ఓం
శ్రీరామమందిరము ప్రారంభమవుతోంది.
సీతారాములకు వందనములు.
ఈ శుభ సందర్భముగా అందరికీ శుభాకాంక్షలు.
శ్రీరామమందిరం కొరకు ఎందరో కలలు కన్నారు. ఎందరో ఎన్నో త్యాగాలు చేసారు. కష్టాలు అనుభవించారు.
దైవం దయవల్ల కల నిజమయ్యింది.
లోకం అంతా సుఖసంతోషాలతో ఉండాలి.
ఓం
శ్రీరామమందిరము ప్రారంభమవుతోంది.
సీతారాములకు వందనములు.
ఈ శుభ సందర్భముగా అందరికీ శుభాకాంక్షలు.
శ్రీరామమందిరం కొరకు ఎందరో కలలు కన్నారు. ఎందరో ఎన్నో త్యాగాలు చేసారు. కష్టాలు అనుభవించారు.
దైవం దయవల్ల కల నిజమయ్యింది.
లోకం అంతా సుఖసంతోషాలతో ఉండాలి.
వ్రాసిన కొన్ని పోస్టుల లింక్స్...లింక్స్ పైన క్లిక్ చేసి చదవగలరు..
పోస్టులు అన్నీ నాకు ముఖ్యమేనండి. అయితే, కొన్ని పోస్టులను ఇక్కడ ఇస్తున్నాను.
ఒకరి సంపద 100 కోట్లు.....ఒకరి సంపద 100 ..
రోబోట్లు వచ్చినా ..ఉద్యోగాలు ఎన్నో ఉంటాయి...
ఓం..కొన్ని సందేహాలు..సమాధానాలు..
.భగవంతుడా నాకు ఇంతే ఓపిక దయచేసి ...
ఈ ఆక్సిజన్, హైడ్రోజన్ లు అన్నీ కలిసి శరీరం.
డబ్బు బాగా ఉన్నవాళ్ళలో కూడా పేదవాళ్ళు ఉంటారు.
సమాజంలో సతీసహగమనం.. వ్యాపించటానికి ..
ఆలోచన రెండు వైపులా పదునున్న కత్తిలాంటిది...
దైవం గురించి ప్రసిద్ధ శాస్త్రవేత్త ఐన్ స్టీన్ ...
ఇలాంటి విషయాలలో మనకు తెలియని ఎన్నో అర్ధాలు ద...
పాతకాలంలో నెలసరి రోజుల్లో స్త్రీలు ఎన్నో నియమాలను పాటించేవారు. ప్రాచీనులు కొన్ని నియమాలను చెప్పారు.. అయితే కొందరు వాటిని ఎక్కువ చేసి, మూఢత్వంగా తయారుచేసారు. ఇది ఎక్కడవరకు వెళ్ళిందంటే, కొన్ని ప్రాంతాలలో నెలసరిలో ఉన్న స్త్రీల కొరకు బయట చిన్నగుడిసె వేసి మూడు రోజులూ అక్కడ కూర్చోవటమనే స్థాయికి కూడా వెళ్ళింది. మరికొందరి విషయంలో దూరంగా గుడిసెలో కూర్చోకపోయినా ఇంట్లోనే పక్కన కూర్చోబెట్టి, ఒక అసహ్యకరమైన వ్యక్తిని చూస్తున్నట్లు వారితో ప్రవర్తిస్తారు.
నేపాల్ లో చాలా ప్రాంతాలలో ఇలా దూరంగా గుడిసెలలో ఉంచే ఆచారం ఉందట. ఆలా ఉంచటం వల్ల పాములు, తేళ్లు కుట్టి కొందరు చనిపోయారట. కొందరు అనారోగ్యం పాలయ్యారట. కొన్ని అఘాయిత్యాలు కూడా జరిగాయని వ్రాసారు. ఇప్పుడు ప్రభుత్వం అలా గుడిసెలలో ఉండటాన్ని నిషేధించిందట. మనదేశంలో కూడా కొన్ని ప్రాంతాలలో నెలసరి స్త్రీలను వేరే గుడిసెలలో ఉంచటం అనే పద్ధతి ఉందట.
మహారాష్ట్రలో కొన్నిచోట్ల నెలసరిలో ఉన్న స్త్రీల కొరకు కొన్ని స్వచ్చంద సంస్థలు గుడిసెల బదులు సౌకర్యాలతో కూడిన ఇళ్ళను కట్టి అక్కడ ఉంచుతున్నారట. నెలసరి అని ఇలా ఇళ్ళకు దూరంగా ఉంచటం ఏంటో ఖర్మ.
ఇలా తల్లులు ఇంటికి దూరంగా ఉన్నప్పుడు చంటి పిల్లలు తల్లికొరకు ఏడుస్తారు. పిల్లల్ని ఇరుగుపొరుగుదగ్గర వదలకూడదు. ఏంటో ఇవన్నీ. ఆచారాలలో మూఢత్వం ప్రవేశించకూడదు.
నెలసరి సమయంలో గర్భసంచి సున్నితంగా ఉంటుంది. అందువల్ల ఎక్కువ పనిచెయ్యకుండా, కొంత రెస్ట్ ఉండటం, అనారోగ్యం లేకుండా కొన్ని నియమాలను పాటించటం.. వంటివి మంచిదే కానీ, ఆ పేరుతో అతి చేయటం సరైనది కాదు. కొందరైతే, నెలసరి వచ్చిన వారిని చూసి అసహ్యంగా చూస్తూ దూరంగా తప్పుకోవటం, వారికి కంచంలో కొద్దిగా ఆహారాన్ని వేసి, దూరం నుంచి ప్లేటును నెట్టటం..వంటివి చేస్తుంటారు. ఇక పండుగలప్పుడు, వివాహాదిశుభకార్యాలప్పుడు నెలసరి వస్తే , వచ్చిన వారిని తిట్టిపోస్తారు. అనేకమంది నెలసరి రాకుండా మందులు వాడుతూ ఆరోగ్యాలు చెడగొట్టుకుంటున్నారు.
నెలసరి అంటే సంతానానికి సంబంధించిన విషయం. నెలసరి లేనిదే సంతానం లేదు. ఆ సమయంలో వారిని పక్కన కూర్చోబెట్టి, కొంత రెస్ట్ ఇచ్చి, ఆరోగ్యకరమైన భోజనం వండి ఇచ్చి, మంచిగా చూసుకోవచ్చు. వారిపట్ల అగౌరవంగా ప్రవర్తించకూడదు.
ఈ రోజుల్లో నెలసరి సమయంలో స్త్రీలు కాలేజీలకు, ఉద్యోగాలకు, పనులకు వెళ్తున్నారు కదా..మరి అంటుముట్టు ఎలా పాటిస్తారు?
నెలసరిలో స్త్రీలనుండి నెగటివ్ఎనెర్జీ వస్తుందని కొందరు అంటున్నారు. పాపాలు చేసేవారినుండి, మద్యమాంసాలు తీసుకున్నవారి నుండి కూడా నెగటివ్ ఎనెర్జీ వస్తుంది.
అందుకే, పాపాలు చేసేవారికి దూరంగా ఉండాలంటారు. ...దుష్టులకు దూరంగా ఉండటం కుదరనప్పుడు, మంచివారు దైవస్మరణ చేసుకోవాలి.
పాపాలు చేసేవారినుండి వచ్చే నెగటివ్ ఎనెర్జీతో పోల్చుకుంటే, ప్రకృతిసహజమైన నెలసరి వల్ల వచ్చే నెగటివ్ ఎనెర్జీ ఫరవాలేదు.
ఆచార వ్యవహారాలను మంచిగా పాటించాలి. మూఢత్వంగా మారకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.
ఒక లింక్..