చున్న జనం చూస్తూనే ఉన్నారు. వాళ్ళకు విషయం అర్ధమయిందో లేదో తెలియదు. ఇదంతా చాలా త్వరగా జరిగిపోయింది.

ఇక నేనూ, మా అబ్బాయి ఎంతో సంతోషంగా తిరిగి కారు వద్దకు వస్తుంటే ,కొంచెం దూరం వెళ్ళాక నాకు ఏమనిపించిందంటే ,

తప్పిపోయినవారిని అప్పగించే ప్రదేశం వద్దకు వెళ్ళి ... అక్కడ ఈ పాపను వారి తల్లిదండ్రులకు అప్పగిస్తే మరింత బాగుండేది కదా ! అనిపించింది.

వెంటనే తిరిగి వచ్చాము. చూస్తే అక్కడెవరూ లేరు.

అంతకుముందు అక్కడున్న వారికి ఈ కధంతా చెప్పి మేము వెళ్ళిన తరువాత ఆ తల్లిదండ్రుల ప్రవర్తన ఎలాగుంది ? అని అడిగాను.

వారు ఏమన్నారంటే , పాప వారి వద్దకు బాగానే వెళ్ళింది కదండీ . తల్లిదండ్రులే అయ్యుంటారు. అన్నారు.

నేను అన్నాను.... పాప నా దగ్గరకు కూడా వచ్చింది కదా ? అన్నాను.

చుట్టుప్రక్కల వాళ్ళు ఇంకా ఇలా అన్నారు..... వాళ్ళు ఆ పాప తల్లిదండ్రులు లాగానే ఉన్నారులెండి. అన్నారు.

ఇక చేసేదేమీ లేక, తిరిగి కారు వద్దకు వచ్చేసి జరిగింది నా భర్తకు, మా అమ్మాయికి, ఇంకా అక్కడివారికి చెప్పాను.

తరువాత ,ఎందుకయినా మంచిదని మెకానిక్ వద్దకు వెళ్ళి కారు రిపేరు చేయించాము.

మళ్ళీ ఎక్కడన్నా టైరు
పంచర్ సమస్య వస్తుందేమోనని భయపడ్డాము కానీ, ఆ సమస్య రాలేదు. దైవం దయవల్ల క్షేమంగా ఇంటికి తిరిగి చేరుకున్నాము.

ఆ పాప తల్లిదండ్రి వద్దకు చేరిందని సంతోషంగానే ఉన్నా కూడా , తప్పిపోయినవారిని అప్పగించే కేంద్రం వెతికి అక్కడ ఈ అప్పగింతలు జరిగితే మరింత చక్కగా ఉండేది కదా ! అనుమానం లేకుండా . అనిపించింది.

ఏం చెయ్యను. నాకు అప్పుడు అంతకన్నా తోచలేదు మరి . ఇక దైవం దయ అంతే.

జీవితంలో ఒకోసారి మనకు ఇలా అనిపిస్తుంటుంది కదా ! . అరే ! అప్పుడు ఇలా కాకుండా ఇంకోలా చేసి ఉంటే బాగుండేది కదా ! అని.

* అందుకే మన తెలివితేటలు ఎంతో గోప్పవి అని మనం ఎప్పుడూ అనుకోకూడదు.

* మనల్ని సరైన దారిలో నడిపించమని దైవాన్ని ప్రార్ధించటమే తెలివైన వాళ్ళు చేయవలసిన పని.

జీవితంలో మనకు కూడా ఆపదలో సహాయం చేసేవారు ఎందరో ఎదురవుతారు.

ఉదా..కారు సమస్య వచ్చినప్పుడు అపరిచితులైన డ్రైవరు, మెకానిక్ సహాయపడటం వంటివి, ఇలా ఎందరో అపరిచితులు మనకు కూడా సహాయపడుతుంటారు.

ఇతరులకు సాయం చేయటంలో నా స్వార్ధం కూడా ఉందిలెండి. ఇతరులకు సాయం చేస్తే మనకు మంచి జరుగుతుంది అని పెద్దలు చెప్పారు కదా !

అంతా దైవం దయ....



Wednesday, November 9, 2011

ఒకప్పుడు త్రిమూర్తులు సుధాసముద్రంలో గల ఆదిపరాశక్తిని( పరమాత్మను ) దర్శించి స్తుతించారు.

* ఓం.

* ఒకప్పుడు త్రిమూర్తులు సుధాసముద్రంలో గల ఆదిపరాశక్తిని( పరమాత్మను ) దర్శించి స్తుతించారు.

వారు
అక్కడకు వెళ్ళే దారిలో ఎన్నో బ్రహ్మాండాలనూ, అక్కడ కూడా ఎందరో త్రిమూర్తులను దర్శించి ఆశ్చర్యపోతారు.

* బ్రహ్మదేవుడు ఆదిశక్తిని స్తుతించి కొన్ని సందేహాలను కూడా అడగటం జరిగింది. .అందులో కొంత భాగం...

.......ఏకమేవాద్వితీయంబ్రహ్మ అనికదా వేదాలు చెబుతున్నాయి. అది నువ్వా, లేక నీ విభుడైనపరాత్పరమహాపురుషుడా ?....అని,

ఇంకా ఎన్నో విషయాలను అడగటం జరిగింది.

* అప్పుడు
, ఆదిపరాశక్తి ..ఎన్నోవిషయాలను బ్రహ్మదేవునికి చెప్పటం జరిగింది. అందులో కొంతభాగం.......

.....చతుర్ముఖా ! నాకూ నా పురుషుడికీ భేదం లేదు. ఎప్పుడూ ఏకత్వమే. అతడే నేను. నేనే అతడు. భేదం మతివిభ్రమం..అంటూ

ఇంకా
ఇలా చెప్పటం జరిగింది..దేవతలలో కూడా రకరకాల పేర్లతో నేనే ఉంటాను.శక్తి రూపంలో ఉంటాను...అని,

ఇంకా
ఇలా చెప్పటం జరిగింది..నీళ్ళలోని చల్లదనం, అగ్నిలోని వెచ్చదనం, సూర్యుడిలోని జ్యోతిస్సు, చంద్రుడిలోనిమంచు- నేనే. అవసరాన్ని బట్టి ఏది కావాలంటే అది అవుతాను.

నేను లేనిది - ఏదీ స్పందించదు. శంకరుడైనా సరే నేనువదిలేస్తే రాక్షసుల్ని సంహరించలేడు. దుర్బలుడై పోతాడు.

లోకంలో
దుర్బలుడికి పర్యాయపదం ఏమిటి ? శక్తిహీనుడు అనే కదా ! రుద్రహీనుడు, విష్ణుహీనుడు అని ఎవరైనా అంటారా ? శక్తిహీనుడు అని మాత్రమే అంటారు...అని ,

ఇంకా చాలా విషయాలను చెప్పటం జరిగింది.

* ఆదిపరాశక్తి, విష్ణుమూర్తికి ఎన్నో విషయాలను తెలియజేయటం జరిగింది........

అందులో కొద్ది భాగం...

.....నా విహారాన్ని ముగించి విశ్వాన్ని ఉపసంహరించేటప్పుడు మాత్రం మీరు ముగ్గురూ కూడా నాలో లీనమైపోతారు. ...అని ఇంకా చాలా విషయాలను చెప్పటం జరిగింది.

* ఆదిపరాశక్తి శివునికి చాలా విషయాలను చెప్పటం జరిగింది..

తరువాత, శివునితో ఇలా కూడా అనటం జరిగింది....మీమీ కార్యాలు నిర్వహించండి. విషమపరిస్థితి ఏదైనాఎదురైనప్పుడు నన్ను స్మరించండి. స్మరణ మాత్రం చేతనే నేను మీకు దర్శనం అనుగ్రహిస్తాను. అలాగే సనాతనుడైనపరమాత్మను కూడా తలుచుకోండి. మా ఇద్దరినీ తలుచుకుంటే మీకు కార్యసిద్ధి నిస్సంశయంగా కలుగుతుంది. అనిచెప్పటం జరిగింది.

...............................

* ఒకప్పుడు మధుకైటభులు అనే రాక్షసులు బ్రహ్మదేవుని , విష్ణుమూర్తిని ఇబ్బందిపెట్టగా ఆదిశక్తి సహాయంతో విష్ణుమూర్తి రాక్షసులను సంహరించగలిగారన్నది తెలిసిన విషయమే.

* ఇంకొకసారి దుర్గముడనే రాక్షసుని వల్ల ఇబ్బందులు ఎదురైనప్పుడు ఆదిపరాశక్తి రాక్షసుడిని కూడా సంహరించటంజరిగింది. సందర్భంలో శక్తిని శతాక్షి ( శాకంభరి ) , దుర్గ అని దేవతలు కీర్తించారు.

* ఒకప్పుడు మహిషాసురుడు వరగర్వంతో విర్రవీగుతూ లోకాలని పీడిస్తుంటే ఎవరూ మహిషాసురుని సంహరించలేకపోతారు.

అప్పుడు
విష్ణుమూర్తి సలహాతో దేవతలందరూ తమలోని తేజోంశలను స్త్రీ మూర్తులుగా అభ్యర్ధిస్తూ ప్రార్ధిస్తారు. అప్పుడుసకల దేవతాంశలనూ తేజశ్శక్తులను కలబోసుకుని ఒక స్త్రీమూర్తి ఆవిర్భవించటం జరుగుతుంది.

ఆమె మహిషాసురుని సంహరించటం జరిగింది.
ఆమే మహిషాసురమర్దని.
...................................................

* లలితా సహస్రనామాలలోని కొన్ని నామములు..............

శ్రీ మాతా
కామేశ్వర ప్రేమ రత్న మణి ప్రతి పణస్తనీ
చింతామణి గృహాంతస్థా
మహా గణేశ నిర్భిన్న విఘ్నయంత్ర ప్రహర్షితా
బ్రహ్మోపేంద్ర మహేంద్రాది దేవ సంస్తుత వైభవా
నిరాకారా
దుర్గా
మహాలక్ష్మీ
పార్వతీ
సృష్టికర్త్రీ
బ్రహ్మరూపా
గోవిందరూపిణీ
రుద్రరూపా
హరిబ్రహ్మేంద్ర సేవితా
రామా
వివిధాకారా
గాయత్రీ
పరాశక్తిః

అనేక కోటి బ్రహ్మాండ జననీ దివ్యవిగ్రహా
ఉమా
గౌరీ
రాజరాజేశ్వరీ
సరస్వతీ
బ్రహ్మజననీ
మూలవిగ్రహరూపిణీ
వైష్ణవీ
విశ్వమాతా
శాశ్వతీ
అనఘ
శివశక్త్యైక్య రూపిణీ
నామాలను గమనిస్తే చాలా విషయాలు తెలుస్తాయి..
....................................
* ఆదిపరాశక్తిపరమాత్మకు అనేక నమస్కారములు.
...................................

* నాకు తెలిసిన విషయాలు చాలా తక్కువ. తోచినట్లు వ్రాస్తున్నాను.
ఇందులో ఏమైనా అచ్చుతప్పులు గానీ, ఇతరత్రా ఏవైనా పొరపాట్లు ఉన్నచో దైవం దయచేసి క్షమించాలని పార్ధిస్తున్నాను. అంతా దైవం దయ......

ఇంకో విషయం..ఈ మధ్య ఒకాయన ( స్వామి.......) అమర్ నాధ్ యాత్ర గురించి అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశారట, ఎవరు ఏమన్నా అమర్ నాధ్ యాత్ర , అక్కడి దైవము ఎంతో గొప్ప....


Friday, November 4, 2011

ఏ కష్టాలైనా ఇలా తాగి పడిపోవటం వల్ల తీరకపోగా ,

 

ఈ మధ్య ఒకరోజు నేను గుడికి వెళ్తుంటే మా ఇంటికి దగ్గరలో రోడ్డు ప్రక్కన ఒక వ్యక్తి పడిపోయి ఉన్నాడు.

జనాలు అందరూ ఆ వ్యక్తి ప్రక్కనుంచే వెళ్తున్నారు కానీ, ఏమీ పట్టించుకోవటం లేదు.

ఆ వ్యక్తి చనిపోయాడో లేక ఆకలివల్ల కళ్ళు తిరిగి అలా పడిపోయాడో అనుకున్నా నేను. ఏం చేయాలో అర్ధం కాలేదు.

అలాగే గుడికి వెళ్ళాను. గుడికి వెళ్ళానన్నమాటే కానీ, మనసంతా గందరగోళంగా ఉంది.

బ్లాగులో నీతులు చెప్పటమే కానీ, ఏమీ సాయం చెయ్యలేకపోయానే, ! అనిపించింది.

గుడినుండి తిరిగి వచ్చేటప్పుడు చూస్తే అలాగే పడి ఉన్నాడు ఆ వ్యక్తి.

అప్పుడు దగ్గరలోనే ఉన్న మా ఇంటికి వెళ్ళి ఇంట్లో మిగిలి ఉన్న కొద్దిగా అన్నం, కూర తీసుకువచ్చాను.

కానీ నాకు బెరుకుగా అనిపించింది. చూసేవాళ్ళు నాది ఓవర్ యాక్షన్ అనుకుంటారేమోనని .

చుట్టుప్రక్కలవారు నేను అన్నం తేవటం చూసి ఆ వ్యక్తిని పిలిచారు . అన్నం తింటావా ? అని గట్టిగా అడిగారు.

ఆ మాటలు విని ఆ వ్యక్తి కళ్ళు తెరిచాడు. కానీ లేవలేక పోతున్నాడు.

ఇలాంటప్పుడు మగవాళ్ళయితే ఏమైనా చెయ్యగలరు.
అప్పుడు చుట్టుప్రక్కల వారిని అడిగాను. అతనికి ఏమయ్యింది అని.

వాళ్ళు ఏమన్నారంటే , తాగి పడిపోయుంటాడు. అన్నం ఏం తింటాడు అన్నారు.

(అతను నిజంగా తాగి పడిపోయాడో లేక ఆహారం లేక పడిపోయాడో భగవంతునికే తెలియాలి. ).

ఆ మాట వినగానే నేను వెనక్కి తగ్గాను. తీసుకువెళ్ళిన ఆహారపదార్ధాలు ఆ వ్యక్తికి కొంచెం దూరంలో పెట్టి తిరిగి వచ్చేసాను.

తరువాత ఆ వ్యక్తి అన్నం తిన్నాడో లేదో నాకు తెలియదు.

( నేను అంతకన్నా ఏం సహాయం చేయలేకపోయాను. )

ఏంటో ! ప్రపంచం. కొందరికి డబ్బు లేక కష్టాలు.

కొందరికి డబ్బు ఎక్కువయ్యి కష్టాలు.

కొందరికి జబ్బుల వల్ల కష్టాలు, కొందరికి కుటుంబసభ్యులతో కష్టాలు.

కొందరికి తమ యొక్క కోపం, అసూయ,అత్యాశ వంటి గుణాల వల్లే కష్టాలు.

కొందరు ఇతరుల ప్రవర్తన భరించలేక తాగుడుకు అలవాటు పడతారు.

కొందరు తాము ఇతరులను కష్టపెట్టి తరువాత వచ్చే కష్టాలు భరించలేక తాగుతారు.


కుటుంబం సభ్యుల ప్రవర్తన భరించలేక తాగేవాళ్ళూ ఉన్నారు.

ఎలా తాగినా కూడా తాగేవాళ్ళకే నష్టం . ఆరోగ్యం పాడయితే పట్టించుకునేవారు కూడా ఉండరు.. .


ఏ కష్టాలైనా.... ఇలా తాగి పడిపోవటం వల్ల తీరకపోగా , కొత్త కష్టాలు మొదలవుతాయి.

ఇవన్నీ తెలిసినా కూడా వాళ్ళంతే.

ఇలాంటి వ్యక్తుల వల్ల వారి కుటుంబసభ్యులు కూడా నరకం అనుభవిస్తారు.

లోకంలోని ఇలాంటి కష్టాలన్నింటినీ మనం పోగొట్టలేకపోయినా , అందరూ చిత్తశుద్ధితో ప్రయత్నిస్తే చాలావరకూ పరిస్థితులు బాగుపడతాయి.

నేను సినిమాలు చూడటానికి టివీలు చూడటానికి , సరదాగా ఉండటానికి వ్యతిరేకిని కాదండి.

నేను కూడా సినిమాలు, సీరియల్సు చూస్తాను.( కొన్ని ) సినిమా వాళ్ళ గురించి పత్రికల్లో వచ్చే గాసిప్స్ కూడా చదువుతాను.
(
ఇప్పుడు మనుషుల మనస్తత్వాలు ఎలా ఉన్నాయో తెలుస్తుంది కదా !.)

అయితే ప్రతీదానికీ ఒక పద్ధతి ఉంటుంది కదా !

ఉదా...ఒక కుటుంబం అందరూ హాల్లో కూర్చుని టీవీలో సీరియల్ చూస్తుండగా , వెనుక తలుపునుండి దొంగలు చొరబడి ఇల్లంతా దోచుకుపోయారని కొంత కాలం క్రితం ఒక వార్త చదివాను.

ఇల్లును అంత అజాగ్రత్తగా వదిలేసి అంతలా టీవీ చూడటమేమిటి ? అనిపిస్తుంది కదా !

అలాగే దేశాన్ని దొంగలు దోచుకుపోతుంటే ఏమీ పట్టనట్టు సినిమాలూ, సీరియళ్ళు చూసుకుంటూ ఉండటం ఏం బాగుంది ?

దేశం పాడైపోతే మనకూ ప్రమాదమే కదా ! . అని నా అభిప్రాయం.

దేశాన్ని బాగుచేసుకోవాలంటే పెద్దగా ఉద్యమాలు చెయ్యటమే కాదు...

ఎవరి పనిని వారు నీతిగా, నిజాయితీగా ,సక్రమంగా నిర్వర్తించినా చాలు , సమాజంలోని చాలా సమస్యలు పరిష్కారమవుతాయి.

కానీ, సమాజంలో నైతిక విలువలు బాగా లోపించటమే ఇప్పుడు పెద్ద సమస్య.

అయితే ఇప్పటికీ మంచివారూ, దైవభక్తి కలవారు , నీతీ, నిజాయితీ కలవారూ, మేధావులు ఎందరో ఉన్నారు.

అందరూ గట్టిగా ప్రయత్నిస్తే ఈ దేశం ప్రపంచానికే ఆదర్శమవుతుంది.మార్గదర్శి కూడా అవుతుంది.


Wednesday, November 2, 2011

" రాముడు గొప్పా ? రామనామము గొప్పదా ? "

 

మొన్న " హరిసేవ " బ్లాగులో వారు వ్రాసిన
" రాముడు గొప్పా ? రామనామము గొప్పదా ? " అనే టపా చదివానండి. చక్కటి టపా. నాకు బాగా నచ్చింది.

అందులో వారు ఇలా వ్రాశారు.. భగవంతుడూ, ఆయన నామమూ వేరుకావు. అలాగే, రాముని కంటే రామనామమే గొప్పది. నిర్మలమైన మనస్సుతో రామనామాన్ని నిశ్చలంగా జపిస్తూ వున్న హనుమంతునిపై ఆ శ్రీరాముడే బాణం వేసినప్పటికీ అది ఆయనను ఏమీ చేయలేకపోయింది.... అని వ్రాశారు.

ఆ టపా చదివిన తరువాత ,నాకు ఇంకా ఏమనిపించిందంటేనండి,

" రాములవారూ గొప్పవారే....రామనామమూ గొప్పదే "
అంటే ఇంకా బాగుంటుంది కదా ! అనిపించిందండి.

అలా నా అభిప్రాయాలతో కామెంట్ వ్రాసాను.

తరువాత నా కామెంట్ చూసుకుంటే అందులో ఇలా ఉంది.

" రాములవారి నామమూ గొప్పదే. రామనామమూ గొప్పదే. తప్పనిపరిస్థితిలో రాములవారు హనుమంతుల వారిపై బాణం వేసినా ..........రామునికి హనుమంతునియందుగల అపారమైన వాత్సల్యం వల్ల హనుమంతునికి ఏమీ హాని జరగలేదు. అనీ,"

నాకు చాలా ఆశ్చర్యం కలిగింది.

ఇదేమిటి ?నేను
" రాములవారూ గొప్పవారే...రామనామమూ గొప్పదే . " అని కదా వ్రాయాలనుకున్నాను.

మరి " రాములవారి నామమూ గొప్పదే.. రామనామమూ గొప్పదే " అని వ్రాశానేమిటి ?

ఈ పొరపాటు ఎలా జరిగింది ? అని ఆలోచిస్తూ ....

జరిగిన పొరపాటుకు బాధపడుతూ  అలా ఆలోచిస్తూ ఉండగా నాకు కొన్ని ఆలోచనలు కలిగాయి.

ఏమంటే,

" రామునికంటే ..... రామనామమే గొప్పది " అని
పండితులు చెబుతున్న విషయం కూడా కొన్ని కోణాలనుండి చూస్తే సరైనదే అని అనుకోవచ్చు అనిపించింది.

ఎలా అంటే , బాహ్యదృష్టితో చూస్తే రామావతారానికి ముగింపు ఉంది.

కానీ, " రామ " నామానికి ముగింపు ఉండదు.

ఇప్పుడు రాములవారి రూపాన్ని అందరూ చూడలేరు.

అవతారమూర్తులు, కొందరు పుణ్యాత్ములు, ఇంకా రామదాసు వంటి భక్తులు ,తానీషా
ప్రభువు వంటి కొందరు, ఇలా కొందరు మాత్రమే చూడగలరు.

కానీ, రామ నామము అలాకాదు.

సామాన్యులకు, అసామాన్యులకు, వారూవీరూ అని భేదం లేకుండా అందరికీ ,ఎప్పుడయినా, ఎక్కడయినా రామనామాన్ని స్మరించుకుని, తలుచుకుని , పాడుకుని ఆనందించే అవకాశం అందుబాటులో ఉంది కదా !

ఇప్పుడు నాకనిపిస్తూంది.

1..రాముని కంటే రామనామమే గొప్పది..

2..రాములవారూ గొప్పవారే....రామనామమూ గొప్పదే..

ఈ రెండు అభిప్రాయాలూ సరైనవే. అని..

ఇంకా ఏమనిపించిందంటే,మన తెలివితేటలంటూ ఏమీ ఉండవు.
ఒకోసారి మనం అనుకున్నట్లు వ్రాయాలన్నా వ్రాయలేము. అనీ,

పొరపాట్ల వల్ల కూడా కొత్త ఆలోచనలు వస్తాయని తెలిసింది.

* అంతా దైవం దయే ....