koodali

Sunday, October 31, 2010

భగవంతుడు చండశాసనుడు కాదు...............................పరమ కరుణా సముద్రుడు , మనకు జన్మజన్మల ఆత్మ బంధువు..

సాయి సాయి

పూజా నియమములను ఉన్నదున్నట్లు తెలుసుకోవటం ఎంతో అవసరం. ఎందుకంటే ఎంతో కష్టపడి కఠిననియమములను పాటించి ................. దైవాన్ని ఆరాధించి శీఘ్రముగా పరమాత్మను పొందాలనుకొనేవారు ఎందరో ఉంటారు.

సామాన్యులు కూడా సరియైన పధ్ధతులను తెలుసుకోవటం ద్వారా వారికి వీలయినంత నియమములను పాటించటానికి ప్రయత్నిస్తారు.

అసలు లౌకికపరమయిన కోరికలను (విద్య, ఉద్యోగం ) సాధించాలంటేనే, ఎన్నో కష్టాలు, త్యాగాలు అవసరమవుతాయి. అలాంటిది మరి, అత్యున్నతమమయిన పరమాత్మను పొందాలంటే కొంచెం కష్టపడటం తప్పదు మరి.

ఏదైనా కష్టపడి పొందిన దానిలో ఉన్న తృప్తి ఎక్కువ కూడా కదండి.

అలాగని అన్ని నియమములను పాటించగలమా ? అని అందరూ నిరాశ చెందనవసరం లేదు. భగవంతుడు సామాన్యులకు, అసామాన్యులకు కూడా సులభంగా అందే అందరివాడు.

ఉదా.. అందరూ బోలెడు డబ్బు ఖర్చు పెట్టి పెద్ద ఎత్తున పూజలు చేయలేకపోవచ్చు.

అందరికి పెద్ద పెద్ద గ్రంధములు చదివి భగవంతుని గురించి విస్తారంగా తెలుసుకొనే పాండిత్యం లేకపోవచ్చు.

కొందరు ఆరోగ్యం సహకరించకపోవటం, ఇంకా, రకరకాల కారణముల వల్ల కఠిననియమములను పాటించలేకపోవచ్చు.

కానీ భగవానుడు భక్తసులభుడు. కేవలం ప్రేమభక్తి ఉన్నంత మాత్రమునే దైవం భక్తులను అనుగ్రహించిన కధలెన్నో మనకు ఉన్నాయి. అందుకని ఎవరూ నిరాశ పడనవసరంలేదు.

శ్రీ వైభవలక్ష్మీ పూజా వైభవము పుస్తకములో ఏ విధమైన కోరికలు లేకుండా ,కేవలం భక్తితో మాత్రమే అమ్మవారిని ఆరాధించేవాళ్ళు సామాన్యనియమములను పాటించటం తప్ప కఠిననియమములను పాటించనవసరంలేదని నేను చదివానండి.

మరి మన లౌకికపరమైన కోరికలు తీరాలంటే చేసే పూజలలొ నియమాలను పాటించటానికి మనము కష్టపడకపోతే ఎవరు కష్టపడతారు ? ...........ఆ కోరికలు కూడా ప్రపంచానికి కీడు చేసేవిగా ఉండకూడదు. ఇంకా,.

శిరిడి సాయి ఇలా అన్నారట....." ఎవరు అదృష్ష్టవంతులో ఎవరి పాపములు క్షీణించినవో, వారు నా పూజ చేసెదరు. ఎల్లప్పుడు సాయి సాయి యని నీవు జపించినచో నిన్ను సప్తసముద్రములు దాటించెదను. ఈ మాటలను విశ్వసింపుము. నీవు తప్పక మేలు పొందెదవు. పూజాతంతుతో నాకు పనిలేదు. షోడశోపచారములు గాని, అష్టాంగయోగములు గాని నాకు అవసరంలేదు. భక్తి యున్నచోటనే నా నివాసము " అని...

 

No comments:

Post a Comment